logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వనపర్తి లో స్కూల్స్ వదిలిపెట్టే సమయంలో వర్షం రావడంతో ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు మరియు ప్రయాణికులు ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు సరిగ్గా స్కూలు విడిచే సమయంలో వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లే పిల్లలు మరియు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు పడటం రైతులకు అనుకూలంగా ఉందని రైతులు తెలిపారు

3 hrs ago
user_Palla  karunakar
Palla karunakar
Astrologer వనపర్తి, వనపర్తి, తెలంగాణ•
3 hrs ago

వనపర్తి లో స్కూల్స్ వదిలిపెట్టే సమయంలో వర్షం రావడంతో ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు మరియు ప్రయాణికులు ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు సరిగ్గా స్కూలు విడిచే సమయంలో వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లే పిల్లలు మరియు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు పడటం రైతులకు అనుకూలంగా ఉందని రైతులు తెలిపారు

More news from తెలంగాణ and nearby areas
  • వనపర్తి లో స్కూల్స్ వదిలిపెట్టే సమయంలో వర్షం రావడంతో ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు మరియు ప్రయాణికులు ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు సరిగ్గా స్కూలు విడిచే సమయంలో వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లే పిల్లలు మరియు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు పడటం రైతులకు అనుకూలంగా ఉందని రైతులు తెలిపారు
    1
    వనపర్తి లో స్కూల్స్ వదిలిపెట్టే సమయంలో వర్షం రావడంతో ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు మరియు ప్రయాణికులు
ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు సరిగ్గా స్కూలు విడిచే సమయంలో వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లే పిల్లలు మరియు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు పడటం రైతులకు అనుకూలంగా ఉందని రైతులు తెలిపారు
    user_Palla  karunakar
    Palla karunakar
    Astrologer వనపర్తి, వనపర్తి, తెలంగాణ•
    3 hrs ago
  • ఈ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న వర్షం ఆనందంలో రైతన్నలు ధరూర్: మండలంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మోస్తారు వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక వ్యవసాయం ముందుకు సాగని క్రమంలో రైతులకు ఉత్సాహాన్ని అందించే విధంగా వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాటిన పత్తి వేరుశనగ పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.
    1
    ఈ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న వర్షం ఆనందంలో రైతన్నలు
ధరూర్: మండలంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మోస్తారు వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక  వ్యవసాయం ముందుకు సాగని క్రమంలో రైతులకు ఉత్సాహాన్ని అందించే విధంగా వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాటిన పత్తి వేరుశనగ పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    2 hrs ago
  • తాడూర్ :నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు:సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ తాడూర్ మండలo బలాన్ పల్లి గ్రామంలో ఆనాటి ప్రభుత్వం 1990లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ హద్దులు జాగాలు చూపించలేదు, నేటికీ ఇలా స్థలాలు ఊహించకపోవడం చాలా బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, అన్నారు, నిరుపేదలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడు ఉంటుందని అన్నారు, ఇలా జాగాలు ఇచ్చేవరకు సిపిఐ పార్టీ ఎల్లవేళలా ముందుండి పోరాటం చేస్తామని ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే వరకు పోరాటం చేస్తామన్నారు, 1999 సంవత్సరంలో 54 మంది పట్టాలు ఇచ్చారు, అదే మరసటి 2000 సంవత్సరంలో కూడా 54 మందికి పట్టాలిచ్చారు, డబల్ ఇచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు, ఇప్పటికైనా 1999లో ఇచ్చిన వారికి ముందుగా ఇచ్చి 2000 సంవత్సరంలో కూడా ఇవ్వాలని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సూర్య శంకర్ గౌడ్, విద్యా శ్రీనివాసులు, మారేడు శివశంకర్, సిపిఐ తాడూరు మండల సహాయ కార్యదర్శి దాంగడ్ల వెంకటస్వామి, సిపిఐ గ్రామ నాయకులు ఈర్ల నారాయణ, కొండన్న గౌడ్, గ్రామ నాయకులు అగ్నివేష్, గిరి, బాలస్వామి, భాస్కర్, ప్రభాకర్ ముసలయ్య, గిరి చారి, వెంకటేశ్వరమ్మ,శోభ, శివలీల గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు,
    1
    తాడూర్ :నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు:సిపిఐ జిల్లా కార్యదర్శి 
 ఎస్ఎండి ఫయాజ్
తాడూర్ మండలo బలాన్ పల్లి గ్రామంలో ఆనాటి ప్రభుత్వం 1990లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ హద్దులు జాగాలు చూపించలేదు, నేటికీ ఇలా స్థలాలు ఊహించకపోవడం చాలా బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, అన్నారు, నిరుపేదలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడు ఉంటుందని అన్నారు, ఇలా జాగాలు ఇచ్చేవరకు సిపిఐ పార్టీ ఎల్లవేళలా ముందుండి పోరాటం చేస్తామని ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే వరకు పోరాటం చేస్తామన్నారు, 
1999 సంవత్సరంలో 54 మంది పట్టాలు ఇచ్చారు, అదే మరసటి 2000 సంవత్సరంలో కూడా 54 మందికి పట్టాలిచ్చారు, డబల్ ఇచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు, ఇప్పటికైనా 1999లో ఇచ్చిన వారికి ముందుగా ఇచ్చి 2000 సంవత్సరంలో కూడా ఇవ్వాలని అన్నారు, 
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సూర్య శంకర్ గౌడ్, విద్యా శ్రీనివాసులు, మారేడు శివశంకర్, సిపిఐ తాడూరు మండల సహాయ కార్యదర్శి దాంగడ్ల వెంకటస్వామి, సిపిఐ గ్రామ నాయకులు ఈర్ల నారాయణ, కొండన్న గౌడ్, గ్రామ నాయకులు అగ్నివేష్, గిరి, బాలస్వామి, భాస్కర్, ప్రభాకర్ ముసలయ్య, గిరి చారి, వెంకటేశ్వరమ్మ,శోభ, శివలీల గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు,
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    2 hrs ago
  • మహబూబ్ నగర్ లో గ్రాండ్ గా ప్రారంభమైన ఎఫ్.కె డెంటల్ కేర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎస్ గుట్ట చౌరస్తా వద్ద ఎఫ్.కె డెంటల్ కేర్ ఆసుపత్రి గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఇర్షద్ హుస్సేన్,అర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
    2
    మహబూబ్ నగర్ లో గ్రాండ్ గా ప్రారంభమైన ఎఫ్.కె డెంటల్ కేర్
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎస్ గుట్ట చౌరస్తా వద్ద ఎఫ్.కె డెంటల్ కేర్ ఆసుపత్రి గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఇర్షద్ హుస్సేన్,అర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
    user_GVG
    GVG
    Reporter మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    1 hr ago
  • భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు నీటి విడుదల భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల యాత్ర పేరుతో విహారయాత్రలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.
    1
    భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు నీటి విడుదల
భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల యాత్ర పేరుతో విహారయాత్రలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    3 hrs ago
  • ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ చౌరస్తా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వర త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్నిమాపక సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు
    1
    ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయుడు 
అలంపూర్ చౌరస్తా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వర త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్నిమాపక సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు
    user_Venkatesh
    Venkatesh
    ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    6 hrs ago
  • నల్లమల గిరిజనులు, ఆదివాసీలు ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం, అచ్చంపేట నియోజకవర్గంలో రూ.12.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన,రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరియు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ* నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని మన్నానూర్ గ్రామం లోని చెంచు గిరిజనుల స్వయం ఉపాధికి రూ.1.80 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, గురుకులాల ఆకస్మిక తనిఖీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి విద్యార్థులు, సిబ్బందితో ముఖాముఖి విద్య, వసతి, మౌలిక వసతులపై సమగ్ర సమీక్ష దివంగత దళిత ఉద్యమ నాయకుడు పుట్టపాక మహేంద్రనాథ్ కలలు కన్న సమసమాజ నిర్మాణం,దళిత,గిరిజన సాధికారత,నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నల్లమల గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ప్రత్యేక లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందని, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, వారి పిల్లలకు అత్యున్నత స్థాయి విద్యను అందించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తోందని మంత్రి అన్నారు.మంగళవారం మన్ననూరులో పర్యటించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాసంస్థల సిబ్బంది,ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వివిధ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.మంత్రి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం,పీవీటీజీ గురుకుల విద్యాసంస్థ, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, ఇతర విద్యాసంస్థల తరగతి గదులు,హాస్టళ్లు,వంటశాలలు,భోజనశాలలు,తాగునీటి సౌకర్యాలు,మరుగుదొడ్లు, వసతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, ఆహార నాణ్యత,ఆరోగ్య సేవలు,పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు, క్రీడా సామగ్రి, ఉపాధ్యాయుల బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను చెప్పాలని సూచిస్తూ,ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సందేశం ఇచ్చిన మంత్రి, నల్లమల అడవులు తెలంగాణకు ప్రకృతి వరమని,వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.విద్యార్థులు ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అమ్రాబాద్,పదర మండలాల్లో ఆర్టికల్–273(1) గ్రాంట్, ప్రధానమంత్రి ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ (PM DA–JGUA) పథకాల కింద రూ.12.70 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. విద్యా సంస్థల్లో అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, టాయిలెట్ బ్లాకులు,తాగునీటి సదుపాయాలు,స్టోరేజ్ సంపులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణం ఈ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు.అదే విధంగా చెంచు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అడవుల్లో సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వెదురు ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు, ఇతర అటవీ ఉత్పత్తులను నేరుగా విక్రయించే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీని అరికట్టి గిరిజన కుటుంబాలకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ మాట్లాడుతూ....,మహేంద్రనాథ్ గారు తన జీవితమంతా దళితులు, గిరిజనులు, పేద ప్రజల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రజా ప్రభుత్వం స్వీకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందరికీ చేరేలా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నాం. నల్లమల బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడబోము.అవసరమైన ప్రతి రూపాయిని ప్రభుత్వం వెచ్చిస్తుంది అని స్పష్టం చేశారు.నల్లమల ప్రాంతంలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. దేశంలోనే ఆదర్శప్రాయంగా గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మొటిక్ చార్జీలను కూడా గణనీయంగా పెంచి విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులకు మెరుగైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, అవసరమైన వస్తువులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరతపై స్పందించిన మంత్రి, విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన చోట వెంటనే బోధన సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించి త్వరితగతిన భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. బోధన సిబ్బంది సేవల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి వచ్చే జూన్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పదేళ్లకు పైగా సేవలందిస్తున్న నాన్-టీచింగ్ సిబ్బంది, వంట కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.చిన్నచిన్న కారణాలతో సస్పెండ్ అయిన వారి కేసులను శాఖాపరంగా సమీక్షించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రభుత్వానికి సమానంగా ముఖ్యమని అన్నారు.మహిళా గిరిజన గురుకుల పాఠశాల తనిఖీలో తాగునీరు,మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్య విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.దళిత, గిరిజన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు .హైదరాబాద్‌లో అందుతున్న నాణ్యమైన కోచింగ్, ఆధునిక బోధనా విధానాలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను నల్లమల ప్రాంత గురుకులాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. వైద్యులు,ఇంజినీర్లు,శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పరిశోధకులుగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.క్రీడలకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, నల్లమల ప్రాంతంలో ఉన్న సహజ ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణ, క్రీడా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు ఈ ప్రాంతం నుంచి రావాలని ఆకాంక్షించారు. రాబోయే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో నల్లమల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటనలో మన్ననూరులోని పీవీటీజీ గురుకుల జూనియర్ కళాశాలకు అదనపు తరగతి గదులు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ గోడ, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, ఉడిమిల్ల బాలికల ఆశ్రమ పాఠశాలకు డార్మిటరీ,అదనపు తరగతి గదులు,స్టోరేజ్ సంప్,అచ్చంపేట,ఇనోల్,బాణాల,చెంచుగూడెం గిరిజన విద్యాసంస్థలకు ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించగా,పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి కార్యక్రమం పారదర్శకంగా అమలు కావాలని, నల్లమల ప్రాంత అభివృద్ధిలో అధికారులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని మంత్రి సూచించారు.స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ...., అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి మన నల్లమల్ల ముద్దుబిడ్డ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా నల్లమల ప్రాంతంలోని చెంచు గిరిజనులు,దళితులు,వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న నల్లమల గ్రామాలకు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులు వేగంగా చేరుతున్నాయని తెలిపారు.రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా నల్లమల ప్రాంతంలో పర్యటించి గురుకుల విద్యాసంస్థలను సందర్శించడం, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సురక్షితమైన వసతి, నాణ్యమైన ఆహారం,అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.అమ్రాబాద్, పదర మండలాల్లో రూ.12.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.గురుకులాలు,ఆశ్రమ పాఠశాలల్లో కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.చెంచు గిరిజనుల కోసం రూ.1.80 కోట్లతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. గిరిజనులు అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వివిధ ఉత్పత్తులు తదితర వస్తువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీ తగ్గి,గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.అచ్చంపేట నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.నల్లమల ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రతి గిరిజన తండా, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందే వరకు తమ కృషి కొనసాగుతుందని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అచ్చంపేట నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అనంతరం మద్దిమడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే తీర్థ ప్రసాదాలను అందజే శారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డిఇఓ రమేష్ కుమార్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి ,ఆయా శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    నల్లమల గిరిజనులు, ఆదివాసీలు ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం, అచ్చంపేట నియోజకవర్గంలో రూ.12.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన,రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరియు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ*
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని మన్నానూర్ గ్రామం లోని చెంచు గిరిజనుల స్వయం ఉపాధికి రూ.1.80 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, గురుకులాల ఆకస్మిక తనిఖీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి విద్యార్థులు, సిబ్బందితో ముఖాముఖి  విద్య, వసతి, మౌలిక వసతులపై సమగ్ర సమీక్ష
దివంగత దళిత ఉద్యమ నాయకుడు పుట్టపాక మహేంద్రనాథ్ కలలు కన్న సమసమాజ నిర్మాణం,దళిత,గిరిజన సాధికారత,నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నల్లమల గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ప్రత్యేక లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందని, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, వారి పిల్లలకు అత్యున్నత స్థాయి విద్యను అందించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తోందని మంత్రి అన్నారు.మంగళవారం మన్ననూరులో  పర్యటించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాసంస్థల సిబ్బంది,ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వివిధ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.మంత్రి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం,పీవీటీజీ గురుకుల విద్యాసంస్థ, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, ఇతర విద్యాసంస్థల తరగతి గదులు,హాస్టళ్లు,వంటశాలలు,భోజనశాలలు,తాగునీటి సౌకర్యాలు,మరుగుదొడ్లు, వసతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, ఆహార నాణ్యత,ఆరోగ్య సేవలు,పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు, క్రీడా సామగ్రి, ఉపాధ్యాయుల బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను చెప్పాలని సూచిస్తూ,ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సందేశం ఇచ్చిన మంత్రి, నల్లమల అడవులు తెలంగాణకు ప్రకృతి వరమని,వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.విద్యార్థులు ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అమ్రాబాద్,పదర మండలాల్లో ఆర్టికల్–273(1) గ్రాంట్, ప్రధానమంత్రి ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ (PM DA–JGUA) పథకాల కింద రూ.12.70 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. విద్యా సంస్థల్లో అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, టాయిలెట్ బ్లాకులు,తాగునీటి సదుపాయాలు,స్టోరేజ్ సంపులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణం ఈ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు.అదే విధంగా చెంచు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అడవుల్లో సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వెదురు ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు, ఇతర అటవీ ఉత్పత్తులను నేరుగా విక్రయించే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీని అరికట్టి గిరిజన కుటుంబాలకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ మాట్లాడుతూ....,మహేంద్రనాథ్ గారు తన జీవితమంతా దళితులు, గిరిజనులు, పేద ప్రజల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రజా ప్రభుత్వం స్వీకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందరికీ చేరేలా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నాం. నల్లమల బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడబోము.అవసరమైన ప్రతి రూపాయిని ప్రభుత్వం వెచ్చిస్తుంది అని స్పష్టం చేశారు.నల్లమల ప్రాంతంలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. దేశంలోనే ఆదర్శప్రాయంగా గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మొటిక్ చార్జీలను కూడా గణనీయంగా పెంచి విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులకు మెరుగైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, అవసరమైన వస్తువులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరతపై స్పందించిన మంత్రి, విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన చోట వెంటనే బోధన సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించి త్వరితగతిన భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. బోధన సిబ్బంది సేవల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి వచ్చే జూన్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
పదేళ్లకు పైగా సేవలందిస్తున్న నాన్-టీచింగ్ సిబ్బంది, వంట కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.చిన్నచిన్న కారణాలతో సస్పెండ్ అయిన వారి కేసులను శాఖాపరంగా సమీక్షించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రభుత్వానికి సమానంగా ముఖ్యమని అన్నారు.మహిళా గిరిజన గురుకుల పాఠశాల తనిఖీలో తాగునీరు,మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్య విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.దళిత, గిరిజన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు .హైదరాబాద్‌లో అందుతున్న నాణ్యమైన కోచింగ్, ఆధునిక బోధనా విధానాలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను నల్లమల ప్రాంత గురుకులాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. వైద్యులు,ఇంజినీర్లు,శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పరిశోధకులుగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.క్రీడలకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, నల్లమల ప్రాంతంలో ఉన్న సహజ ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణ, క్రీడా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు ఈ ప్రాంతం నుంచి రావాలని ఆకాంక్షించారు. రాబోయే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో నల్లమల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పర్యటనలో మన్ననూరులోని పీవీటీజీ గురుకుల జూనియర్ కళాశాలకు అదనపు తరగతి గదులు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ గోడ, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, ఉడిమిల్ల బాలికల ఆశ్రమ పాఠశాలకు డార్మిటరీ,అదనపు తరగతి గదులు,స్టోరేజ్ సంప్,అచ్చంపేట,ఇనోల్,బాణాల,చెంచుగూడెం గిరిజన విద్యాసంస్థలకు ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించగా,పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి కార్యక్రమం పారదర్శకంగా అమలు కావాలని, నల్లమల ప్రాంత అభివృద్ధిలో అధికారులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని మంత్రి సూచించారు.స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ...., అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి మన నల్లమల్ల ముద్దుబిడ్డ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా నల్లమల ప్రాంతంలోని చెంచు గిరిజనులు,దళితులు,వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న నల్లమల గ్రామాలకు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులు వేగంగా చేరుతున్నాయని తెలిపారు.రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా నల్లమల ప్రాంతంలో పర్యటించి గురుకుల విద్యాసంస్థలను సందర్శించడం, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సురక్షితమైన వసతి, నాణ్యమైన ఆహారం,అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.అమ్రాబాద్, పదర మండలాల్లో రూ.12.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.గురుకులాలు,ఆశ్రమ పాఠశాలల్లో కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.చెంచు గిరిజనుల కోసం రూ.1.80 కోట్లతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. గిరిజనులు అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వివిధ ఉత్పత్తులు తదితర వస్తువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీ తగ్గి,గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.అచ్చంపేట నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.నల్లమల ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రతి గిరిజన తండా, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందే వరకు తమ కృషి కొనసాగుతుందని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అచ్చంపేట నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని  ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు.
అనంతరం మద్దిమడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. 
ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే తీర్థ ప్రసాదాలను అందజే శారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డిఇఓ రమేష్ కుమార్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి ,ఆయా శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Chalamala Nagaraju goud
    Chalamala Nagaraju goud
    Local News Reporter ఉప్పునుంతల, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    22 hrs ago
  • రామ్ సార్ షాపింగ్ మాల్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రధాన రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ లేని రహదారిపై ప్రమాద గంటికలు వనపర్తి (ప్రత్యేక ప్రతినిధి): వనపర్తి పట్టణంలోని జి గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు రాంస షాపింగ్ మాల్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగం మితిమీరిపోవడంతో రోడ్డు దాటే కాలినడక ప్రయాణికులు తీవ్ర తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు రోడ్డు దాటాల్సి వస్తోంది. అయితే, ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు వేగంగా రావడంతో కాలినడకన వెళ్లేవారు రోడ్డు దాటడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ పలు చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ​ప్రజల విజ్ఞప్తి: అధికారులు తక్షణమే స్పందించి జి గార్డెన్ – రాంస షాపింగ్ మాల్ సమీపంలో వెంటనే ప్రమాద నివారణకు స్పీడ్ బ్రేకర్లను మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు సంబంధిత మున్సిపల్, పోలీసు, మరియు రహదారుల శాఖ అధికారులను కోరుతున్నారు.
    1
    రామ్ సార్ షాపింగ్ మాల్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రధాన రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ లేని రహదారిపై ప్రమాద గంటికలు
వనపర్తి (ప్రత్యేక ప్రతినిధి): వనపర్తి పట్టణంలోని జి గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు రాంస షాపింగ్ మాల్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగం మితిమీరిపోవడంతో రోడ్డు దాటే కాలినడక ప్రయాణికులు తీవ్ర తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
​ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు రోడ్డు దాటాల్సి వస్తోంది. అయితే, ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు వేగంగా రావడంతో కాలినడకన వెళ్లేవారు రోడ్డు దాటడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ పలు చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారని ప్రజలు తెలుపుతున్నారు.
​ప్రజల విజ్ఞప్తి: అధికారులు తక్షణమే స్పందించి జి గార్డెన్ – రాంస షాపింగ్ మాల్ సమీపంలో వెంటనే ప్రమాద నివారణకు స్పీడ్ బ్రేకర్లను మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు సంబంధిత మున్సిపల్, పోలీసు, మరియు రహదారుల శాఖ అధికారులను కోరుతున్నారు.
    user_Palla  karunakar
    Palla karunakar
    Astrologer వనపర్తి, వనపర్తి, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.