Shuru
Apke Nagar Ki App…
వేములవాడలో చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న ఆలయాలు...భక్తులకు యదావిధిగా దర్శనాలు. కేతు గ్రస్త చంద్రగ్రహణం అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు తెరుచుకున్నాయి. గ్రహణం విడిచిన అనంతరం ఆలయ అర్చకులు పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ గావించారు. తదుపరి స్వామివారికి ప్రదోష పూజ జరిగింది. పూజ అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.
K.V.REDDY
వేములవాడలో చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న ఆలయాలు...భక్తులకు యదావిధిగా దర్శనాలు. కేతు గ్రస్త చంద్రగ్రహణం అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు తెరుచుకున్నాయి. గ్రహణం విడిచిన అనంతరం ఆలయ అర్చకులు పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ గావించారు. తదుపరి స్వామివారికి ప్రదోష పూజ జరిగింది. పూజ అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.
More news from తెలంగాణ and nearby areas
- కేతు గ్రస్త చంద్రగ్రహణం అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు తెరుచుకున్నాయి. గ్రహణం విడిచిన అనంతరం ఆలయ అర్చకులు పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ గావించారు. తదుపరి స్వామివారికి ప్రదోష పూజ జరిగింది. పూజ అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.1
- Post by వేణు విలేకరి1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.1
- ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీసులతో పాటు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. డీజే సౌండ్స్ తో ఎస్పీ తోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కలిసి నృత్యాలు చేస్తూ రంగులను అద్దుకున్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాతీయ రహదారిపై డీజే లు ఏర్పాటు చేసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు.1
- జగిత్యాల పాత్రికేయులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగుల మాయం కావాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు,సంపూర్ణ చారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి,హరీష్, శ్రీనివాస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు --- హోలీ పండుగ వేడుకల్లో పాల్గొని గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,,, వారితో పాటు గజ్వేల్ మార్కెట్ కమిటి చైర్మన్ నరేందర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజుతోపాటు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ----1
- మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు నిరసనగా మంగళవారం పాఠశాల ఎదుట బాధితుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.1