Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from Spsr Nellore and nearby areas
- Post by Bondhu Suresh1
- *మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, నవ్వుతూ మా అందరి కోసం త్వరగా రావాలని మనస్పూర్తిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను* 🙏🏻1
- Post by RAVI KUMAR1
- అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు మండలం,బొంజంగి, కింత్రీలు,చేరువీధి గ్రామాల ప్రజలు సరైన రహదారి లేక నరకం అనుభవిస్తున్నారు. ఎనిమిది కిలోమీటర్లు రహదారి పూర్తిగా పాడైపోయిందన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడ రాలేని దుస్థితి నెలకొందని వాపోయారు.పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను డోలితో మోసుకెళ్లాల్సి రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని ఆరోపించారు. తక్షణమే రహదారి నిర్మించి తమన ఆదుకోవాలని మూడు పంచాయతీల గిరిజనలు డిమాండ్ చేస్తున్నారు.1
- బండి ఆత్మకూరు మండల కేంద్రం కు చెందిన కరీముల్లా (32) అనే యువ వ్యక్తి శనివారం అర్ధరాత్రి నంద్యాల మండలం కొత్తపల్లి సమీపంలో అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్య తరఫు బంధువులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.1
- ఎమ్మిగనూరు సబ్డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు. చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి” అని అవగాహన కల్పించారు.1
- ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1