Shuru
Apke Nagar Ki App…
నాచారం, హెచ్ఎంటీ నగర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం, జండాల పంపిణీ నాచారం, హెచ్ఎంటీ నగర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నాచారం, హెచ్ఎంటీ నగర్ డివిజన్లో ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఔన్నత్యాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటాలని కోరారు. కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా ఉప్పల్ నియోజకవర్గం కో-కన్వీనర్ జవాజీ శ్రీధర్ రెడ్డి, గందమల గోపి తదితర నాయకులు పాల్గొన్నారు.
Bhaskar Reddy
నాచారం, హెచ్ఎంటీ నగర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం, జండాల పంపిణీ నాచారం, హెచ్ఎంటీ నగర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నాచారం, హెచ్ఎంటీ నగర్ డివిజన్లో ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఔన్నత్యాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటాలని కోరారు. కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా ఉప్పల్ నియోజకవర్గం కో-కన్వీనర్ జవాజీ శ్రీధర్ రెడ్డి, గందమల గోపి తదితర నాయకులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నాచారం, హెచ్ఎంటీ నగర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం, జండాల పంపిణీ నాచారం, హెచ్ఎంటీ నగర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నాచారం, హెచ్ఎంటీ నగర్ డివిజన్లో ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఔన్నత్యాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటాలని కోరారు. కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా ఉప్పల్ నియోజకవర్గం కో-కన్వీనర్ జవాజీ శ్రీధర్ రెడ్డి, గందమల గోపి తదితర నాయకులు పాల్గొన్నారు.1
- సారు ఒక్క యూరియా బస్తా ఇవ్వండి, మీ కాళ్ళు మొక్కుతంటూ వృద్ధ రైతు ఆవేదన..! మెదక్ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వృద్ధ రైతు. రేవంత్ సర్కార్లో రైతులకు తప్పని యూరియా కష్టాలు, యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోతున్న రైతులు.1
- హైదరాబాద్ లొ కంటి వెలుగు పథకానికి అలా బీజం పడింది: కేటీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లికి వెళ్తున్న సమయంలో కేసీఆర్ లక్ష్మాపురం గ్రామానికి చెందిన కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారని తెలిపారు. వారికి ఓ పేపర్ ఇచ్చి చదవమని కోరగా, కళ్ల చూపు సరిగా లేక చాలామంది ఇబ్బందిపడ్డారని చెప్పారు. ఒక్క లక్ష్మాపురం గ్రామంలోనే ఇంతమంది ఉంటే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచించిన కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు. అదే ఆలోచనతో కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.1
- సామాజిక విప్లవ యోధుడి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఘన నివాళులు సామాజిక విప్లవ యోధుడు,అమరజీవి ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. పాలమూరు గడ్డపై భూస్వామ్య పెత్తనానికి,అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారని పేర్కొన్నారు. పేద ప్రజల భూమి,భుక్తి,విముక్తి కోసం,బడుగు,బలహీన వర్గాల రాజ్యాధికార సాధన కోసం సత్యమన్న తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పార్టీ నాయకులు పేర్కొన్నారు.1
- నిరుద్యోగుల ఆగ్రహం: కోదండరాంను నిలదీసిన వైనం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులు ఎమ్మెల్సీ కోదండరాంను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అడ్డుకున్నారు. మీ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఇప్పుడు మా సమస్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 30 ఏళ్లకు ఉద్యోగాలకు పనికిరామా అంటూ నిలదీయడంతో, ఆయన సమాధానం చెప్పలేక వెనుదిరిగారు.1
- కోదండరాం ను సోమాజిగూడ లో నిలదీసిన నిరుద్యోగులు, వీడియో వైరల్ కోదండరాంను పరిగెత్తించిన నిరుద్యోగులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు1
- ఈనెల 15వ తారీకు నుంచి 23వ తారీకు వరకు తీజ్ ఉత్సవాలు ఓయూ లోఫాస్టర్ ఆవిష్కరణ.. ఈనెల 23వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శరత్ నాయక్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తీజ్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉత్సవాలకు బంజారా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 13 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 15వ తారీకు నుంచి 23వ తారీకు వరకు తీజ్ ఉత్సవాలలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. టూటా ప్రధాన కార్యదర్శి ప్రో. శ్రీను చౌహన్, విద్యార్థి నాయకులు డా. కరాటే రాజు, విజేందర్ పవార్, అశోక్ నాయక్, మహేష్ నాయక్, రవి నాయక్, శరత్ నాయక్, రవీందర్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.3