Shuru
Apke Nagar Ki App…
సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Sangareddy News
సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
More news from తెలంగాణ and nearby areas
- నేడు నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో ఎమ్మార్పీఎస్ కరపత్రలు విడుదల మార్చ్.30.2026 నాడు చలో ఇందిరాపార్క్ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జమునగాళ్ల కుమార్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం దళిత కుటుంబానికి 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని కేటాయించాలి జీవో 58, 59 ప్రకారం లావన్ పట్టాలకు పట్టాలు కల్పించాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15000 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20వేల కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము,ఈ కార్యక్రమంలో MSf కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, mrps నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు ఎర్ర విద్య సాగర్, నరేష్ mrps నాయకులు పాల్గొన్నారు.జమునగల కుమార్ MRPS నర్సాపూర్ మండల అధ్యక్షులు....1
- Post by Ali ammu1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్/ . జగదేవపూర్ మండల్ తీగుల్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వద్ద పురోహితులు వేణుగోపాల శర్మ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఉదయం ఎదుర్కొల్లు గ్రామ శివాలయం నుండి ఊరేగింపుగా స్వామిని కోలాటాల ఆటలతో భజనలతో రామాలయం కు చేరుకొని అభిషేకాలు. అష్టోత్తర నామాలు తర్వత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తీర్థప్రసాదములు, అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రజలకు ఆలయ నిర్వాహకులు భజన భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో త్రిగుల రామమూర్తి శర్మ గోపీనాథ్ శర్మ, మురళీ శర్మ, నాగసితరం శర్మ,వేదవ్యాస్ శర్మ,కొండపోచమ్మ దేవాలయ చైర్మెన్ కప్పర అనుగీత హరిప్రసాద్ రావు మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు గోటూరు మోహన రెడ్డి టేకులపల్లి నరసింహ రెడ్డి , పెద్ది శ్రీనివాస్, కొన్యాల తిరుపతి రెడ్డి, బాల్ రెడ్డి , నేతి అనంతం నేతి శంకర్, గోతురి అంజి రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కయ్యం కర్నాకరూ రెడ్డి, గోటూరు కమలాకర్ రెడ్డి, ఉద్దేమరు బాలరాజు అవుసుల మహేష్, గిరిధర్ రావు, సుర గౌరయ్య, గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు4
- *రిమ్మనగూడలో వైభవంగా గోలోకాశ్రమం 51వ వార్షికోత్సవ వేడుకలు.* ౼ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ౼ భారీగా తరలివచ్చిన భక్తులు, గ్రామస్తులు ౼ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గ్రామంలోని ప్రసిద్ధ గోలోకాశ్రమం 51వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా ఖమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, అలాగే నిర్వాహకులు రాము మాట్లాడుతూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల మోతతో సీతారాముల వివాహ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణతో కళ్యాణ వేదిక శోభాయమానంగా మారింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రిమ్మనగూడ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గోలోకాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.4
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.1
- వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.2
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 27 ప్రజా తెలంగాణ న్యూస్/ శ్రీగిరిపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి నర్సయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి కార్యక్రమాలు కొనసాగాయి. అలాగే రహదారిపై ప్రయాణించే వారికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షిమి రెడ్డి, కుమార్, రాజు, కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.4
- శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీరామ నవమి సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.1
- అలిరాజాపేట లోని హనుమాన్ దేవాలయాలంలో గ్రామప్రజలదరు కలసి సీతారాములకళ్యాణం లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలిరాజపేట్ నిర్మల్ నగర్ గ్రామప్రజలు పాల్గొన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది.. అందరు కలసి అందరికి శ్రీతారాములా ఆశీస్సులు అందరిపై ఉండాలని పాడిపంటలు బాగా పండాలని కోరుకున్నారు2