*కార్మికులకు హాని కలిగించే కార్మిక చట్టాల రద్దుకై ఉద్యమించండి ----ఏఐటీయూసీ* ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ ) ఆత్మకూరు నియోజకవర్గం మొదటి మహాసభ స్థానిక సివిల్ సప్లై ఆఫీస్ నందు చెంచయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి. జిలాని ఖాన్, శంకర్ కిషోర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి. జిలాని ఖాన్, శంకర్ కిషోర్ మాట్లాడుతూ కార్మికులకు హాని కలిగించే కార్మిక చట్టాల రద్దుకై కార్మికులంతా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో కార్మికులకు భద్రత కోసం ఉన్న లేబర్ కోడ్స్ ను రద్దు చేసి కార్మికులకు హాని కలిగించే లేబర్ కోడ్స్ ను తీసుకురావడం వెనుక కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీల మీద బిజెపి ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో మరోసారి అర్థమవుతుంది. దేశంలో ఆదాని, అంబానీ కుటుంబాలు రోజురోజుకీ ప్రపంచ కుబేరులుగా ఎదుగుతూ ఉంటే కార్మికుడు మాత్రం రోజు తినడానికి తిండి లేక పేదరికంలో మగ్గిపోతున్నాడు. కార్మికులతో అండగా ఉంటామని చెప్తున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల పట్టబడుతూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయి. సమావేశం అనంతరం ఏఐటీయూసీ నియోజకవర్గ సమితిని 15 మందితో ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా నరసింహులు,హరి ఉపాధ్యక్షులుగా హజరత్, సహాయ కార్యదర్శిగా చెంచయ్య, కొండయ్య కోశాధికారిగా టీ మాధవను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జంగం నాగరాజు, కార్మికులు పాల్గొన్నారు.
*కార్మికులకు హాని కలిగించే కార్మిక చట్టాల రద్దుకై ఉద్యమించండి ----ఏఐటీయూసీ* ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ ) ఆత్మకూరు నియోజకవర్గం మొదటి మహాసభ స్థానిక సివిల్ సప్లై ఆఫీస్ నందు చెంచయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి. జిలాని ఖాన్, శంకర్ కిషోర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి. జిలాని ఖాన్, శంకర్ కిషోర్ మాట్లాడుతూ కార్మికులకు హాని కలిగించే కార్మిక చట్టాల రద్దుకై కార్మికులంతా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో కార్మికులకు భద్రత కోసం ఉన్న లేబర్ కోడ్స్ ను రద్దు చేసి కార్మికులకు హాని కలిగించే లేబర్ కోడ్స్ ను తీసుకురావడం వెనుక కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీల మీద బిజెపి ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో మరోసారి అర్థమవుతుంది. దేశంలో ఆదాని, అంబానీ కుటుంబాలు రోజురోజుకీ ప్రపంచ కుబేరులుగా ఎదుగుతూ ఉంటే కార్మికుడు మాత్రం రోజు తినడానికి తిండి లేక పేదరికంలో మగ్గిపోతున్నాడు. కార్మికులతో అండగా ఉంటామని చెప్తున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల పట్టబడుతూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయి. సమావేశం అనంతరం ఏఐటీయూసీ నియోజకవర్గ సమితిని 15 మందితో ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా నరసింహులు,హరి ఉపాధ్యక్షులుగా హజరత్, సహాయ కార్యదర్శిగా చెంచయ్య, కొండయ్య కోశాధికారిగా టీ మాధవను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జంగం నాగరాజు, కార్మికులు పాల్గొన్నారు.
- Post by Bondhu Suresh1
- ఊటుకూరు లో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పార్లమెంటులో ఆంధ్రుల రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది4
- బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు. నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.2
- Post by RAVI KUMAR1
- కదిరి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. క స్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం విద్యార్థుల లో ఉన్న ప్రతిభను కనపరిచారు. ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఎస్.ఓ లక్ష్మీ , అన్నపూర్ణ , పి.ఇ.టి కోమల హాజరైయారు. కరాటే శిక్షణ పొందితే ఆత్మరక్షణతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.1
- పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకటే గౌడ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- Post by Bondhu Suresh1