Shuru
Apke Nagar Ki App…
మదనపల్లెలో బాలిక కుటుంబాన్ని దాచిపెట్టారు : ఎమ్మెల్యే మదనపల్లెలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించేందుకు తాను వచ్చినప్పుడు కలవనీయకుండా దాచేశారని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.రాజంపేట ఎమ్మెల్యే అయిన ఆయన మదనపల్లెలో మాట్లాడుతూ –గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ‘గంజాయి ప్రభుత్వం’గా విమర్శించారని, ప్రస్తుతం మదనపల్లెలో గంజాయి ప్రభావం మరింత పెరిగిందని అన్నారు.బాధిత కుటుంబానికి మద్దతుగా నిరసనలు తెలిపిన వారిలో కేవలం YSR పార్టీ నాయకులపైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన విమర్శించారు.
Rayachoti
మదనపల్లెలో బాలిక కుటుంబాన్ని దాచిపెట్టారు : ఎమ్మెల్యే మదనపల్లెలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించేందుకు తాను వచ్చినప్పుడు కలవనీయకుండా దాచేశారని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.రాజంపేట ఎమ్మెల్యే అయిన ఆయన మదనపల్లెలో మాట్లాడుతూ –గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ‘గంజాయి ప్రభుత్వం’గా విమర్శించారని, ప్రస్తుతం మదనపల్లెలో గంజాయి ప్రభావం మరింత పెరిగిందని అన్నారు.బాధిత కుటుంబానికి మద్దతుగా నిరసనలు తెలిపిన వారిలో కేవలం YSR పార్టీ నాయకులపైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన విమర్శించారు.
More news from Annamayya and nearby areas
- రాయచోటి మదనపల్లె రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మా బిడ్డ మృతి విషాదంలో మాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు” అని వ్యాఖ్యానించారు.1
- రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జోన్ ఫోర్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారు, రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి ) గారు,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారు, షాప్ చైర్మన్ రవి నాయుడు గారు రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ జగన్మోహన్ రాజుగారు మొదలగును వారు పాల్గొన్నారు.1
- ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.1
- పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో, మాజీ సర్పంచ్ మురళి మాట్లాడుతూ, ఆస్తులు తమ పూర్వీకులవని, వాటిని అనుభవించే హక్కు తమకే ఉందని, వేరే ఎవరికీ సంబంధం లేదని అన్నారు. ఆస్తులను తాము కబ్జా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న తాము అభివృద్ధికి పాటుపడతామని, వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో కుట్టి, కుమార్, మురళి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ❤️1
- శ్రీ సత్యసాయి జిల్లా,ముదిగుబ్బ, ఫిబ్రవరి 19: ముదిగుబ్బ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పట్టణ సీఐ శివరాముడు ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న మండలంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని వారు విమర్శించారు. *🔹 టిడిపి ఆరోపణలు ఇవీ…* ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలను తరచూ పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. బైండోవర్ పేరుతో తరచూ ఇబ్బందులకు గురిచేస్తూ, కౌన్సిలింగ్ పేరుతో మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారని విమర్శించారు. పట్టా భూమి వివాదం వేడెక్కింది,తాజాగా తమ పట్టా భూమిలో ఇల్లు నిర్మాణం చేపట్టిన సుధాకర్, విశ్వనాథ్లపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ లేకుండానే కేసు నమోదు చేసి, వారిని నేరస్తుల్లా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అవమానించారని టిడిపి నేతలు తెలిపారు. ఈ విషయంపై ఆగ్రహంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. డీఎస్పీ జోక్యం – శాంతించిన నిరసన సమాచారం అందుకున్న డీఎస్పీ ఫోన్ ద్వారా టిడిపి నాయకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.గత సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంకేపల్లి పరసలో జరిగిన ఘటనలో ఎలాంటి నేర చరిత్ర లేని టిడిపి నాయకులపై కేసులు నమోదు చేసి ఇప్పటికీ వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే ముదిగుబ్బ గేట్ కొట్టాల వద్ద ఎలాంటి సంఘటన జరగకపోయినా వైసిపి ఫిర్యాదు మేరకు టిడిపి కార్యకర్తలను పిలిపించి దాడి చేశారని పేర్కొన్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీల వివాదం-దొరిగిల్లు గ్రామంలో జగన్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి రక్తాభిషేకం చేసిన ఘటనలో పోలీసులు మొదట స్పందించలేదని టిడిపి నేతలు తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేశారని ఆరోపించారు. రక్తంతో ఉన్న ఫ్లెక్సీ నెల రోజులపాటు తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంకేపల్లి వీరనారాయణ స్వామి పరసలో రాజకీయ ఫ్లెక్సీలు, డీజే సౌండ్ సిస్టమ్లు పెట్టకూడదని కమిటీ సభ్యులు, పోలీసులు ముందుగా నిర్ణయించినప్పటికీ, వైసిపి కార్యకర్తలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఘటనను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. *🔹 లాఠీచార్జ్ ఆరోపణ* అలాగే వైసిపి మాజీ ఎంపీ Gorantla Madhav వాహనం రాక సందర్భంగా అడ్డుగా ఉన్నారని ఆరోపిస్తూ టిడిపి కార్యకర్తలైన సూర్యనారాయణ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిపై లాఠీచార్జ్ చేసి గాయపరిచారని తెలిపారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీకి విజ్ఞప్తి ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ స్పందించి సీఐ శివరాముడిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.1
- Post by మీ శ్రేయోభిలాషి1
- మదనపల్లెలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించేందుకు తాను వచ్చినప్పుడు కలవనీయకుండా దాచేశారని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.రాజంపేట ఎమ్మెల్యే అయిన ఆయన మదనపల్లెలో మాట్లాడుతూ –గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ‘గంజాయి ప్రభుత్వం’గా విమర్శించారని, ప్రస్తుతం మదనపల్లెలో గంజాయి ప్రభావం మరింత పెరిగిందని అన్నారు.బాధిత కుటుంబానికి మద్దతుగా నిరసనలు తెలిపిన వారిలో కేవలం YSR పార్టీ నాయకులపైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన విమర్శించారు.1