భక్తిశ్రద్ధలతో మురుగన్ దర్శనానికి ఇరుముడులతో భక్తుల పాదయాత్ర 'వేల్ వేల్ మురుగా' నామస్మరణతో మారుమోగిన భక్తి వాతావరణం.. వేల్ వేల్ మురుగా' నామస్మరణలతో మారుమోగిన భక్తి వాతావరణంలో భక్తులు నియమనిష్ఠలతో ప్రయాణం కొనసాగించారు. మార్గమంతా స్వామిని కీర్తిస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకు సాగారు. భక్తుల అంకితభావం, ఆధ్యాత్మిక విశ్వాసం అందరినీ ఆకట్టుకుని భక్తి భావాన్ని చాటిచెప్పింది.భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి కావెళ్ల ఊరేగింపు పుంగనూరు పట్టంలో భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం సుబ్రహ్మణ్యం స్వామికి భరణి సందర్బంగా భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు.ఈ సందర్బంగా ఆడికృత్తికను పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువైయున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి కావెళ్ల చెల్లించి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వెళ్లారు. కుమ్మరి వీధి,బజారు వీధి గుండా నగిరిలోని స్థానిక సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసి బయలుదేరారు.
భక్తిశ్రద్ధలతో మురుగన్ దర్శనానికి ఇరుముడులతో భక్తుల పాదయాత్ర 'వేల్ వేల్ మురుగా' నామస్మరణతో మారుమోగిన భక్తి వాతావరణం.. వేల్ వేల్ మురుగా' నామస్మరణలతో మారుమోగిన భక్తి వాతావరణంలో భక్తులు నియమనిష్ఠలతో ప్రయాణం కొనసాగించారు. మార్గమంతా స్వామిని కీర్తిస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకు సాగారు. భక్తుల అంకితభావం, ఆధ్యాత్మిక విశ్వాసం అందరినీ ఆకట్టుకుని భక్తి భావాన్ని చాటిచెప్పింది.భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి కావెళ్ల ఊరేగింపు పుంగనూరు పట్టంలో
భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం సుబ్రహ్మణ్యం స్వామికి భరణి సందర్బంగా భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు.ఈ సందర్బంగా ఆడికృత్తికను పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువైయున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి కావెళ్ల చెల్లించి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వెళ్లారు. కుమ్మరి వీధి,బజారు వీధి గుండా నగిరిలోని స్థానిక సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసి బయలుదేరారు.
- ఆడి కృత్తిక సందర్భంగా పుంగనూరు నుంచి తిరుత్తణికి భారీగా తరలిన భక్తులు ఆడి కృత్తిక సందర్భంగా పట్టణం నుంచి తమిళనాడులోని తిరుత్తణికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.బుధవారం భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు. "హర హర" నామస్మరణల మధ్య ఊరేగింపుగా నగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి బయలుదేరి స్వామివారికి కావెళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణమయ్యారు.1
- *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్* *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్*1
- రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన టి. చైతన్యకు మాదిగల జేఏసీ ఘన సన్మానం కడప నగరంలోని బాలాజీ నగర్లో ఉన్న మాదిగల జేఏసీ కార్యాలయంలో బుధవారం మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన శ్రీమతి టి. చైతన్య గారిని, ఆమె భర్త రాజశేఖర్ గారిని ఘనంగా సన్మానించారు. పూల బొకేలు అందజేసి, దుశాలువలు కప్పి అభినందనలు తెలియజేశారు. టి. చైతన్య గారు కడప జిల్లా బి. మఠం మండలం నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన వారు. ఆమె నవజీవన సేవా ఆశ్రమం సంస్థను నిర్వహిస్తూ కడప నగరంలో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధాశ్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె చేపడుతున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా నియమించింది. ఈ సందర్భంగా టి. చైతన్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని తెలిపారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే అక్రమాలు ఎక్కడ జరిగినా వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాగే తన సేవా కార్యక్రమాలకు దళిత నాయకులు, ప్రజల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలపల్లె ఓబులపతి, గౌరవ అధ్యక్షులు ఎస్. కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదురూరు బాబు, ప్రచార కార్యదర్శి పచ్చారం బాలసుబ్బయ్య, అధికార ప్రతినిధి గొడుగునూరు మున్నెయ్య, ఉపాధ్యక్షులు పి. సుబ్బారాయుడు, డి. నరసయ్య, కార్యదర్శి తప్పెట హరిబాబు, పైయింటి సునీల్ కుమార్, గద్దె చిన్న నరసింహాలు, డి. వెంకటేష్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు నరేష్తో పాటు కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వైద్యరంగంలో మరో సంచలనానికి శ్రీకారం ఎలన్ మస్క్ సిద్ధం.. పుట్టుకతోనే పూర్తిగా అంధులైన వారికి దృష్టి అనుభూతిని అందించే Vision Deviceను వచ్చే 6–12 నెలల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఈ సాంకేతికత విజయవంతమైతే వైద్యరంగంలో చారిత్రాత్మక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది...1
- బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సినీ నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొపూరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బుధవారం మొపూరి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, అభిషేకం, మహా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో బాలయ్య అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.1
- రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది. రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది.1
- కుప్పం నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం..కడ పిడి వికాస్ మర్మత్.. చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం కడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కడ పిడి వికాస్ మర్మత్.. రాబోయే 25 ఏళ్లలో కుప్పంను పెద్ద సిటీగా మార్చడమే లక్ష్యం.. కుప్పం నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.. కుప్పం నియోజకవర్గంలో పాల ఉత్తప్తి అధికంగా పెరిగింది.. 7,671 ఫిమేల్ కాప్స్ జర్మించింది.. కుప్పం నియోజకవర్గంలో పాలకు సంబంధించిన 2 కంపెనీలు వచ్చాయి.. కుప్పం నియోజకవర్గంలో 1800 హెక్టార్లకు మిల్లెట్ పంట విస్తరించింది.. కుప్పం నియోజకవర్గానికి 32 కంపెనీల ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 88 వేల మందికి ఉద్యోగ అవకాశాలు.. రూ. 900 కోట్లతో 3 సబ్స్టేషన్ లను ఏర్పాటు చేస్తున్నాం.. కుప్పం - బెంగళూరుకు శాటిలైట్ రింగ్ రోడ్డు మంజూరు అయ్యింది.. రాబోయే రెండేళ్లలో కుప్పంలోని కంపెనీలకు బయట నుండి పనిచేయడానికి ఉద్యోగస్తులు వస్తారు.. 1000 మందికి గృహాలు నిర్మించుకోవడానికి హౌసింగ్ సైట్లు మంజూరు చేస్తున్నాం.. రాబోయే మార్చిలోపు 50 వేల మంది గృహాలకు సోలార్ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.. త్వరలోనే నెట్ వర్క్ ఇష్యూలను పూర్తి చేస్తాం.. 40 శాతం రోడ్డు పనులను పూర్తి చేశాం.. 130 ఈ- ఆటోల ద్వారా చెత్త సేకరణ చేపడుతున్నాం.. రాష్ట్రంలోనే కుప్పం రూరల్ చెత్త సేకరణ కార్యక్రమంలో 5 వ స్థానంలో ఉంది.. 50 హైమాస్ లైట్లను ఏర్పాటు చేశాం.. LPG క్రిమోటోరియం పనులను పూర్తి చేసి, ప్రారంభించడం జరిగింది.. ఎంట్రన్స్ ఆర్చ్ ప్రారంభించడం జరిగింది.. కుప్పంలో మరో 2 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తాం.. NTR స్పోర్ట్స్ స్టేడియం ను పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నాం.. కుప్పం పట్టణంలో అండర్ డ్రైనేజ్ త్వరలోనే పనులు ప్రారంభమవుతుంది.. కుప్పం పట్టణంలో రూ. 5 కోట్లతో సుందరీకరణ పనులు చేస్తాం.. నవంబర్ లో కుప్పం మాస్టర్ ప్లాన్ ను విడుదల చేస్తాం.. రాబోయే సంవత్సరంలో ప్రపంచ స్థాయి రైతు బజార్ రాబోతుంది.. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేశాం.. 550 ట్యాంకులకు సంబంధించి 127 ట్యాంకులకు నీటి సరఫరా జరుగుతోంది.. రామకుప్పంలోని ననీయాలలో రిసార్ట్ మరియు తదితర పనులను పూర్తి చేసి, 9 నెలలో పూర్తి చేస్తాం.. కనకనాచమ్మ ఆలయం వద్ద బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం.. కుప్పంలో మోడ్రన్ ఆర్టీసీ బస్టాండ్ పనులను రెండు నెలలో పూర్తి చేస్తాం..1