Shuru
Apke Nagar Ki App…
వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు. వైసీపీ హయాంలో ఆమోదం పొందిన పనులనే చేస్తున్నారు
B.RAJESH
వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు. వైసీపీ హయాంలో ఆమోదం పొందిన పనులనే చేస్తున్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లాలో పాత్రుని వలస వద్ద ఆరోగ్య వాహనం 108 వాహనం మరమదులకు రావడంతో గత కొన్ని నెలలుగా పాత హైవే పక్కన వృధాగా విడిచి పెట్టేశారు. ప్రజా ప్రభుత్వ ధనం వృధాకి ఇదే సాక్షాత్కారం. అధికారుల ఎవరూ కూడా కనీసం పట్టించుకోకుండా వాహనాన్ని అలాగే విడిచి పెట్టేయడం చూపరులు ఆశ్చర్యపోతున్నారు.2
- నాలుగేళ్లు దాటిన గోడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని మండల పశు వైద్య శాఖ అధికారి కాకర్ల గౌరీ శంకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం గంగువారిసిగడాం మండలం డిఆర్ వలస గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ వ్యాధి సోకినప్పుడు పశు శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటూ నోటు నుంచి స్వర్గ కారుతుందన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్న పశువైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.9
- అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని పెదపాడు గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద మాధవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెడపాడు గ్రామంలోని ఈ పాఠశాలలో సుమారు 26 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాల భవనం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో పిల్లలు పాఠాలు నేర్చుకోవడానికి, ఉపాధ్యాయులు బోధించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాడు–నేడు పథకం కింద పాఠశాల భవనం మంజూరు అయినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో పిల్లలు సరైన సౌకర్యాలు లేకుండా చదువుకుంటున్న పరిస్థితి నెలకొంది. పిల్లలు కూర్చోవడానికి సరైన స్థలం లేక చిప్స్ రాళ్లపై కూర్చోవాల్సి వస్తోందని, వేసవిలో ఎండ నేరుగా పడటం, వర్షాకాలంలో వర్షం పడటం వలన చదువుకు ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు తెలిపారు. అలాగే వర్షాకాలంలో సుమారు నాలుగు నెలలపాటు పాఠశాల మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు పాఠశాలకు రావడానికి ఒక వాగు దాటి రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే గ్రామ ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం, పండించిన పంటలను మార్కెట్కు తీసుకెళ్లడం, గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించడం వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన రహదారి లేక అనేక సందర్భాల్లో సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక మరణాలు కూడా సంభవించాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు వెంటనే గ్రామాన్ని పర్యవేక్షించి పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు రహదారి మరియు బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు చంటిబాబు, నాగరాజు, మాధవరావు, గ్రామ ప్రజలు వినాయకరావు, అంజిరావు, అప్పలనాయుడు, చిన్నమ్మి, బొంజునాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు.1
- మండపేట న్యూస్... మండపేట మండలం కేశవరం నుండి అనపర్తి వరకు కెనాల్ రోడ్ లో ఓ వైపు తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండి పోతుంది. ఇవి కొన్ని ప్రధాన మలులుపులు వద్ద ఉండటం తో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సమస్యను గుర్తించిన రూరల్ సి ఐ దొరరాజు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిష్కరించారు. ప్రాక్లైన్ తో ఆయా చోట్ల తుప్పలు పిచ్చి మొక్కలు మంగళ వారం తొలగించారు. ఈ సందర్భంగా సి ఐ దొరరాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్ల ను గుర్తించి నట్లు తెలిపారు.అక్కడ పెరిగిన పొదలను తొలగించే ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ క్రమంలో ఆర్ అండ్ బి డీఈ సూర్యనారాయణ మండపేట రూరల్ ఎస్.ఐ వి. కిశోర్ లతో సమన్వయంతో సంబంధిత ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. వెంటనే బుష్ క్లియరెన్స్ చేశామని చెప్పారు. దీని వల్ల వల్ల రహదారులపై క్లియరెన్స్ మెరుగుపడి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సహకరించాలని కోరారు.2
- YSRCP జగ్గిరెడ్డి1
- కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో 2027 లో జరగనున్న జనాభా లెక్కల కార్యక్రమంకు పాల్గొనే డిస్ట్రిక్ట్ మరియు ఛార్జ్ లెవల్ అధికారులకు శిక్షణా కార్యక్రమంను నిర్వహించారు. ఈయొక్క శిక్షణలో జిల్లాలోని అందరూ తహశీల్దార్ లు, ఎంపిడిఓ లు, ఎంపీవో లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ట్రైనింగ్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వారు మాట్లాడుతూ..... 2027 లో జరిగే కుటుంబ, జనాభా లెక్కలు ఈసారి పేపర్ లెస్ సెన్సస్ జరగనున్నట్లు తెలిపారు. అన్ని వివరాలు డిజిటలైజేషన్ అవుతాయని అన్నారు. దానికి తగిన విధంగా అందరు అధికారులకు డిజిటల్ పద్దతిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అందరు కూడా జనాభా లెక్కలకు సహకరించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.4
- విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికార–ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదికైంది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పాలన, ప్రస్తుతం కొనసాగుతున్న టీడీపీ ప్రభుత్వ పరిపాలనపై ఇరు పక్షాల కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే అభివృద్ధి పనులు, మున్సిపల్ నిధుల వినియోగం, పట్టణంలో మౌలిక వసతుల పరిస్థితి వంటి అంశాలపై చర్చ వేడెక్కింది. అధికార పార్టీ కౌన్సిలర్లు గత వైసీపీ ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. అనేక పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందించిన ప్రతిపక్ష సభ్యులు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, పట్టణ ప్రజలకు సరైన సేవలు అందడం లేదని ఆరోపించారు. అభివృద్ధి పనుల పేరుతో రాజకీయ ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో సమావేశం కొంతసేపు ఉద్రిక్తంగా మారింది.1
- శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అధికారులు తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఈరోజు(మార్చి -17)ఉదయం 5గంటల నుంచి విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ ఫెడరేషన్(సీఐటీయూ )శ్రీకాకుళం నగరకమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులు. తొలగించిన అధికారుల్ని వెంటనే విధులకు తీసుకునేంతవరకు ఇలానే ఆందోళన చేపడతామని హెచ్చరించారు3
- fish1