Shuru
Apke Nagar Ki App…
ముంచంగిపుట్టు: లక్ష్మీపురం పంచాయతీ జబడలో తాజా మాజీ సర్పంచ్ కొర్రా త్రినాధ్ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గత ఐదేళ్లలో 19 గ్రామాల్లో రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించి అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు కృతజ్ఞతగా ఈ సత్కారం చేశారు. పదవీకాలం ముగిసినా ప్రజలకు తన సేవ ఎప్పటికీ కొనసాగుతుందని త్రినాధ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
Shyam
ముంచంగిపుట్టు: లక్ష్మీపురం పంచాయతీ జబడలో తాజా మాజీ సర్పంచ్ కొర్రా త్రినాధ్ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గత ఐదేళ్లలో 19 గ్రామాల్లో రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించి అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు కృతజ్ఞతగా ఈ సత్కారం చేశారు. పదవీకాలం ముగిసినా ప్రజలకు తన సేవ ఎప్పటికీ కొనసాగుతుందని త్రినాధ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం లో నిర్మాణం జరుగుతున్న మూలపేట పోర్ట్ పనులును సోమవారం నాడు రాష్ట్ర మత్స్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి, అచ్చం నాయుడు, ఆర్ అండ్ బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి పనులు పరిశీలించారు ఈ ప్రాంతంతో అభివృద్ధిలో ముందుకు వెళుతుందని తెలిపారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది.పాల్వంచ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్పై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆమె కుమారుడు విక్కీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు విక్కీ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయలక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారును మరియు డ్రైవర్ను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.4
- వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24) పై హత్యాయత్నం ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు యువకుని పరిస్థితి విషమం1
- Post by Syyed taher1
- తాడికొండలో మర్డర్.. తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..! తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.1
- వరంగల్ జిల్లా:వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్ అశోక కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన సతీమణి నాయిని నీలిమ రెడ్డితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. కాలనీ ప్రజలు, భక్తులు ఏకమై ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.2
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బంగారు జాల కు చెందిన మహిళపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. తనతో మాట్లాడుకుందామని చెప్పి కోపంతో ఆమెపై బీరు సీసా, కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని బంగారు జలకకు చెందిన తాటి నికిత (24) ఒక కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మండల పరిధిలోని కరకవాగు ప్రాంతానికి చెందిన వజ్జా పవన్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం నటరాజ్ సెంటర్ వద్ద ఆమెను అడ్డగించి వేధించడమే కాకుండా, అందరి ముందూ భయభ్రాంతులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. ఫిర్యాదు రాసిమ్మని సిబ్బంది చెప్పటంతో స్టేషన్ నుండి బయటకు వస్తున్న క్రమం లో, పవన్ మరో వ్యక్తి (ఆటో డ్రైవర్) కలిసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కరకవాగు రైల్వే ట్రాక్ ప్రాంతానికి తీసుకువెళ్లాడని యువతి తెలిపింది.. పవన్, అక్కడ యువతిపై అత్యాచారం చేసి,బీరు సీసా, కర్రతో కొట్టడంతో ఆమె తల, చేతులు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలిని ఆటోలోనే ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేసి నిందితుడు పరారయ్యాడని యువతి ఆరోపిస్తుంది... ప్రస్తుతం బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.4
- Post by Syyed taher1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బూత్ అధ్యక్షులు బుర్ర సంతోష్, గొల్లపెల్లి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బత్తిని జలందర్ మాట్లాడుతూ బీజేపీ ఏకాత్మ మానవవాద సిద్ధాంతంతో దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపెల్లి సంతోష్ మాట్లాడుతూ అంత్యోదయ లక్ష్యంతో కేంద్ర పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు1