Shuru
Apke Nagar Ki App…
నందవరంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం “బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” అంటూ ప్రజలకు అవగాహన
K AMPAIAH ACHARI
నందవరంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం “బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” అంటూ ప్రజలకు అవగాహన
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- “బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” అంటూ ప్రజలకు అవగాహన1
- రైతన్న సోదరులకు రాబోయే ఐదు రోజుల్లోపు చేన్లో ఏమైనా పంట ఉంటే అంత క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాం వాతావరణ శాఖ ఐదు రోజుల్లో వాన ఉందని చెబుతుంది1
- మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం పరిధిలో కంబలదిన్నె గ్రామంలో వెలసిన నూతన ఆలయంలో నందు శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవం ఆహ్వానం 26వ కంబలదిన్నె గ్రామంలో జరగబోయే శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం 27వ తేదీ నాడు ఏప్రిల్ రథోత్సవం ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి ఉంటుంది కావున రాథోత్సవాన్ని ప్ర మా లలు ధరించిన 19 మంది ప్రతి సంవత్సరం దరిస్తున్నారు నేటి కి దాదాపుగా 12 సంవత్సరాలు కావొస్తుంది ప్రతి ఏటా స్వాములు కొత్తగా మాలలు దరిస్తూ ఉంటారు వివరాలకు వస్తే ఇలా ఉన్నాయి స్వామి పేరులు వచ్చేసి గురు స్వాములు జాల్వడప్ప స్వామి దేవేంద్ర స్వామి వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ఈరన్న స్వామి గంగన్న స్వామి ఇరు స్వామి సురేష్ స్వామి రఘు స్వామి చిన్న రెడ్డి స్వామి ప్రకాసుస్వామి బ్రహ్మయ్య స్వామి స్వామి మాలలు ధరించారు1
- ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల కూటమికి చెందిన సౌదీ రావుఫ్తో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇది చల్లారకముందే ఎమ్మెల్యేకు మరో వివాదం తలెత్తింది. శుక్రవారం వాట్స్అప్ కాల్ రికార్డింగ్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆలూరు వైసీపీ నాయకుడు గోనెహాల్ వెంకటరాముడుతో ఆదోని ప్రాంతానికి సంబంధించిన భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆ రికార్డింగ్లలో వినిపిస్తోంది. “పెద్దపెద్ద ఫైళ్లు ఉన్నాయి… తహసిల్దార్తో కలిసి హైదరాబాద్కు రండి, అక్కడే మాట్లాడుకుందాం” అని ఎమ్మెల్యే చెప్పినట్లు రికార్డింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కూటమి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.1
- టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ జన్మదిన సందర్భంగా ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉన్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు టిడిపి మండల కన్వీనర్ సీనప్ప, టిడిపి సీనియర్ నాయకులు నరసప్ప, హనుమయ్య,మసాలా జగన్, డాక్టర్ నెట్టప్ప, గుండన్న మరియు టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది.1
- Post by Mallikarjuna1
- ఎమ్మిగనూరు సబ్డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు. చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి” అని అవగాహన కల్పించారు.1
- బనవాసి నవోదయ విద్యాలయం ముందు విద్యార్థి సంఘాల ధర్నా1