Shuru
Apke Nagar Ki App…
రేపల్లెలో కార్మిక సంఘాల రాస్తారోకో. అడ్డుకున్న పోలీసులు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైల్ భరో పిలుపులో భాగంగా రేపల్లెలో కార్మిక రైతు సంఘాల నేతలు రాస్తారోకో చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం రేపల్లె తాలూకా వద్ద రాస్తారోకో చేపట్టిన కార్మిక రైతు నిరసనకారులను రేపల్లె పట్టణ పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి మణిలాల్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులు కార్మికులు కూలీల సమస్యలు పరిష్కరించకపోవడం వారిని రోడ్డుపైకి తీసుకువచ్చారని విమర్శించారు.
M.Vijay Kishore
రేపల్లెలో కార్మిక సంఘాల రాస్తారోకో. అడ్డుకున్న పోలీసులు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైల్ భరో పిలుపులో భాగంగా రేపల్లెలో కార్మిక రైతు సంఘాల నేతలు రాస్తారోకో చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం రేపల్లె తాలూకా వద్ద రాస్తారోకో చేపట్టిన కార్మిక రైతు నిరసనకారులను రేపల్లె పట్టణ పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి మణిలాల్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులు కార్మికులు కూలీల సమస్యలు పరిష్కరించకపోవడం వారిని రోడ్డుపైకి తీసుకువచ్చారని విమర్శించారు.
More news from Bapatla and nearby areas
- భీమ్ జెన్ జడ్ సామూహిక నిరాహారదీక్షకు ఎస్సీ ఎస్టీలు తరలిరావాలి. ఈనెల 17వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద భీమ్ జెన్-జడ్ సామూహిక నిరసన దీక్షకు ఎస్సీ ఎస్టీలు తరలిరావాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పర్రె కోటయ్య పిలుపునిచ్చారు. సోమవారం రేపల్లెలో నిరాహార దీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 26 దళిత గిరిజన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారన్నారు. కూటమి నేతలు ఇచ్చిన హామీని సత్వరమే కొనసాగించాలన్నారు. 26 సంక్షేమ పథకాలు దశలవారీగా అమలు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రకటించినప్పటికీ ఓటమి ప్రభుత్వం రెండువేల పాలనలో ఒక్క దళిత గిరిజన సంక్షేమ పథకాన్ని కూడా పునరుద్ధరించకపోవడం ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పోతార్లంక శివ వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ పంతగాని నాగేశ్వరరావు, మాల మహానాడు రేపల్లె నియోజకవర్గం కన్వీనర్ చల్లపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు.1
- సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.......... ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న సీడ్ యాక్సిస్ రోడ్డు, ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి ఏర్పాట్లను అమరావతి డెవలప్మెంట్ చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, కలెక్టర్ సాయి కాంత్ వర్మ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ను ఆదేశించారు.1
- వాకింగ్ ట్రాక్ లో కంటి పరీక్షలు కరోనా తరువాత ప్రజలకు ఆరోగ్యం పట్ల రోజురోజుకీ శ్రద్ధ పెరుగుతున్న క్షేమం తెలిసింది. దీన్ని ఆసరాగా తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈరోజు గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ లో వాసం కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వాకర్స్ కు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా షుగర్ బీపీ చెక్ చేసి పలు సలహాలు ఇచ్చారు.1
- అల్లూరి జిల్లా కేంద్రంలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ!! అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలు, ప్లకార్డులు, బ్యానర్లతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాలతో కూడిన బ్యానర్ను ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కనిగిరి నియోజకవర్గం లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.177 కోట్లతో తాగునీటి వసతుల అభివృద్ధి చేపడుతుండగా, జగనన్న లేఅవుట్, మోడల్ స్కూల్ పరిసరాల్లో రూ.4 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. 5.5 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా వెయ్యికి పైగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడంతో పాటు, మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 11,500 ఇళ్లకు ఇంటింటికీ కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తూరు, కనిగిరి, కాశిరెడ్డి కాలనీ, ఎం.ఎన్.ఎం. కళాశాల సమీపంలో నాలుగు ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులకు అనుమతులు మంజూరు కాగా, పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రామతీర్థం రిజర్వాయర్ నీటిని వినియోగించడంతో పాటు, భవిష్యత్లో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కనిగిరి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు.1
- రేపల్లెలో కార్మిక సంఘాల రాస్తారోకో. అడ్డుకున్న పోలీసులు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైల్ భరో పిలుపులో భాగంగా రేపల్లెలో కార్మిక రైతు సంఘాల నేతలు రాస్తారోకో చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం రేపల్లె తాలూకా వద్ద రాస్తారోకో చేపట్టిన కార్మిక రైతు నిరసనకారులను రేపల్లె పట్టణ పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి మణిలాల్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులు కార్మికులు కూలీల సమస్యలు పరిష్కరించకపోవడం వారిని రోడ్డుపైకి తీసుకువచ్చారని విమర్శించారు.2
- అవనిగడ్డలో వైసీపీ భారీ ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు....... మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మోగా డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీరు విడుదల చేయాలని కోరారు. ర్యాలీకి అనుమతులు లేవని, నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని సింహాద్రి రమేష్ బాబు హెచ్చరించారు.4