Shuru
Apke Nagar Ki App…
రాయగిరి: వర్షానికి నేలకొరిగిన చెట్లు.. రాకపోకలకు అంతరాయం భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి-యాదగిరిగుట్ట రహదారిపై మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచెట్లు నేలకొరిగాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విరిగిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.
P.srinu
రాయగిరి: వర్షానికి నేలకొరిగిన చెట్లు.. రాకపోకలకు అంతరాయం భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి-యాదగిరిగుట్ట రహదారిపై మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచెట్లు నేలకొరిగాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విరిగిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- తొండి మాటలు మాట్లాడితే నీ లాగులో తొండలిస్తారు విద్యార్థులు *ఏపీలో ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు నేను కూడా ఇవ్వను* *ఫీజ్ రీయింబర్స్మెంట్ అంశంపై రేవంత్ రెడ్డి తప్పించుకునే ధోరణి* ఆర్.కృష్ణయ్య ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వమని అడగాలి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఏపీలో కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంది, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇచ్చాక తెలంగాణ బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శించండి అంటున్న రేవంత్.. గాడిద ను గద్దె నెక్కిస్తే గిట్లనే ఉంటది... బుడ్డ బాబు నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి.. *తొండి మాటలు మాట్లాడితే నీ లాగులో తొండలు ఇడుస్తారు విద్యార్థులు*1
- నాగారంలో దంచి కొడుతున్న వర్షం నాగారం దమ్మైగూడ రోడ్లు జలమయం నాగారంలో దంచి కొడుతున్న వర్షం నాగారం దమ్మైగూడ రోడ్లు జలమయం వాహనదారుల అప్రమత్తంగా గుంతలు చూసుకొని వెళ్లాలని అదేవిధంగా పాదాచారులకు నీళ్లు మీద పడకుండా వాహనాలు నడపాలని సమన్వయం పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని కోరనైనది1
- చిలుకానగర్లో SIR ప్రావాస్ అభియాన్.. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ పర్యటన బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు SIR మండల ప్రావాస్ అభియాన్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చిలుకానగర్ డివిజన్లో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలు, కాలనీల్లో బీఎల్వోలు, ఓటర్లతో మాట్లాడి SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని ఓటర్లకు సూచించారు.1
- కాప్రా–కుషాయిగూడలో మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం ప్రజల్లో ఆనందం కాప్రా, కుషాయిగూడ, ఏఎస్రావు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి. అయితే, వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా కొంతమేర రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవల నెలకొన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు. వర్షం మరింత కురిస్తే భూగర్భ జలాలు పెరిగి, నీటి కొరత సమస్యకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1
- ములుగు జిల్లాలో రాకాసి గాలులు నేలకూలిన వందల వృక్షాలు.... ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు సుమారు 3-4 కి.మీ మేర వందలాది భారీ వృక్షాలు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే తరహాలో 2024లో మేడారం అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకూలిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు.1
- సీసీ రోడ్డు,మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం,మన్ పహాడ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల విస్తరణతో పాటు మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు,అలాగే రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు,మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తూ గ్రామాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలమ్మ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్,జిల్లా నాయకులు ధర్మారెడ్డి, తోటకూరి పాండుకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న,నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్,మండల ఎస్సి మైనార్టీ సెల్ అధ్యక్షులు నాగరాజు, మహ్మద్ రసూల్, NSUI మండల అధ్యక్షుడు ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు యాకయ్య, మండల గ్రామ నాయకులు,రెడ్డి రమేష్, రవి,మహ్మద్ జాకిర్, మొటికే చంద్రశేఖర్, తోటకూరి రమేష్, లీనారెడ్డి, రాజేందర్, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- రాయగిరి స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ . పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని బుధవారం ఉదయం రాయగిరి స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండ చుట్టూ ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. VHP జిల్లా సత్సంగ్ ప్రముఖ్ పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకార్చనలు ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు స్వామీజీ, గడ్డమీది చంద్రయ్య భక్తులు పాల్గొన్నారు.1
- ఎంఐఎం నాయకులు ఒత్తిడికి తలంగిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ విధానం దీని వెనుక పెద్ద కుట్ర : మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఎంఐఎం నాయకుల ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 'ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్' విధానం వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. ఈ సర్టిఫికెట్ల వల్ల ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్వయంగా ప్రభుత్వ జీవోలోనే స్పష్టంగా చెప్పారు. మరి ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు? కేవలం హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా ఉన్న బోగస్ ఓటర్లు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, పాకిస్థానీలకు ఓటరు నమోదు (SIR) ప్రక్రియలో దొడ్డిదారిన గుర్తింపు కల్పించి ఓటు హక్కు ఇవ్వడానికే ఈ ప్రయత్నం. ఒక నోటరీ కాగితం మీద పేర్లు రాసిస్తే కేవలం రెండు రోజుల్లోనే సర్టిఫికెట్ ఇచ్చేంత దారుణమైన పరిస్థితి ఇది. దీని వెనుక ఉన్న దురుద్దేశాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ అక్రమ సర్టిఫికెట్లను ఓటరు నమోదు ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారికి (CEO) ఫిర్యాదు చేశాం. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఈ కుట్రను అడ్డుకుంటాం. - శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు1
- బీరప్పగడ్డ కమ్యూనిటీ హాల్కు తొలి అంతస్తు.. రూ.15 లక్షలతో నిర్మాణం బీరప్పగడ్డ డివిజన్లోని కమ్యూనిటీ హాల్ తొలి అంతస్తు నిర్మాణ పనులను రూ.15 లక్షలతో చేపడుతున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనులను పరిశీలించి, వెంటిలేషన్, పెద్ద తలుపులు, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.1