మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలంలో రోడ్డు ప్రమాదం అదుపు తప్పి బోల్తాపడిన డీసీఎం వాహనం డ్రైవర్ కు గాయాలు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.వివరాల్లోకి వెళ్తే కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్కు ప్రాథమిక చికిత్స అందించారు.
మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలంలో రోడ్డు ప్రమాదం అదుపు తప్పి బోల్తాపడిన డీసీఎం వాహనం డ్రైవర్ కు గాయాలు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.వివరాల్లోకి వెళ్తే కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్కు ప్రాథమిక చికిత్స అందించారు.
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.వివరాల్లోకి వెళ్తే కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్కు ప్రాథమిక చికిత్స అందించారు.1
- హైదరాబాద్ నుండి నారాయణఖేడ్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు1
- మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.1
- హైదరాబాద్, బషీర్బాగ్: ఈరోజు బషీర్బాగ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ దళ కమాండర్ పటేల్ వనజ మాట్లాడుతూ బీసీ వర్గాల రాజకీయ సాధికారత కోసం మల్లన్న నాయకత్వంలో కొత్త దిశలో పోరాటం ప్రారంభమైందని తెలిపారు. ఏండ్ల తరబడి పీడిత వర్గాల కోసం అడవుల్లో పోరాటం చేశామని, ఇప్పుడు అదే పోరాటాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని తీసుకురావడం మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సాధారణ రాజకీయ చేరిక కాదని, వ్యవస్థ మార్పు కోసం ప్రారంభమైన కొత్త ఉద్యమమని స్పష్టం చేశారు. వ్యాపార రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ప్రజల రాజ్య స్థాపనకై అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.1
- తొర్రూరు: మండల కేంద్రం సమీపంలో ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్ మరియు ప్రయాణికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బస్సులో టికెట్ లేని ప్రయాణికుడిని సాకుగా చూపి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సదరు అధికారి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్, ప్రయాణికులతో కలిసి అధికారిని నడిరోడ్డుపై నిలదీసి చెప్పుతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.1
- Post by Ramprasad islavath2
- * ఎన్టీఆర్ జిల్లా: * గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు.. జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది. * చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు. * రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు. * మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి. * రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు. * మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు. * కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ చేతులెత్తే పరిస్థితి.. * కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. * ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి. * మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు. * ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.2
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి నర్సంపేటకు వెళ్లే మార్గంలోని గువ్వలపాడు వద్ద తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బార్ధన్ (లోడ్) తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత వాహనం మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనలో ఎవరైనా గాయపడినారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…1