Shuru
Apke Nagar Ki App…
గండి అంజన్న ఆలయానికి రూ.36,38,630 నగదు భారీ ఆదాయం:ఆలయ డిప్యూటీ కమీషనర్ గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పరకామణి నిర్వహించారు. మంగళవారం ఆలయ డిప్యూటీ కమీషనర్ విశ్వనాధ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆలయంలో 68 రోజులకు గాను స్వామివారి శాశ్వత హుండీలు లెక్కించగా.. రూ.36,38,630 నగదు, 5. 190 గ్రాముల బంగారం, 254 గ్రాముల వెండి వస్తువులు భక్తుల కానుకల ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ వెంకటస్వామి పాల్గొన్నారు.
LAKKU SIVA SANKAR reddy
గండి అంజన్న ఆలయానికి రూ.36,38,630 నగదు భారీ ఆదాయం:ఆలయ డిప్యూటీ కమీషనర్ గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పరకామణి నిర్వహించారు. మంగళవారం ఆలయ డిప్యూటీ కమీషనర్ విశ్వనాధ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆలయంలో 68 రోజులకు గాను స్వామివారి శాశ్వత హుండీలు లెక్కించగా.. రూ.36,38,630 నగదు, 5. 190 గ్రాముల బంగారం, 254 గ్రాముల వెండి వస్తువులు భక్తుల కానుకల ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ వెంకటస్వామి పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పులివెందుల లోని సాయిబాబ ఆలయాలలో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు పులివెందులలోని షిరిడీ సాయిబాబా ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.పులివెందుల పట్టణంలోని స్థానిక భగవాన్ సత్యసాయి మందిరం,పార్నపల్లి రోడ్డులోని షిరిడీ సాయిబాబా ఆలయంలోనూ.. అలాగే బ్రాహ్మణ పల్లె సమీపంలోని సాయిబాబా ఆలయాలలో బాబాను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. బుధవారం ఉదయమే సాయిబాబాకు హారతులు, పాలాభిషేకం నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద మహిళలు సామూహిక పూజలు చేశారు.1
- అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్1
- లెన్స్కార్ట్ షోరూమ్కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పుట్టపర్తి రోడ్డులో ఏర్పాటు లెన్స్కార్ట్ షోరూమ్కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన చేస్తున్న శాంతియుతంగా నిరసన చేపట్టారు. స్థానికంగా సుమారు 200 కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. షోరూమ్కు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్ తదితర చట్టబద్ధ అనుమతులపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడం ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక చిన్న వ్యాపారులు, ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానికుల సమస్యలపై స్పందన లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, అలాగే చిరు వ్యాపారస్తులు స్థానిక వ్యాపారాల ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవుతున్న కూడా స్థానిక మంత్రిగారు స్పందించకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే. స్థానిక ఉపాధిని కాపాడండి... చట్టబద్ధ అనుమతులపై పారదర్శక విచారణ జరపండి.1
- కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్. కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.1
- అందుబాటులోకి స్మార్ట్ కిచెన్ సెంటర్ పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న సిద్దవటం స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మరో 10 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న తెలిపారు. సిద్దవటంలోని స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మంగళవారం పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న, చిన్న పెండింగ్ పనులను పూర్తి చేసి 10 రోజుల్లోగా కిచెన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ లో అవసరమైన చోట్ల 15 ఇంచుల ఎక్జాస్ట్ ఫ్యాన్ బిగించాలని ఆదేశించామన్నారు. ఇంటర్నల్ డ్రైన్, వంట పరికరాలు, ఆర్ఓ ఫ్లాంటును పరిశీలించడం జరిగిందన్నారు. టెక్నీషియన్ వచ్చి స్మార్ట్ కిచెన్ సెంటర్ లో వంట పరికరాలు బిగిస్తే పనులు పూర్తి అవుతాయన్నారు. ఎల్ఈడి లైట్లు, పైపులను సక్రమంగా అమర్చాలని అధికారులు తనిఖీ చేసినప్పుడు చెడ్డపేరు వస్తుందని సిబ్బందికి సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్ నాగరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకర్, సైట్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.1
- సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి. బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.1
- అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. అన్నమయ్య జిల్లా: పుంగనూరు: అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు. దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం. పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు. చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు. కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.4
- గండి అంజన్న ఆలయానికి రూ.36,38,630 నగదు భారీ ఆదాయం:ఆలయ డిప్యూటీ కమీషనర్ గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పరకామణి నిర్వహించారు. మంగళవారం ఆలయ డిప్యూటీ కమీషనర్ విశ్వనాధ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆలయంలో 68 రోజులకు గాను స్వామివారి శాశ్వత హుండీలు లెక్కించగా.. రూ.36,38,630 నగదు, 5. 190 గ్రాముల బంగారం, 254 గ్రాముల వెండి వస్తువులు భక్తుల కానుకల ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ వెంకటస్వామి పాల్గొన్నారు.1