Shuru
Apke Nagar Ki App…
సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు.. నిర్మల్ లోని ద్యాగవాడ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకున్నారు. పురుషులు, మహిళలు తలపాగా పెట్టుకొని పురవీధులలో నిర్వహించిన బోనాల శోభాయాత్ర స్థానికులను ఆకర్శించింది. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. సమృద్ధిగా పాడి పంటలు పండాలని, వర్షాలు కురవాలని,అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏడాది తమ పూర్వీకుల కాలం నుంచి ఈ పండుగను నిర్వహించుకుంటమన్నారు.
SIDDU.ASRC
సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు.. నిర్మల్ లోని ద్యాగవాడ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకున్నారు. పురుషులు, మహిళలు తలపాగా పెట్టుకొని పురవీధులలో నిర్వహించిన బోనాల శోభాయాత్ర స్థానికులను ఆకర్శించింది. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. సమృద్ధిగా పాడి పంటలు పండాలని, వర్షాలు కురవాలని,అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏడాది తమ పూర్వీకుల కాలం నుంచి ఈ పండుగను నిర్వహించుకుంటమన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్.హెచ్.జీ. (S.H.G.) వి.ఓ. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో స్వయం సహాయక సంఘాల (S.H.G.) వి.ఓ. రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు మరియు ప్రజల అవసరాలపై మండల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోండుగారి చైతన్య శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ , మండల అద్యక్షులు నర్సారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి , BJYM జిల్లా అద్యక్షులు నిరంజన్ రెడ్డి తో పాటు మహిళా సమైక్య సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.2
- ఖానాపూర్ దిలావపూర్ రేంకోని వాగు బ్రిడ్జ్ దగ్గర మూలమలుపు భయంకరంమైన ములమలుపు ఖానాపూర్ దిలావపూర్ రేంకోని వాగు బ్రిడ్జి కంప్లీట్ చేయకపోగా భయంకరంగా మూలమలుపు తయారైందని స్థానిక ప్రజలు వాహనదారులు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు రోడ్ల వెడల్పు పనులు చేపట్టి పూర్తిచేయాలని ప్రజలు వాహనదారులు తెలియజేశారు1
- గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై అధికారులకు శిక్షణ నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై నియోజకవర్గంలోని ఎంపిడిఓ, ఎంపీఓ,ఏపీఓ, ఏంఏఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జీపీడీపీలోని పలు అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్,పిఎడి నాగవర్ధన్ పాల్గొన్నారు.1
- కోరుట్ల పీబీ గార్డెన్స్లో "సైబర్ జాగృతిక దివాస్ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్1
- ఎమ్మెల్యే ముందే ప్రభుత్వాసుపత్రి వైద్యులను నిలదీసిన బాసర నాయకులు... బాసర లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై మంగళవారం జరిగిన సర్వ సభ్య సమావేశం లో ఆగ్రహం వ్యక్త పరచారు. సమయపాలన పాటించడం లేదని, అవసరమైన మందులను పిహెచ్ సి లో అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందు వాపోయారు. 26 జనవరి రోజు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా 11 గంటలకు జాతీయ జెండాను ఎగరవేశారని సాక్షాత్తు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందే నిలదీశారు.. మరోసారి ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చూడాలని బిద్దురు రమేష్ కోరారు.1
- గుడిహత్నూర్లో భారీ ట్రాఫిక్ జామ్ గంటల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు గుడిహత్నూర్ జాతీయ రహదారిపై బుధవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవే సమీపంలో సర్వీస్ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా మండల కేంద్రంలోని జవహర్ నగర్ వరకు వాహనాలు బారులుగా నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారి ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.1
- ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును సమీక్షించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, ఇతర సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సిటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడం, ఎక్స్రే ఫిలింల కొరత ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సిటీ స్కాన్ మరమ్మతులు చేపట్టడంతో పాటు ఎక్స్రే ఫిలింల కొరత లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 25 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనం పూర్తయిందని, ప్రారంభోత్సవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. దీంతో జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ను ఆదేశించారు. ప్రతిరోజూ ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రోగులతో ఆప్యాయంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ స్థానిక కౌన్సిలర్ గంజి రాజు, కౌన్సిలర్లు జింక సూరి, శ్రీరామోజు నరేష్, ఈశ్వర్, అర్జున్, విఠల్, సూరజ్, సాత్విక్, BJYM జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు జుట్టు దినేష్, జాప ప్రసాద్, కందుల హరీష్, అచ్యుత్ రావు, తో పాటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దు, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సైబర్ జాగృతిక దివాస్ సందర్భంగా కళాశాలల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు మాయమాటలతో మోసాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని, అంతే కాకుండా ఫోన్ కు వచ్చే మెసేజ్ లకు స్పందించి ఓటీపీలు వంటి సమాచారం చెప్పొద్దని సూచించారు. బ్యాంకు వ్యక్తిగత పిన్ నంబర్లు సైతం గోప్యంగా ఉంచుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మి నారాయణ, కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.1