logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి బడ్జెట్ 2026-27 సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి తో కలిసి లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ , బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్,ఆర్.డి.ఓ గ్లోరియా, తాసిల్దార్ సలీమా , మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•
2 hrs ago

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి బడ్జెట్ 2026-27 సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి తో కలిసి లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ , బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్,ఆర్.డి.ఓ గ్లోరియా, తాసిల్దార్ సలీమా , మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

More news from Bapatla and nearby areas
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    1 hr ago
  • తాడికొండలో మర్డర్.. తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..! తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.
    1
    తాడికొండలో మర్డర్..
తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..!
తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • అల్లూరి జిల్లా,అనంతగిరి మండలం పరిధిలో గల పినకోట,జీనబాడు,పెదకోట, కివర్ల పంచాయతీలలో జిడిమామిడి రైతులకు ఈఏడాది తీవ్రంగా నష్టం చేకూరెలా ఉంది. ఈ ప్రాంతంలో రెండో ప్రధాన పంటగా జీడీ తోటలను అధికామొత్తంలో గిరిజన రైతులు సాగజెస్తున్నారు.ఇటీవల వర్షాలు,మబ్బులు వల్ల జీడీపూత మడిపోయిందని గిరిజనులు వాపోయారు.వేలల్లో వడ్డీలకు అప్పు తెచ్చి తోటలో పనులకు ఖర్చు చేశామని, కనీసం వడ్డీ తీర్చేందుకుకైనా జీడీ కాపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు తెగులు,అకాల వర్షాలకు నష్ట పోయిన జీడీ రైతులను ప్రభుత్వ ఆదుకోక పోతే ఉరి తాళ్ళే శరన్యమని గిరిజనులు అంటున్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల గిరిజన రైతులు మాట్లాడుతూ... ఈ సంవత్సరం అకాల వర్షాలు వల్ల,మంచు తెగులుతో జీడీతోటలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు. సంవత్సరం కాలం జీడి పైనె అదార పడ్డ గిరిజన రైతులు అప్పులు పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఎకారకు 30 వేలు చప్పున నష్టం పరిహరం చేల్లించాలని డిమాండ్ చేసారు,జిల్లా కలెక్టర్, ఐటీడీఏ,అధికారులు జీడీ పంటలకు నష్ట పరిహారంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.అల్లూరి జిల్లాలోని వరి తరువాత మెట్ట భూముల్లో ప్రదాన పంట జీడీ పంటగా ఉందని తెలిపారు.అటువంటి పంటలను కూటమి ప్రభుత్వ గుర్తించక పోవడం దారుణ మన్నారు.కోద్దిగోప్పో ఉన్న జీడీ పిక్కలకు మద్దతు ధర కేజీ 200 రూ/-ప్రకటించి ఆర్.ఎస్.కె ల ద్వారా కోను గోలు చేయాల అన్నారు.గత ఐదు సంవత్సరం నుండి వాతావరణ మార్పులు ఉష్ణో గ్రతలు పొగ మంచు,తెగుళ్లు పిండి నల్లి.వంటి తదితర విపత్తుల వల్ల పూత,పింజ దెబ్బతిని తీవ్ర నష్టాలకు గురయ్యారని పేర్కొన్నారు.ఈసంవత్సరం కూడా పూత వచ్చినా కాపు నిలపడక పూర్తిగా అనేక మంది తోటలు దెబ్బతి న్నాయని. తోటలో వివిధ పనులకు కొట్టటానికి ఎకరకు రూ.10నుండి 20వే వరకు పెట్టు బడిపెట్టి నా కాపునిలబడక నష్ట పోయామని తెలిపారు. ఈ పరిస్థితిలో రైతులు ప్రతి సంవత్సరం నష్టాలు భరించలేక అనేక మంది జీడీ తోటలను పూర్తిగా తొలగించుకునె పరిస్థితి ఎర్పడుతుందని తెలిపారు.జీడి పంటలు ఎస్సీ,ఎస్టి,చిన్న,సన్న కారు రైతులు ఎక్కువగా పండి స్తున్నామని తెలిపారు. కనీసం కేజీ. రూ.200/-ఇస్తే తప్ప కిట్టుబాటు కదన్నారు. అందువల్ల ప్రభుత్వం ఆర్.ఎస్.కెల ద్వారా కేజీ రూ.200/-కొనుగోలు చేయాలని,పంటల భీమా ప్రభుత్వమే ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసారు. హర్టికల్చర్ అదికారులు ఆపీసుల్లో నిద్ర పోకుండా గ్రామాల్లో తిరిగి జీడీ పంటలను అంచనా కట్టి వెంటనే నష్టపరిహారం చేల్లించాలని కేజీ జీడీ రెండు వందలు రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే కోనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.
    1
    అల్లూరి జిల్లా,అనంతగిరి మండలం పరిధిలో గల పినకోట,జీనబాడు,పెదకోట, కివర్ల పంచాయతీలలో జిడిమామిడి రైతులకు ఈఏడాది తీవ్రంగా నష్టం చేకూరెలా ఉంది.
ఈ ప్రాంతంలో రెండో ప్రధాన పంటగా జీడీ తోటలను అధికామొత్తంలో గిరిజన రైతులు సాగజెస్తున్నారు.ఇటీవల వర్షాలు,మబ్బులు వల్ల జీడీపూత మడిపోయిందని గిరిజనులు వాపోయారు.వేలల్లో వడ్డీలకు అప్పు తెచ్చి తోటలో పనులకు ఖర్చు చేశామని, కనీసం వడ్డీ తీర్చేందుకుకైనా జీడీ కాపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంచు తెగులు,అకాల వర్షాలకు నష్ట పోయిన జీడీ రైతులను ప్రభుత్వ ఆదుకోక పోతే ఉరి తాళ్ళే శరన్యమని గిరిజనులు అంటున్నారు.
ఈ సందర్బంగా ఆయా గ్రామాల గిరిజన రైతులు మాట్లాడుతూ...
ఈ సంవత్సరం అకాల వర్షాలు వల్ల,మంచు తెగులుతో జీడీతోటలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు. సంవత్సరం కాలం జీడి పైనె అదార పడ్డ గిరిజన రైతులు అప్పులు పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఎకారకు 30 వేలు చప్పున నష్టం పరిహరం చేల్లించాలని డిమాండ్ చేసారు,జిల్లా కలెక్టర్, ఐటీడీఏ,అధికారులు జీడీ పంటలకు నష్ట పరిహారంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.అల్లూరి జిల్లాలోని వరి తరువాత మెట్ట భూముల్లో ప్రదాన పంట జీడీ పంటగా ఉందని తెలిపారు.అటువంటి పంటలను కూటమి ప్రభుత్వ గుర్తించక పోవడం దారుణ మన్నారు.కోద్దిగోప్పో ఉన్న జీడీ పిక్కలకు మద్దతు ధర కేజీ 200 రూ/-ప్రకటించి ఆర్.ఎస్.కె ల ద్వారా కోను గోలు చేయాల అన్నారు.గత ఐదు సంవత్సరం నుండి వాతావరణ మార్పులు ఉష్ణో గ్రతలు పొగ మంచు,తెగుళ్లు పిండి నల్లి.వంటి తదితర విపత్తుల వల్ల పూత,పింజ దెబ్బతిని తీవ్ర నష్టాలకు గురయ్యారని పేర్కొన్నారు.ఈసంవత్సరం కూడా పూత వచ్చినా కాపు నిలపడక పూర్తిగా అనేక మంది తోటలు దెబ్బతి న్నాయని. తోటలో వివిధ పనులకు కొట్టటానికి ఎకరకు రూ.10నుండి 20వే వరకు పెట్టు బడిపెట్టి నా కాపునిలబడక నష్ట పోయామని తెలిపారు.
ఈ పరిస్థితిలో రైతులు ప్రతి సంవత్సరం నష్టాలు భరించలేక అనేక మంది జీడీ తోటలను పూర్తిగా తొలగించుకునె పరిస్థితి ఎర్పడుతుందని తెలిపారు.జీడి పంటలు ఎస్సీ,ఎస్టి,చిన్న,సన్న కారు రైతులు ఎక్కువగా పండి స్తున్నామని తెలిపారు.
కనీసం కేజీ. రూ.200/-ఇస్తే తప్ప కిట్టుబాటు కదన్నారు. అందువల్ల ప్రభుత్వం ఆర్.ఎస్.కెల ద్వారా కేజీ రూ.200/-కొనుగోలు చేయాలని,పంటల భీమా ప్రభుత్వమే ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసారు.
హర్టికల్చర్ అదికారులు ఆపీసుల్లో నిద్ర పోకుండా గ్రామాల్లో తిరిగి జీడీ పంటలను అంచనా కట్టి వెంటనే నష్టపరిహారం చేల్లించాలని కేజీ జీడీ రెండు వందలు రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే కోనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.
    user_Laxman Regam
    Laxman Regam
    Citizen information bureau అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మండపేట: కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి, అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    2
    మండపేట:
కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి,  అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది.పాల్వంచ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆమె కుమారుడు విక్కీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు విక్కీ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయలక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారును మరియు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
    4
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం  రోడ్డు ప్రమాదం సంభవించింది.పాల్వంచ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆమె కుమారుడు విక్కీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దురదృష్టవశాత్తు, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు విక్కీ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయలక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ  ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారును మరియు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    21 hrs ago
  • సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (స్థానిక సంస్థలు), రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో కలిసి *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్* ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని విభాగాల జిల్లా అధికారులు ప్రతి సోమావారం నిర్వహించే ప్రజావాణి కి తప్పక హాజరు కావాలని లేనిచో శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ సందర్భంగా కురవి మండలం కంచెర్ల గూడెం గ్రామానికి చెందిన బి. కవిత తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఆర్థికంగా ఇబ్బంది ఉందని వితంతు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు. కేసముధ్రం మండలం తౌర్య తండా కు చెందిన శ్రీనివాస్ తాను గతంలో గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు గాను MB ప్రకారం డబ్బులను ఇవ్వాలంటే తనకు కమిషన్ ఇవ్వాలని ప్రస్తుత సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని తన సమస్యను పరిష్కరించి తన డబ్బులను ఇప్పించగలరని కోరారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమ గ్రామ క్లస్టర్ లో రైతులు 70 శాతానికి పైగా మొక్కజొన్న పంట పండించారని తాము ఉన్న ప్రాంతానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చాలా దూరంగా ఉందని మా గ్రామం నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని కోరారు. ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన గుర్రం శివకృష్ణ తాను నిరుపేద వికలాంగుడినని మా గ్రామంలో పది సంవత్సరాలుగా రేషన్ డీలర్ ఇంచార్జి గా కొనసాగుతున్నారని అందువలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తనకు రేషన్ డీలర్ ఇంచార్జీ ఇప్పించి నా కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన ( 195 ) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు.
    1
    సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (స్థానిక సంస్థలు), రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో కలిసి  *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్*  ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. 
జిల్లాలో పనిచేస్తున్న అన్ని విభాగాల జిల్లా అధికారులు ప్రతి సోమావారం నిర్వహించే ప్రజావాణి కి తప్పక హాజరు కావాలని లేనిచో శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు.
ఈ సందర్భంగా  కురవి మండలం కంచెర్ల గూడెం గ్రామానికి చెందిన బి. కవిత తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఆర్థికంగా ఇబ్బంది ఉందని వితంతు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
కేసముధ్రం మండలం తౌర్య తండా కు చెందిన శ్రీనివాస్ తాను గతంలో   గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు గాను MB ప్రకారం డబ్బులను ఇవ్వాలంటే తనకు కమిషన్ ఇవ్వాలని ప్రస్తుత సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని  తన సమస్యను పరిష్కరించి తన డబ్బులను ఇప్పించగలరని కోరారు.
గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమ గ్రామ క్లస్టర్ లో రైతులు 70 శాతానికి పైగా మొక్కజొన్న పంట పండించారని తాము ఉన్న ప్రాంతానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చాలా దూరంగా ఉందని మా గ్రామం నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని కోరారు.
ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన  గుర్రం శివకృష్ణ తాను నిరుపేద వికలాంగుడినని మా గ్రామంలో పది సంవత్సరాలుగా రేషన్ డీలర్ ఇంచార్జి గా కొనసాగుతున్నారని అందువలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తనకు రేషన్ డీలర్ ఇంచార్జీ ఇప్పించి నా కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. 
ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన ( 195  ) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    30 min ago
  • నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన కనుకుంట్ల సుశీల గారు మరణానంతరం కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఆమె తన అవయవాలను దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని సంకల్పించడమే కాకుండా, తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల చదువుల కోసం నార్కెట్‌పల్లి కామిని హాస్పిటల్‌కు దానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు సుశీల గారి మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. ఆమె చూపిన సామాజిక స్పృహ, మానవత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. సుశీల గారి సేవలను స్మరించుకుంటూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దైద రవీందర్ గారు ఆకాంక్షించారు.
    4
    నకిరేకల్ నియోజకవర్గం:-
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన కనుకుంట్ల సుశీల గారు మరణానంతరం కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఆమె తన అవయవాలను దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని సంకల్పించడమే కాకుండా, తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల చదువుల కోసం నార్కెట్‌పల్లి కామిని హాస్పిటల్‌కు దానం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు సుశీల గారి మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. ఆమె చూపిన సామాజిక స్పృహ, మానవత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
సుశీల గారి సేవలను స్మరించుకుంటూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దైద రవీందర్ గారు ఆకాంక్షించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.