Shuru
Apke Nagar Ki App…
జహీరాబాద్ చైర్ పర్సన్ కు మద్దతుపై కౌన్సిలర్ భర్త నిరసన జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎంఐఎం కౌన్సిలర్ భర్త యిర్మీయా గురువారం నిరసన తెలిపారు కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి తప్పు చేశానని ఎన్నికల తర్వాత తమ వార్డులో అభివృద్ధి పనులు జరగడం లేదుని ఆరోపించారు ఈ సందర్భంగా తనను తాను చెప్పుతో కొట్టుకుంటూ నిరసన వక్యం చేశారు
Reporter MD khaleel
జహీరాబాద్ చైర్ పర్సన్ కు మద్దతుపై కౌన్సిలర్ భర్త నిరసన జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎంఐఎం కౌన్సిలర్ భర్త యిర్మీయా గురువారం నిరసన తెలిపారు కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి తప్పు చేశానని ఎన్నికల తర్వాత తమ వార్డులో అభివృద్ధి పనులు జరగడం లేదుని ఆరోపించారు ఈ సందర్భంగా తనను తాను చెప్పుతో కొట్టుకుంటూ నిరసన వక్యం చేశారు
More news from తెలంగాణ and nearby areas
- జహీరాబాద్ చైర్ పర్సన్ కు మద్దతుపై కౌన్సిలర్ భర్త నిరసన జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎంఐఎం కౌన్సిలర్ భర్త యిర్మీయా గురువారం నిరసన తెలిపారు కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి తప్పు చేశానని ఎన్నికల తర్వాత తమ వార్డులో అభివృద్ధి పనులు జరగడం లేదుని ఆరోపించారు ఈ సందర్భంగా తనను తాను చెప్పుతో కొట్టుకుంటూ నిరసన వక్యం చేశారు1
- ఎస్సీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి SRD: కల్హేర్ మండల కేంద్రంలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన హాస్టల్ ప్రాంగణమంతా కలియతిరిగి, గదులు, వంటగది, పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి, హాస్టల్లో అందిస్తున్న భోజన నాణ్యత, వసతులు, విద్యాబోధన గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.1
- అనాథ బాలుడి చదువుకు గురువు అండ.. భవిష్యత్ కోసం ప్రత్యేక నిధికి శ్రీకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి నానమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు. ఎన్నో ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మంగ నర్సింలు బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమ్ కుమార్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అతని భవిష్యత్ విద్య కోసం ప్రత్యేక ఆర్థిక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ నిధికి తొలి విరాళంగా రూ.5,116 అందజేస్తానని ప్రకటించి, దాతలు ముందుకు వచ్చి బాలుడి విద్యాభారాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు.1
- సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.1
- మెదక్లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంNSSHసురేష్ మెదక్లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమం మెదక్లో గురువారం నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (NSSH), హైదరాబాద్ ఆధ్వర్యంలో, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) సహకారంతో ఎంట్రప్రెన్యూర్ అవగాహన మరియు ప్రత్యేక వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వినాయక కన్వెన్షన్ హాల్, మెదక్లో జరిగింది.అతిథుల స్వాగతం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ NSSHO ఎస్. సురేష్ స్వాగత ప్రసంగం చేశారు.తదుపరి డిక్కీ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు జె. సీతారాం, డిక్కీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు అరుణ దాసరి, ఎన్ఎస్ఐసీ (AP & తెలంగాణ) జోనల్ జనరల్ మేనేజర్ వి. సురేష్ బాబు పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న సహాయ కార్యక్రమాలపై వివరించారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ–ఎస్టీ యువత ముందుకు రావాలని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని పిలుపునిచ్చారు.అనంతరం సాంకేతిక సమావేశంలో ప్రభుత్వ కొనుగోలు విధానాలు, వెండర్ రిజిస్ట్రేషన్, ఆర్థిక సహాయం, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమెదక్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ , దళిత సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.1
- బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ గురువారం ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కుక్కల దాడుల్లో గాయపడిన చిన్నారులు, మహిళతో కలిసి ఆయన అధికారులను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఈ సందర్భంగా బాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలోని 1వ, 2వ, 13వ, 15వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత రెండు రోజుల వ్యవధిలోనే సుమారు పది మంది చిన్నారులు, ఒక మహిళ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు ఉదయం, సాయంత్రం బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కలను వెంటనే పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇకపై ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్, నాయకులు షఫీ, గంగారాం, కాసుల బాబు, ఖాలేద్, అఫ్జల్, ఫయాజ్, కుక్కల దాడిలో గాయపడిన బాధితులు తదితరులు పాల్గొన్నారు.బాన్సువాడలో వీధి కుక్కల బెడదపై ఆందోళన.. ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు బాధితులతో కలిసి వినతి బాన్సువాడ, జూలై 30: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ గురువారం ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కుక్కల దాడుల్లో గాయపడిన చిన్నారులు, మహిళతో కలిసి ఆయన అధికారులను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఈ సందర్భంగా బాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలోని 1వ, 2వ, 13వ, 15వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత రెండు రోజుల వ్యవధిలోనే సుమారు పది మంది చిన్నారులు, ఒక మహిళ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు ఉదయం, సాయంత్రం బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కలను వెంటనే పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇకపై ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్, నాయకులు షఫీ, గంగారాం, కాసుల బాబు, ఖాలేద్, అఫ్జల్, ఫయాజ్, కుక్కల దాడిలో గాయపడిన బాధితులు తదితరులు పాల్గొన్నారు.3
- జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ స్నేహమేహ్ర వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వికారాబాద్ Hasn't ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర పేర్కొన్నారు. రాబోయే 48 గంటల పాటు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని పోలీసులు అందరూ సిబ్బంది 24 * 7 అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితులకు వెంటనే స్పందించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాగులు వంకలు చెరువులో ప్రాజెక్టులు ఉదృతంగా ప్రవహిస్తే ప్రజలు ఎట్టి పరిస్థితిలోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరిక జారీ చేశారు.1