జగిత్యాల 8వ వార్డు గోత్రాల కాలనీలో విచిత్ర డ్రైనేజ్ నిర్మాణం జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 8వ వార్డు గోత్రాల కాలనీలో డ్రైనేజ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాధారణంగా కల్వర్టు కిందుగా వెళ్లాల్సిన డ్రైనేజ్ లైన్ను పైభాగంలో ఏర్పాటు చేయడంతో మురుగు నీరు కల్వర్టుపై నుంచి ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాలు పడినప్పుడు లేదా చెత్త అడ్డం పడినప్పుడు మురుగు నీరు నిలిచిపోతూ కాలనీలో దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగు నీరు సరిగా వెళ్లకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. చెత్త, మట్టి అడ్డం పడినప్పుడు నీరు నిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి పేరుకుపోతుందని, దీని వల్ల దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితి ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ కాలనీలో ఇలాంటి నిర్లక్ష్య పనులు జరగడం ఆశ్చర్యకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు చేపట్టే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై వెంటనే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి కాలనీవాసులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
జగిత్యాల 8వ వార్డు గోత్రాల కాలనీలో విచిత్ర డ్రైనేజ్ నిర్మాణం జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 8వ వార్డు గోత్రాల కాలనీలో డ్రైనేజ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాధారణంగా కల్వర్టు కిందుగా వెళ్లాల్సిన డ్రైనేజ్ లైన్ను పైభాగంలో ఏర్పాటు చేయడంతో మురుగు నీరు కల్వర్టుపై నుంచి ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాలు పడినప్పుడు లేదా చెత్త అడ్డం పడినప్పుడు మురుగు నీరు నిలిచిపోతూ కాలనీలో దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగు నీరు సరిగా వెళ్లకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. చెత్త, మట్టి అడ్డం పడినప్పుడు నీరు నిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి పేరుకుపోతుందని, దీని వల్ల దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితి ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ కాలనీలో ఇలాంటి నిర్లక్ష్య పనులు జరగడం ఆశ్చర్యకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు చేపట్టే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై వెంటనే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి కాలనీవాసులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని గంగారం తండాకు చెందిన రైతు తేజావత్ నరహరి లేగదూడపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఉదయం పశువులను చూసేందుకు వెళ్లిన రైతులు ఈ ఘటనను గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. వరుసగా పెద్దపులి సంచారం వార్తలు వెలువడుతుండటంతో గ్రామస్థుల్లో భయం నెలకొంది2
- జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని క్లాసులకు అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది.1
- తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.1
- विजया लक्ष्मी हॉस्पिटल के डॉ. किरण कुमार का गलत व्यवहार* *21 साल की महिला जो बुखार का इलाज कराने हॉस्पिटल गई थी* *आरोप है कि इंजेक्शन लगाने के बाद उन्होंने महिला के साथ गलत व्यवहार किया* *परिवार वालों का आरोप है कि उन्होंने "तुम सुंदर हो" कहकर उसे छुआ* महिला ने तुरंत WhatsApp पर अपनी मां को बताया माता-पिता हॉस्पिटल पहुंचे वे महिला को वहां से ले गए परिवार वालों ने महिला का दूसरे हॉस्पिटल में इलाज कराया परिवार वालों ने सुबह डॉक्टर से पूछताछ की बताया गया कि बहस हुई और डॉक्टर पर हमला किया गया पुलिस मौके पर पहुंची पुलिस ने डॉक्टर को हिरासत में लिया स्थानीय स्तर पर, थोरूर में हुई इस घटना से हंगामा मच गया1
- రెబ్బెన మండలం ఇందిరానగర్లోని శ్రీ కనకదుర్గాదేవి–శ్రీ మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 2, 3 తేదీలలో మహంకాళి జాతర నిర్వహించనున్నారు. తొలి రోజు పట్టువస్త్రాల సమర్పణ, రెండో రోజు బోనాలు, మహాభోగ నైవేద్యం, రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.1
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని దోమకొండ మండలం అంబారిపేట్ సర్పంచ్ కవిత అనిల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు వారి సేవలు కీలకమన్నారు.1
- వేసవికాలంలో భక్తులకు ప్రత్యేక సదుపాయాలు –శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈవో చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి కాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులకు సమాచారాన్ని సులభంగా అందించేందుకు వాట్సాప్ సేవలను ప్రారంభించారు. భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన స్కానర్ను స్కాన్ చేయడం ద్వారా లేదా 8736936969 నంబర్కు “Hi” అని మెసేజ్ పంపితే ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వేసవి వేడి నుంచి భక్తులకు ఉపశమనం కలిగేలా ఆలయ ప్రాంగణంలో రెండు భారీ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఫ్యాన్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించారు. “రాజన్న జలప్రసాదం” పేరుతో రెండు త్రాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు నిలబడే క్యూ లైన్ల వద్ద త్రాగునీటి నల్లాలను ఏర్పాటు చేశారు. కూల్ బబ్బుల్స్ ద్వారా సేవకులను నియమించి ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు విశ్రాంతి తీసుకునేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భీమేశ్వర సదన్లో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి భక్తులకు మరియు ఆలయ కార్యాలయాలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నారు.ఈ ఏర్పాట్లతో భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆలయ అధికారులు తెలిపారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ వద్ద రాజీవ్ రాదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో నవ వరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆర్టీసీలో పనిచేసే కోటిరెడ్డి కరీంనగర్ నుంచి బస్సులో వచ్చి మహాత్మానగర్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న రానాప్రతాప్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి అర్జున్, కోటిరెడ్డి తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాణా ప్రతాప్ కు వారం రోజుల క్రితమే వివాహం అయింది. కాళ్ళ పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో పెళ్ళింట విషాదం అలుముకుంది.1
- ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఆదివారం సుడిగాలి విధ్వంసం సృష్టించింది, ఈ సుడిగాలి భీభత్సానికి 70 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఒకరు మృత్యువాత పడగా పలువురు గాయాలపాలయ్యారు. అత్యంత ప్రభావితమైన ప్రాంతం కరంజియాలోని కియా గ్రామంలో బలమైన గాలులు నివాసితులలో భయాందోళనలను సృష్టించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.1