మదనపల్లె లో అనాధగా మారిన ఉన్మాది శవం మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియల. అనాధగా మారిన ఉన్మాది శవం మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియల. లు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారి రిషిక ప్రియపై జరిగిన అత్యాచారం–హత్య ఘటనలో నిందితుడు కులవర్ధన్ చెరువులో మృతదేహంగా లభ్యం... పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన అతను ముదివేడు చెరువులో బుధవారం ఉదయం శవంగా కనిపించాడు... సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు... బంధువులు వస్తారనే ఆశతో మృతదేహాన్ని బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు మార్చురీలో ఉంచారు.... కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో శవం అనాధగా మిగిలింది.... మృతుడి కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం.... నిందితుడి తల్లి అంజలి పై ఏ2గా కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి... గుర్తుతెలియని శవంగా నమోదు చేసి పట్టణంలో పోస్టర్లు కూడా అంటించిన పోలీసులు స్పందన కోసం వేచిచూశారు.... చివరికి ఎవరూ రాకపోవడంతో గురువారం సాయంత్రం మదనపల్లె మున్సిపాలిటీ సిబ్బంది శవాన్ని చెత్త తరలింపు ఆటోలో తీసుకెళ్లి ఖననం చేశారు....
మదనపల్లె లో అనాధగా మారిన ఉన్మాది శవం మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియల. అనాధగా మారిన ఉన్మాది శవం మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియల. లు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారి రిషిక ప్రియపై జరిగిన అత్యాచారం–హత్య ఘటనలో నిందితుడు కులవర్ధన్ చెరువులో మృతదేహంగా లభ్యం... పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన అతను ముదివేడు చెరువులో బుధవారం ఉదయం శవంగా కనిపించాడు... సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు... బంధువులు వస్తారనే ఆశతో మృతదేహాన్ని బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు మార్చురీలో ఉంచారు.... కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో శవం అనాధగా మిగిలింది.... మృతుడి కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం.... నిందితుడి తల్లి అంజలి పై ఏ2గా కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి... గుర్తుతెలియని శవంగా నమోదు చేసి పట్టణంలో పోస్టర్లు కూడా అంటించిన పోలీసులు స్పందన కోసం వేచిచూశారు.... చివరికి ఎవరూ రాకపోవడంతో గురువారం సాయంత్రం మదనపల్లె మున్సిపాలిటీ సిబ్బంది శవాన్ని చెత్త తరలింపు ఆటోలో తీసుకెళ్లి ఖననం చేశారు....
- పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- మదనపల్లెలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించేందుకు తాను వచ్చినప్పుడు కలవనీయకుండా దాచేశారని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.రాజంపేట ఎమ్మెల్యే అయిన ఆయన మదనపల్లెలో మాట్లాడుతూ –గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ‘గంజాయి ప్రభుత్వం’గా విమర్శించారని, ప్రస్తుతం మదనపల్లెలో గంజాయి ప్రభావం మరింత పెరిగిందని అన్నారు.బాధిత కుటుంబానికి మద్దతుగా నిరసనలు తెలిపిన వారిలో కేవలం YSR పార్టీ నాయకులపైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన విమర్శించారు.1
- చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. పెనుగొండ తరువాత చంద్రగిరి కోటను విజయనగర సామ్రాజ్యం వారు ఇక్కడ నుండి పరిపాలించారు.శ్రీకృష్ణదేవరాయలు వారు జనవరి 17వ తేదీన1471 సంవత్సరంలో జన్మించారు.శ్రీకృష్ణదేవరాయలు వారికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి చాలా అనుబంధం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఏడు వారాల నగలు కూడా సమర్పించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం తరఫున చేయవలసిందిగా అసెంబ్లీలో స్పీకర్ ను కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే పులివర్తి నానికి తెలిపిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ సరస్వతి విద్యా మందిరం విద్యార్థులు ప్లాస్టిక్ నిర్మూలనపై చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను వీధుల్లో పడేయడం వల్ల పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్లను బాటిళ్లలో నింపి అందజేయడంతో చెత్త సేకరణ సులభమవుతుందని, పర్యావరణాన్ని కాపాడవచ్చని విద్యార్థులు వివరించారు. ఈ వినూత్న ఆలోచన పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.1
- Post by మీ శ్రేయోభిలాషి1
- పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్ భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.5
- అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడు సంవత్సరాల బాలికపై జరిగిన అఘాయిత్యంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం పుణ్యం తెలియని చిన్నారిపై జరిగిన ఈ దారుణ ఘటనకు గంజాయి, మద్యం మత్తే కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ ప్రభావంతో ఇటువంటి ఘోర సంఘటనలు పెరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి విక్రయాల వెనుక అధికార పార్టీల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై ప్రజలు పార్టీలు అతీతంగా నిరసనలకు దిగారని, కాంగ్రెస్, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీతో పాటు అధికార పార్టీకి చెందిన వారు కూడా పాల్గొన్నారని తెలిపారు. నిరసన తెలియజేయడం ప్రజల హక్కు అని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరైంది కాదని ఎంపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాలిక కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వం బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రెస్మీట్లో మదనపల్లె పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.1
- పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- తిరుపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం ఘనంగా. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం సందర్భంగా తిరుపతి మరాఠా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. శోభాయాత్ర రామచంద్ర పుష్కరిణి నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ సర్కిల్, నాలుగు కాళ్ల మండపం, రైల్వే స్టేషన్, నేతాజీ రోడ్డు, బేరి వీధి, ప్రకాశం రోడ్డు మీదుగా గాంధీ భవన్ వరకు కొనసాగుతుంది. 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్, పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి “హైందవ స్వరాజ్యం”కు పునాది వేశారు. గెరిల్లా యుద్ధ తంత్రాలకు రూపకర్తగా, మత సహనం మరియు సుశాసనానికి నిదర్శనంగా నిలిచారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం చేసుకున్నారు.ప్రతి సంవత్సరం ఆయన జయంతిని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.1