Shuru
Apke Nagar Ki App…
ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం..ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులు ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ చూపించాలని కోరారు.
Journalist Prem
ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం..ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులు ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ చూపించాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు, సీతక్క ఆదివారం పర్యటించి మహా జాతర ఏర్పాట్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణం, క్యూ లైన్లు, భక్తుల కోసం తాత్కాలిక వసతుల ఏర్పాట్లను తనిఖీ చేసి, లక్షలాది భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది.1
- CMO సెక్యూరిటీపై చెయ్యి చేసుకున్న రేవంత్ రెడ్డి (వీడియో) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CMO సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అంతా అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూండగా.. ముందుకు వచ్చిన ప్రజలను కంట్రోల్ చేస్తున్న సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నాడు. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి., ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు1
- విద్యతోనే సమాజంలో మార్పు, మెరుగైన విద్య అందించాలనే తపన మా ప్రభుత్వానిది: అసెంబ్లీ లో మంత్రి దమోదర రాజనర్సింహ1
- 3వ. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి రెండవరోజు అత్యంత వైభవంగా జరుగుతుంది యువకులు చక్కని కవితలు పద్యాలు పాటలు పాడుతూ నృత్యం చేసిన కళాకారులు తో కళకళలాడుతూ తెలుగు భాష వైభవం వేదిక పెంచింది గజల్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ సుదర్శనపీఠం వ్యవస్థాపకులు శ్రీ మాన్ సుదర్శనాచార్య స్వామి తెలుగు మహాసభలు చూసి సంతోషించి ఒక ప్రకటనలో తెలిపారు1
- జగిత్యాల పట్టణంలోని స్థానిక ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది అంటున్నారు మన పార్టీ అధికారంలో ఉన్న మనకేంటి కష్టాలు అని? కానీ కష్టాల్లోనే గుర్తింపు ఉంటుంది... పాండవుల వనవాసం 14 సంవత్సరాల ముగిసింది ... అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో మన అజ్ఞాతవాసం కూడా ముగియనుంది.. అభిమానం అనేది పదవులతో రాదు నాకు ఈ అభిమానం పూర్వజన్మ సుకృతం దేవుడిచ్చిన వరం.. నా 75 సంవత్సరాల జీవితంలో ప్రజా జీవితం 50 సంవత్సరాలు అని అభిమానుల మధ్య ఉద్వేగపూరితంగా ప్రసంగించారు1
- ధర్మాన్ని కాపాడండి.... ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.. మహిళల కోలాటాలు, మంగళ హారతులతో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజుకు ఘన స్వాగతం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం బాన్సువాడ ప్రతినిధి ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అంటూ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వెల్లడించారు. శ్రీరామ గురు వందనం అనే కార్యక్రమానికి బాన్సువాడ మండలం బోర్ల ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఆధ్యాత్మిక సమావేశానికి అతిథిగా హాజరైన శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ హాజరయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోచమ్మ ఆలయం నుంచి ఆ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వరకు మహిళల కోలాటాలు, మహిళల నృత్యాలు, జైశ్రీరామ్.. జైశ్రీరామ్ అనే నినాదాలతో మారి మోగిపోయాయి. ఊహించని విధంగా మహిళలు, భక్తులు, చిన్నారులు తరలి రావడంతో రెండు కిలోమీటర్ల వరకు భక్తులతో నిండిపోయింది. ఇంజనీరింగ్ కళాశాల వేదికపై చేరుకున్న శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ కు ప్రజాప్రతినిధులు కాసుల బాలరాజ్, పోచారం భాస్కర్ రెడ్డి, పలువురు ఆయనకు ఘన సన్మానం చేశారు. అనంతరం శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం మన హిందూ సంప్రదాయాలను కు దూరంగా ఉంటూ ప్రాచాత్య పోకడలకు పోతూ హిందూ సంస్కృతిని కొంతమంది సద్గురు మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అన్ని దేశాలు భారత దేశ సంస్కృతిని ఎంతో కొనియాడుతుంటే కొంతమంది భారతీయులు హిందూ సంస్కృతిని మర్చిపోయి దేశాన్ని పాలించి వెళ్లిపోయిన బ్రిటిష్ వారి సంస్కృతిని మన దేశంలో కొంతమంది పాటించడం అది ఎంతో బాధాకరమని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత, రామాయణం చదవాలని పిల్లలు కూడా రామాయణం, భగత్గీత శ్లోకాలను నేర్పించాలంటూ పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. హిందూ సంస్కృతికి ప్రపంచంలోనే ఒక గొప్ప గా చూస్తారని అలాంటిది మన సంస్కృతిని మనమే నాశనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత గాని, రామాయణం పుస్తకం కానీ తప్పకుండా ఉండాలని ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా వీలైన శ్లోకాలు చదవాలని, వాటిని అర్థం చేసుకుంటే ఎంతో దాంట్లో తీయదనం కనిపిస్తుందని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ, శ్రీరామ నామస్మరణం ఉండాలని ఆయన హిత బోధ చేశారు. దేవాలయాలకు వెళితే ముఖ్యంగా మహిళలు, యువత, యువతులు సాంప్రదాయ దుస్తులతో వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మన హిందూ సంస్కృతిని మనమే కాపాడుకునే బాధ్యత అవసరం ఇప్పుడు ఏర్పడిందని ఆయన వెల్లడించారు. అవసరమైతే పదిమందికి ఆపదలో ఉంటే అండగా ఉండండి.... లేకుంటే వారికి అన్యాయం చేయకండి అంటూ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్త జనానికి హిత బోధ చేశారు. శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ప్రవచనం వినడానికి బాన్సువాడ పట్టణ ప్రాంతాలకు కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సభా ప్రాంగణం అతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామస్మరణ మధ్య మారి మోగిపోయింది. ఈ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యత పట్లోళ్ల పర్వారెడ్డి పూర్తిగా బాద్యతలు చేపట్టారు. అవసరమైన ఖర్చులు ఆయనే భరించారు. పర్వ రెడ్డి చేస్తున్న కృషికి బోర్లం యువత, మహిళలు ఆయనకు చేదుడు వాదోడుగా ఉంటూ ఈ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆధ్యాత్మిక సభ విజయవంతం కావడానికి కారకులయ్యారు.1
- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవిభవన్లో వాసవి మాత డైరీలను వాసవి క్లబ్ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.1
- హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో మహారాష్ట్రకు చెందిన ముఠా, పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి తండ్రి–కొడుకులను మోసం చేసి 50 లక్షల రూపాయలతో పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలు మరియు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాలు మరియు అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని తెలిపారు.2
- అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి సంగారెడ్డిలో సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు1