Shuru
Apke Nagar Ki App…
మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణి కే.. INTUC నేత జనక్ ప్రసాద్ మణుగూరు బొగ్గు బ్లాక్ ను సింగరేణి కే కేటాయించాలని ఎన్నోబ్రకల పోరాటాలు చేసిన ఫలితంగా ఆ బొగ్గు బ్లాక్ ను సింగారం కి కేటాయించారని ఇది కార్మికుల విజయం ఆన్నారు.
Telangana reporter
మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణి కే.. INTUC నేత జనక్ ప్రసాద్ మణుగూరు బొగ్గు బ్లాక్ ను సింగరేణి కే కేటాయించాలని ఎన్నోబ్రకల పోరాటాలు చేసిన ఫలితంగా ఆ బొగ్గు బ్లాక్ ను సింగారం కి కేటాయించారని ఇది కార్మికుల విజయం ఆన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సనాతన ధర్మ పరిరక్షణకు సమాజమంతా ఏకం కావాలి : BJP కందుల సంధ్యారాణి వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామాలయ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అతిథిగా వచ్చిన బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ను శుద్ధి చేసిన కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ను కాంగ్రెస్ శ్రేణులు నీళ్లతో కడిగి శుద్ధి చేశాయి. నిన్నటి బిఆర్ఎస్ నాయకుల పర్యటనతో పంప్హౌస్ అపవిత్రమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. ఇక్కడికి వస్తున్నది ఎల్లంపల్లి నీళ్లేనని, కాళేశ్వరం నీళ్లంటూ బిఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బిఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇకపైనా డ్రామాలు ఆడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు.1
- *ఆదివాసీలపై అటవీఅధికారుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం* *దాడి చేసిన అధికారులపై సత్వరమే తగు చర్యలు చేపట్టాలి* *దాడిలో గాయపడిన యువకులకు ప్రభుత్వమే వైద్యం అందించాలి* *గాయపడిన యువకులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలి *ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్? *ఆదివాసీలపై అటవీఅధికారుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం* *దాడి చేసిన అధికారులపై సత్వరమే తగు చర్యలు చేపట్టాలి* *దాడిలో గాయపడిన యువకులకు ప్రభుత్వమే వైద్యం అందించాలి* *గాయపడిన యువకులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలి* *ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్* తేది: 03-08-2026(సోమవారం): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్ పల్లి అటవీ ప్రాంతం పరిధిలో ఆదివాసి యువకులపై కొంత మంది అటవీ అధికారులు పాశవికంగా దాడి చేసి వారిని ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో నిర్బంధించి ఉంచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటి ఒక ప్రకటనలో తెలిపినది. ఈ సందర్భంగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి మాట్లాడుతూ గతంలో నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామస్థులపై కూడా అటవీ అధికారులు దాడులు చేసినారని, ఇప్పుడు ఇంధన్ పల్లి అటవీ ప్రాంతంలో చేపలు పట్టటానికి వెళ్ళిన ఆదివాసి యువకులపై దాడి చేసి నిర్బంధించటం సిగ్గు చేటని, ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, ఇవి భవిష్యత్తులో మరో ఉద్యమానికి దారి తీస్తాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడి చేసిన అధికారులపై సత్వరమే చర్యలు చేపట్టాలని, గాయపడిన యువకులకు ప్రభుత్వమే వైద్యం అందించి తగిన నష్ట పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే తగు ఆదేశాలు జారీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆదివాసి సంఘాలు, అన్ని వర్గాలతో కలిసి ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.1
- బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సిపిఐ ప్రచార యాత్ర సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకే సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని జిల్లా వ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రచార యాత్ర కొనసాగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం బండ రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు నిరాశ నిస్పృహలు పెరిగిపోయి ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యంలో అతి పెద్దది నిరుద్యోగమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు,డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని, ధరల పెరుగుదలను నియంత్రించలేని మోడీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. దేశానికి వెన్నెముక లాంటి అన్నదాతలను ఆదుకోవడం లేదని, వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ ఇంకా పరిష్కారం కాలేదన్నారు. విద్య,వైద్యం కార్పొరేట్ శక్తుల్లో మగ్గుతుందని, కార్మికులు చెమటోడ్చి సంపాదించిన దేశ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని, మహిళా సాధికారత గురించి పదేపదే మాట్లాడే బిజెపి నేతలు వారి రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని శ్రీనివాస్ ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ బద్లావ్ జరూరీ హై - మార్పు కావాలని సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లాలో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని దానిని జయప్రదం చేయాలని సిపిఐ శ్రేణులకు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశములో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి,పిట్టల సమ్మయ్య మండల కార్యదర్శులు బండ రాజిరెడ్డి,గోవిందుల రవి, చొక్కల్ల శ్రీశైలం,లంకదాసరి కల్యాణ్,ఎస్. కే .మౌలానా తదితరులు పాల్గొన్నారు.1
- వార్తకు స్పందించిన అటవీశాఖ.. కవ్వాల్ టైగర్ జోన్లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో బారికేడ్లు రాత్రివేళ కనిపించక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందంటూ ఇటీవల ప్రచురితమైన వార్తకు అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్ల వద్ద అవసరమైన సూచికలను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు. గతంలో బారికేడ్ల వద్ద ముందస్తు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చీకటిలో బారికేడ్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై వార్త వెలువడిన వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ప్రధాన రహదారి వెంట "GO SLOW", "అడవి జంతువుల కోసం నెమ్మదిగా వెళ్లండి" వంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే బారికేడ్లు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ సూచికలు ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని సమాచారం. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా టైగర్ జోన్ పరిధిలోని అన్ని బారికేడ్ల వద్ద భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.1
- మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణి కే.. INTUC నేత జనక్ ప్రసాద్ మణుగూరు బొగ్గు బ్లాక్ ను సింగరేణి కే కేటాయించాలని ఎన్నోబ్రకల పోరాటాలు చేసిన ఫలితంగా ఆ బొగ్గు బ్లాక్ ను సింగారం కి కేటాయించారని ఇది కార్మికుల విజయం ఆన్నారు.1
- నడుచుకుంటూ వెళ్తూ. వేములవాడలో గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఓ యువకుడు కుప్పకూలి మృతి చెందిన ఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన కోరేపు దుర్గప్రసాద్ (31) అనే యువకుడు ఈరోజు సోమవారం మధ్యాహ్నం తన ద్విచక్రవాహనాన్ని పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గమనించిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు దుర్గప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వృత్తిరీత్యా పెయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న దుర్గప్రసాద్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న యువకుడు హఠాత్తుగా మృతి చెందడంతో వేములవాడలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.1