జూదం ఆడుతున్న 4గురుజూదగళ్లుఅరెస్టుఇద్దరుపరారీ4750నగదుస్వాదీనం5మొబైల్ ఫోన్లుసీజ్ ఎస్పీశ్రీనివాస్ రావు నలుగురు జూదగాళ్లు అరెస్టు ఇద్దరుపరారీ,4750 నగదుఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ దేవలపల్లి శ్రీనివాస్ రావు తెలిపారు. ఎస్పికథనంప్రకారంమధ్యాహ్నంకథనంప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మెదక్ జిల్లా చిల్బుచేడు మండలం శీలం పల్లి గ్రామ శివారులో డంప్ యార్డ్ సమీపంలో ప్రభుత్వం నిషేధించిన జూదమండుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వారి నుండి 4750 నగదు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అరెస్టు అయినవారిలో వెంకటాపురం లక్ష్మణ్ జూకంటి లోకయ్య మన్నె ప్రసాద్ ఎల్లయ్య గారి భూమిరెడ్డి ఉన్నారు ఈ ఘటనలో పాల్గొన్న రాకేష్ పెద్దోళ్ల సుధాకర్ రెడ్డి పరారీలో ఉన్నారు ఈ మేరకు చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జిల్లాల్లో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై 100 కాల్ ఫోన్ చేసి పోలీసులకుసమాచారంఇచ్చి సహకరించాలని కోరారు.
జూదం ఆడుతున్న 4గురుజూదగళ్లుఅరెస్టుఇద్దరుపరారీ4750నగదుస్వాదీనం5మొబైల్ ఫోన్లుసీజ్ ఎస్పీశ్రీనివాస్ రావు నలుగురు జూదగాళ్లు అరెస్టు ఇద్దరుపరారీ,4750 నగదుఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ దేవలపల్లి శ్రీనివాస్ రావు తెలిపారు. ఎస్పికథనంప్రకారంమధ్యాహ్నంకథనంప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మెదక్ జిల్లా చిల్బుచేడు మండలం శీలం పల్లి గ్రామ శివారులో డంప్ యార్డ్ సమీపంలో ప్రభుత్వం నిషేధించిన జూదమండుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వారి నుండి 4750 నగదు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అరెస్టు అయినవారిలో వెంకటాపురం లక్ష్మణ్ జూకంటి లోకయ్య మన్నె ప్రసాద్ ఎల్లయ్య గారి భూమిరెడ్డి ఉన్నారు ఈ ఘటనలో పాల్గొన్న రాకేష్ పెద్దోళ్ల సుధాకర్ రెడ్డి పరారీలో ఉన్నారు ఈ మేరకు చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జిల్లాల్లో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై 100 కాల్ ఫోన్ చేసి పోలీసులకుసమాచారంఇచ్చి సహకరించాలని కోరారు.
- శభాష్పల్లి గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. మంగలి పెంటయ్య పొలం వద్ద ఉన్న 25 కేవీ డీటీఆర్ను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళలో కింద పడగొట్టి ట్రాన్స్ఫార్మర్లోని విలువైన ఆయిల్ను దొంగిలించారు. ఈ దారుణ ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానికులు వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిశీలన చేపట్టారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ శుక్రవారం నంగునూరు మండలంలోని నర్మెట్టలో ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఫ్యాక్టరీ లో అడిషనల్ DGP మహేష్ భగవత్, ఐజి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కే. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాళ్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పలువురు అధికారులు పర్యటించి కార్యక్రమం నిర్వహించనున్న సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ మేరకు ప్రజా పాలనలో రైతు మహోత్సవం నిర్వహిస్తున్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. పెద్ద సంఖ్యలో రైతులు మరియు ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ యాజమాన్యం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్ధిపేట రూరల్ సీఐ శ్రీను, రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 22వ తేదీ నాడు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారిక పాసులను జారీ చేయడం జరుగుతుందని, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి కాన్వాయ్, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, స్టాళ్ల సందర్శన, ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరణ, వివిధ నిర్మాణాల ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యట పర్యటన వివిధ స్థాయిలలో విధులను కేటాయించిన అధికారులు మాత్రమే ఉండి ఆయా శాఖలకు కేటాయించిన విధులను తూచా తప్పకుండా పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రజలకు సరిపడు మరుగుదొడ్లు, త్రాగునీరు వసతి కల్పించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యుత్ సౌకర్యం, సౌండ్ సిస్టం, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజన్, వైద్య శిబిరం, పార్కింగ్, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ప్రాపర్ గా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిపిఓ రవీందర్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, ఫుడ్ సేఫ్టీ, వ్యవసాయ, ఉద్యానవన, ఐ అండ్ పిఆర్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి అడ్లురి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు, చాకలి వీరనారి ఐలమ్మ యూనివర్సిటీకి ₹400 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ₹26,674 కోట్లు కేటాయించడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా గత డిసెంబర్లో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు కేటాయించడం విద్యార్థులు, అధ్యాపకుల ఆశలను నెరవేర్చిన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఉన్నత విద్యాభివృద్ధికి కీలకంగా మారుతుందని, విశ్వవిద్యాలయ మౌలిక వసతుల అభివృద్ధి, పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు చందు, రాజేందర్, రాజు, ప్రవీణ్, చరణ్, అరుణ్, స్వామి, శ్రీనివాస్, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.1
- This Eid the world feels more like a mourning than a celebration A celebration shadowed by the world's tears Heart heavy world hurting This Eid feels different1
- వికారాబాద్ జిల్లా : పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ వారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజి లెటర్లకు,జూమ్ మీటింగ్ ద్వారా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పరీక్షలు సజావుగా జరిగేలా ఎలాంటి పొరపాట్లకు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరీక్షల్లో విధులు నిర్వహించే సిబ్బంది వద్ద పరీక్షలు నిర్వహించే ప్రాంగణంలో మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా బిక్కనూర్ : ఈనెల 23న తై బజార్ వేలంపాట, బిక్కనూరు పట్టణ తై బజార్ వేలంపాటను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు గ్రామ సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు. వారసంతతో పాటు రోజువారీ సంతలకు ఈ వేలం జరుగుతుందన్నారు. పాల్గొనేవారు రూ. 10,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం గ్రామ సచివాలయంలో సంప్రదించాలని కోరారు. నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియ పారదర్శకగా జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని Sri Raja Rajeshwara Swamy Temple లో జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తేది 19-03-2026 గురువారం నుండి చైత్ర శుద్ధ నవమి తేది 27-03-2026 శుక్రవారం వరకు వసంత నవరాత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించబడనున్నాయి. చైత్ర శుద్ధ నవమి రోజైన 27-03-2026 శుక్రవారం నాడు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఆలయ పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి గారు ఈరోజు భీమేశ్వర సదన్ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగాక్యూలైన్లు చలి వేంద్రాలు, పందిళ్లు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ అన్న ప్రసాదం పంపిణీ భారీ ప్రవేశ ద్వారాలు (గేట్లు) విద్యుత్ దీపాల అలంకరణ కూలర్లు కళ్యాణ వేదికను రంగురంగుల పూలతో అలంకరణ తో పాటు హెల్త్ క్యాంపులు, ఫైర్ ఇంజిన్ సదుపాయం, ప్రత్యేక బస్సులు, సేవా సమితుల సహకారం, పారిశుభ్రత ఏర్పాట్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమాదేవి మాట్లాడుతూ, శ్రీరామనవమి మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ *_2026-27 సం,, యొక్క తైబజార్ మరియు పశువుల సంత ఆదాయం 89,00,000/-_* తేదీ:20-03-2026 రోజున గౌరవ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, కమీషనర్ R వెంకట గోపాల్ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరం యొక్క *తైబజార్ మరియు పశువుల సంతను* కార్యాలయంలో వేలంపాట నిర్వహించడం జరిగినది. ముందుగా తైబజార్ వేలంలో 21 మంది పాల్గొనగా అత్యధికంగా E. భిక్షపతి రూపాయలు 70లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. పశువుల సంత వేలంలో 32 మంది పాల్గొనగా అత్యధికంగా T రాజేశం 19లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మేనేజర్, మరియు కార్యాలయ సిబ్బంది పలుగోనడం జరిగినది. *కమీషనర్* *పురపాలక సంఘo* *గజ్వేల్-ప్రజ్ఞాపూర్*4