Shuru
Apke Nagar Ki App…
అరకులోయలో ఆటో బోల్తా – పలువురికి గాయాలు............... అరకులోయ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాంధకి చెందిన గిరిజనులు ఆటోలో అరకు వారపు సంతకు వెళ్తుండగా దొరగుడ సమీపంలోని మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Nava surya
అరకులోయలో ఆటో బోల్తా – పలువురికి గాయాలు............... అరకులోయ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాంధకి చెందిన గిరిజనులు ఆటోలో అరకు వారపు సంతకు వెళ్తుండగా దొరగుడ సమీపంలోని మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Suryasatyanarayana R1
- కొత్తూరు మండలం సంగన్నగూడ నుండి కాకర కూడా దిమిలి గ్రామం వరకు 70 లక్షల రూపాయలు ఉపాధి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కోటమీ ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించి గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.1
- రాగోలు జేమ్స్ హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్లుకు అంటే ( సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన ఆంకాలజీ మరియు ఎండోకైనాలజీ) ప్రముఖ వైద్య నిపుణులచే ఆరోగ్య శ్రీ మరియు EHS పథకాల ద్వారా మెరుగైన వైద్యం చేయబడును. ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ.... క్యాన్సర్ ఉన్న పేషంట్ తెలియపరచి జేమ్స్ హాస్పిటల్ యొక్క సేవలను అందరికీ అందేటట్లు తోడ్పడతారని కోరుకుంటున్నాం. మరియు *అన్ని రకముల* *క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో కలవు* మరిన్ని వివరాలు సంప్రదించండి *రాపాక.తిరుపతిరావు మార్కెటింగ్ మేనేజర్ జేమ్స్ హాస్పిటల్ రాగోలు-శ్రీకాకుళం సెల్: 7093295821,7337222768*1
- Post by Meenakshi1
- Post by V Ramarao2
- Post by Gurrala vigeswara ramarao5
- రంపచోడవరం ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ (IAS) బదిలీ కావడంతో శనివారం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన ఆదివాసీలు తమ సాంప్రదాయ పద్ధతిలో ఆయనను సత్కరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, అధికారులు మరియు స్థానిక గిరిజనులు ఈ వీడ్కోలు సభలో భావోద్వేగంగా పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.1
- విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. శనివారం కొత్తూరు మండలం వసప కేజీబీవీ జూనియర్ కాలేజ్లో నిర్మించిన అదనపు వసతుల గదులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.1
- ప్రచురనార్థం మందస,ఏప్రిల్ 25 కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపుదోపిడికి ఎందుకు పాల్పడుతున్నారో కేంద్ర పౌర విమానాయా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు ప్రశ్నించారు. వామపక్షాల ఆధ్వర్యంలో 25 26 తేదీల్లో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని, వేధింపులు ఆపాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పర్యటనలో భాగంగా హరిపురంలో కామ్రేడ్ మార్పు పద్మనాభం విగ్రహానికి పూలమాలవేసి పర్యటనకు వెళ్తున్న వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు .సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు పాటు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్కు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో పర్యటన కెళ్తే ప్రభుత్వం ఎందుకుభయపడుతుందని ప్రశ్నించారు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్ధానాన్ని ఉరితీస్తారా? అని ప్రశ్నించారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులు భూములను కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో సుమారు 5 లక్షల చెట్లు నరికి వేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు.1