సదాశివనగర్ మండలంలో వాటర్ ట్యాంక్ ఎక్కి శుభ్రతను పరిశీలించి, వర్కర్లను సన్మానించిన, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పత్రిక ప్రకటన తేది:11.03.2026 కామారెడ్డి జిల్లా బుధవారం వాటర్ ట్యాంక్ ఎక్కి వాటర్ ట్యాంక్ శుభ్రతను పరిశీలించి వర్కర్లను అభినందించి సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా బుధవారం జిల్లా లోని సదాశివ నగర్ మండలంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కి తనిఖీ చేసి పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్న కార్మికులతో మాట్లాడారు. సదాశివ నగర్ 1వ వార్డు, OHSR ట్యాంక్ సామర్థ్యం: 90 KL పనిచేసిన కార్మికులు ఎల్లగారి భుచ్చయ్య పోట్నగారి ప్రవీణ్ లు పరిశుభ్రత పనులను సమర్థవంతంగా నిర్వహించిన వారిని జిల్లా కలెక్టర్ అభినందించి వారిని సన్మానించారు. గ్రామాలలో పరిశుభ్రత, తాగునీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకుల శుభ్రతను తరచూ నిర్వహించాలని, పంచాయతీ సిబ్బంది , కార్మికులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో CEO చందర్, ప్రత్యేక అధికారి సతీష్, dlpo శ్రీనివాస్, పంచాయతీ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు , సిబ్బంది పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలంలో వాటర్ ట్యాంక్ ఎక్కి శుభ్రతను పరిశీలించి, వర్కర్లను సన్మానించిన, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పత్రిక ప్రకటన తేది:11.03.2026 కామారెడ్డి జిల్లా బుధవారం వాటర్ ట్యాంక్ ఎక్కి వాటర్ ట్యాంక్ శుభ్రతను పరిశీలించి వర్కర్లను అభినందించి సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా బుధవారం జిల్లా లోని సదాశివ నగర్ మండలంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కి తనిఖీ చేసి పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్న కార్మికులతో మాట్లాడారు. సదాశివ నగర్ 1వ వార్డు, OHSR ట్యాంక్ సామర్థ్యం: 90 KL పనిచేసిన కార్మికులు ఎల్లగారి భుచ్చయ్య పోట్నగారి ప్రవీణ్ లు పరిశుభ్రత పనులను సమర్థవంతంగా నిర్వహించిన వారిని జిల్లా కలెక్టర్ అభినందించి వారిని సన్మానించారు. గ్రామాలలో పరిశుభ్రత, తాగునీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకుల శుభ్రతను తరచూ నిర్వహించాలని, పంచాయతీ సిబ్బంది , కార్మికులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో CEO చందర్, ప్రత్యేక అధికారి సతీష్, dlpo శ్రీనివాస్, పంచాయతీ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు , సిబ్బంది పాల్గొన్నారు.
- సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ భక్తుల ఆరాధ్య దైవం ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ మల్లన్న స్వామి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని పాడిపంటలు వ్యాపార మొదలగు రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆ మల్లన్న స్వామిని కోరానని అన్నారు. అనంతరం స్వామి వారి నాగవల్లి పట్నం ను వీక్షించి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు.1
- శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలువ కోసం రైతన్నలు కన్నీటి పర్యంతమై రంగనాయకసాగర్ 11/6 కాలువను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నెల రోజులుగా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో కాలువ సాధన దీక్షా చేస్తున్నారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ 11 (RD3 LM6) కాలువ పనులు చివరి దశలో నిలిచిపోవడంతో 12 గ్రామాల రైతులకు సాగు నీరు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కిలోమీటర్ కాలువ పనులు పూర్తి చేస్తే ఇల్లంతకుంట తంగళ్ళపల్లి మండలాల్లోని 12 గ్రామాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. మెట్ట ప్రాంతంలో నీటి వసతి లేక మగవాళ్ళు గల్ఫ్ దేశాలకు వలస పోతే అక్కడ యుద్దంతో పరిస్థితి బాగాలేదని మహిళా రైతు కన్నీటి పర్యంతమై గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా కాల్వ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. అటు రసమయి బాలకిషన్ సైతం కేటీఆర్ ద్వారా అసెంబ్లీలో కాలువ గురించి మాట్లాడించి త్వరగా పనులు పూర్తి చేసేలా కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రైతులు నెల రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్లక్ష్యాన్ని వీడి రైతులకు సాగునీరు అందించేందుకు ఎల్ఎం6 కెనాల్ పనులను తక్షణమే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.2
- పత్రిక ప్రకటన తేది:11.03.2026 కామారెడ్డి జిల్లా బుధవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని సదాశివ నగర్ మండలం లోని వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.1
- రెండవ సారి సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి ని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షులు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళ చక్రపాణిని బిఆర్ఎస్ పార్టీ వార్డు శాఖ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద ఉన్న కావేరి వ్యవసాయ కళాశాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు మాట్లాడుతూ విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహనతో సమాజం పట్ల గౌరవం కలిగిన విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అనంతరం మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1