Shuru
Apke Nagar Ki App…
SIR వేగవంతం చేయాలి.. బీఎల్వోలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచన అక్రమ ఎయిర్టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి
FOCUS MEDIA
SIR వేగవంతం చేయాలి.. బీఎల్వోలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచన అక్రమ ఎయిర్టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి
More news from తెలంగాణ and nearby areas
- ఫోన్ ఎత్తలేదని స్నేహితుల వినూత్న ప్రతీకారం.. బ్యాండు మేళాతో ఇంటిపైకి దండయాత్ర! స్నేహితులు అంటేనే అల్లరి, సరదాలు, కొట్లాటలు. అయితే, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో ఓ గ్రూప్ ఫ్రెండ్స్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుమార్ భాయ్ అనే వ్యక్తి తన స్నేహితుల ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో, వారంతా ఊరుకోకుండా వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నారు. "కుమార్ భాయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే బ్యాండు మేళాలతో అతని ఇంటికి వెళ్తున్నాం" అంటూ వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డప్పు చప్పుళ్లు, కేరింతలతో నేరుగా అతని ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఈ ఊహించని షాక్ చూసి కుమార్ అవాక్కై, ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీ ఫ్రెండ్స్ లోనూ ఫోన్ ఎత్తని వాళ్లుంటే ఈ ఫన్నీ వీడియోను వారికి వెంటనే షేర్ చేయండి!1
- DANGER: పిల్లలకు టీ, కాఫీ తాగిస్తున్నారా?.... 12ఏళ్ల లోపు పిల్లలకు టీ లేదా కాఫీలు ఇవ్వడం ఆరోగ్యానికి చాలా హానికరం అని పిల్లల వైద్యుడు గౌతమ్ హెచ్చరించారు. టీలో టానిన్లు, కాఫీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత వస్తుందని చెప్పారు. అలాగే ఇది ఆకలిని తగ్గించడంతో పాటు హైపర్ యాక్టివిటీ పెరగడం, నిద్రలేమి సమస్య లకు దారితీస్తుందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య రీత్యా వీటికి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు.1
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- అనాథ బాలుడి చదువుకు గురువు అండ.. భవిష్యత్ కోసం ప్రత్యేక నిధికి శ్రీకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి నానమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు. ఎన్నో ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మంగ నర్సింలు బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమ్ కుమార్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అతని భవిష్యత్ విద్య కోసం ప్రత్యేక ఆర్థిక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ నిధికి తొలి విరాళంగా రూ.5,116 అందజేస్తానని ప్రకటించి, దాతలు ముందుకు వచ్చి బాలుడి విద్యాభారాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు.1
- భువనగిరి: సైబర్ మోసం.. వీడియో కాల్తో బెదిరింపులు అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మన్మధ కుమార్ సూచించారు. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి స్కీన్షాట్లు తీసిన మోసగాళ్లు, పోలీసు ఐడీ కార్డు డిపిగా పెట్టుకుని కేసు నమోదు కాకుండా డబ్బులు చెల్లించాలని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించి ఇది సైబర్ మోసమని గుర్తించారు. అపరిచిత కాల్స్, బెదిరింపులను నమ్మవద్దని సీఐ సూచించారు.1
- రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా వెలసిన పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రవణా నక్షత్ర పూజలను శ్రీ రామభక్త భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాయగిరి కమాన్ వద్ద డప్పు వాయిద్యాలు స్వామివారి కీర్తనలతో పాదయాత్ర నిర్వహించి స్టేషన్ రాయగిరి వద్ద గల వెంకటేశ్వర స్వామి గుట్టపైకి మెట్ల ద్వారా బయలుదేరి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అభిషేకాధి కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు వివిధ ప్రాంతాలకు చెందినవారు వందల మందిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన మండలి సభ్యులు గడ్డమీ చంద్రయ్య గౌడ్ పెద్దగాని శ్రీనివాస్ గౌడ్ సామల శ్రీరాములు నర రమేష్1
- SIR వేగవంతం చేయాలి.. బీఎల్వోలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచన అక్రమ ఎయిర్టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి1
- ఓవర్హెడ్ వైర్ షార్ట్ సర్క్యూట్: రైలు ప్రయాణికుల్లో భయాందోళన! BREAKING NEWS: రైల్వే ఓవర్హెడ్ విద్యుత్ లైన్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి ఘటనల్లో మొత్తం రైలుకు విద్యుత్ ప్రవహించి భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందా అనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఇప్పటికే పటిష్టమైన భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల పూర్తి రక్షణ కోసం రైల్వే శాఖ అత్యవసరంగా మరిన్ని అదనపు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #IndianRailways #TrainSafety #OverheadWire #ShortCircuit #RailNews1
- మోటకొండూరు: కారు ఆటో ఢీ కొట్టడంతో.. నలుగురికి గాయాలు... మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, వాహనాల్లో ఉన్న వారి వివరాలు తెలియాల్సి ఉంది.1