అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.
- బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.1
- ప్రైవేటుకు పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల. ఏర్పేడు :- ప్రభుత్వ పాఠశాలకు చలో.... చలో.... అంటూ తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం, సౌభాగ్య విద్యాపురం బేసిక్ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా, పాఠశాలలో సరస్వతి పూజను,ఊరి మధ్యలో పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి వారి పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణయ్య గారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మీ పిల్లలను మా పాఠశాలకు పంపినట్లయితే వారి విద్యాభివృద్ధికి పూర్తి బాధ్యత వహిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రులందరూ వాస్తవాన్ని గ్రహించి తమ పిల్లలను మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయిని శాంతి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పిల్లల అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. కేవలం సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలలో మార్కులు తెప్పించడం మాత్రమే కాకుండా పిల్లల్లో బట్టి విధానాన్ని పోగొట్టి అర్థవంతమైన జ్ఞానాన్ని అందించడం,ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించడం మా ప్రభుత్వ పాఠశాల విధానమని తెలియజేశారు. అందుకొరకు TaRL, GFLN వంటి ప్రత్యేక కార్యక్రమాలను రెగ్యులర్ పాఠ్యాంశాలకు అనుబంధంగా బోధించడం జరుగుతుందని, అందువల్లనే తమ విద్యార్థులు అన్నింటి ముందున్నారని తెలిపారు. అలాగే 21వ శతాబ్దపు నైపుణ్యాలు అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు చేస్తున్న కృషిని వివరించారు.CRMT గురు ప్రసాద్ గారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పిల్లలకు దాతల సహకారంతో విద్యాసామగ్రి అందించడం జరుగుతుందని,వారి స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలని, మన ఊరి పాఠశాలకు గ్రామస్తులంతా సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. అనంతరం ఒకటి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు సవాల్ విసురుతూ ఇంగ్లీష్ స్టోరీ,పద్యాలు, రైమ్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ లాంటి ఎన్నో అంశాలను చిన్నారులు చక చక చెప్పారు.ఈ కార్యక్రమంలో సౌభాగ్య విద్యాపురం గ్రామ పెద్దలు మైరామయ్య గారు ,అయోధ్య గారు రాజుపాలెం గ్రామస్తులు నాగరాజు గారు, పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీహరి గారు, సుధాకర్ గారు, మునయ్య గారు ప్రధానోపాధ్యాయులు వి. రామకృష్ణయ్య గారు, ఉపాధ్యాయురాలు ఎం.ఎం. శాంతి గారు, సి ఆర్ ఎం టి సి. గురు ప్రసాద్ గారు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.1
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా లీసా బాధ్యతలు చేపట్టారు. 2028 నవంబరు 16 వరకు ఆమె చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.1
- అనంతపురంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హనీ ట్రాప్ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరగాలని జిల్లా పోలీసు కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్టు సిపిఐ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు.1
- లక్కీ డ్రాప్ అంటూ 99 కట్టండి జీప్ గెలవండి,299 కట్టండి తార్ గెలవండి అంటూ వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకుంటున్న influencer కు కౌన్సెలింగ్..1
- నగలు అమ్మి భర్త ఈశ్వర్ రెడ్డిని లేపేసేందుకు ప్రియుడితో కుట్ర పన్నిన భార్య శిల్పాతో పాటు కిరాయి హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కుట్ర, హత్య కేసు ను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించిన ASP, విభూకృష్ణ...1
- నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం ప్రధాన కూడలి వద్ద ఆర్భాటంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం అలంకారప్రాయంగా మారింది. ప్రారంభించిన రోజు మాత్రమే నీరు నింపారని, మరుసటి రోజు నుంచి కుండల్లో నీరు నింపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాహం తీర్చుకోవడానికి వచ్చేవారు ఖాళీ కుండలను చూసి నిరాశతో వెను తిరుగుతున్నారు. తూతూమంత్రంగా ఏర్పాటు చేసి వదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కేంద్రంలలో ఉన్న కుండలలో నీరు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.1
- హనీ ట్రాప్లో కొత్త మలుపు: రంగమ్మ ముఠాలో చీలికలు,నరేంద్ర రెడ్డి నేతృత్వంలో రెండో గ్యాంగ్ బయటపడింది 📝 ప్రత్యేక కథనం: అనంతపురం నగరాన్ని కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒకే ముఠాగా కొనసాగుతున్న రంగమ్మ గ్యాంగ్లో చీలికలు ఏర్పడి, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో కొత్తగా రెండో ముఠా ఏర్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, రంగమ్మ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తీయటి మాటలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను హనీ ట్రాప్లోకి దింపి, బెదిరింపులతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు అంచనా. ఇదే సమయంలో, రంగమ్మకు సమీపంగా ఉన్న నరేంద్ర రెడ్డి, ఇద్దరు యువతులతో కలిసి వేరుగా కొత్త ముఠా ఏర్పాటు చేసి, స్వతంత్రంగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.2
- *అటవీ భూముల్లో మట్టి మాఫియా పంజా..* *వెంకుపాలెంలో గ్రామస్థుల గర్జన!* **దిశ వినుకొండ:** అక్రమార్కుల ఆకలికి ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయి. కళ్లముందే కోట్లాది రూపాయల విలువైన సంపద దోపిడీకి గురవుతున్నా.. అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద అక్రమ మట్టి మాఫియా బరితెగించింది. సర్వే నంబర్ 1లోని సుమారు 89 ఎకరాల అటవీ భూముల్లో యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకుని నిరసన తెలిపారు. *కోట్లలో వ్యాపారం..* *సామాన్యులకు మాత్రం ఆంక్షలు!* వెంకుపాలెం గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో ఉన్న మేలిరకం ఎర్రమట్టిపై మాఫియా కన్ను పడింది. భారీ జేసీబీలతో భూమిని తవ్వేస్తూ, టిప్పర్ల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. "గ్రామ అవసరాల కోసం ఒక తట్ట మట్టి తీసుకెళ్లాలన్నా స్థానికులను వేధిస్తున్నారు.. కానీ, మాఫియా పగలు రేయి తేడా లేకుండా వేల టిప్పర్ల మట్టిని తరలిస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా నిలిచిన టిప్పర్లే ఇక్కడ జరుగుతున్న దోపిడీకి సజీవ సాక్ష్యాలని వారు చూపుతున్నారు. *అధికారుల 'వాటాల' పర్వం.. అడ్డుకోకుంటే ఉద్యమమే!* ఈ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియా నుంచి అధికారులకు భారీగా 'వాటాలు' అందుతున్నాయని, అందుకే ఈ అక్రమ రవాణాను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అడ్డుకోకపోతే, గ్రామస్థులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.3