Shuru
Apke Nagar Ki App…
వేసవి సెలవులు లో విద్యార్థులు తమ సమయ పాలనలో తల్లిదండ్రులు తో గడపాలని కోరుకుంటున్నాము.
డాక్టర్ బాబు 7036445113
వేసవి సెలవులు లో విద్యార్థులు తమ సమయ పాలనలో తల్లిదండ్రులు తో గడపాలని కోరుకుంటున్నాము.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్శించండి నన్నపనేని రాజకుమారి గుంటూరులోని జెకేసి కాలేజీ రోడ్డులో గల వికాస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన చిన్న పిల్లల ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఒకసారి సందర్శించాలని మాజీ మహిళ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గుంటూరు ప్రజలను కోరారు. చిన్న పిల్లలు వేసిన కళ ఖండాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, మంచి సందేశం అందించే కళాఖండాలు ఇక్కడ ఉన్నాయని, ప్రజలు సందర్శించి చిన్నపిల్లలకు ప్రోత్సాహం అందించాలని ఆమె తెలియజేశారు.1
- మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య (3 ఎకరాలు), సురేష్ (2 ఎకరాలు), ఐలయ్య (3 ఎకరాలు), జక్కుల కట్టమల్లు (3 ఎకరాలు), పుణ్యపుర్తి ఐలయ్య (4 ఎకరాలు)లకు చెందిన పంటలు మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా పొలాల్లో మంటలు వ్యాపించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు తెలియజేయగా, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటన పై విచారణ ప్రారంభించారు.1
- Post by V Ramarao4
- వినుకొండ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరియు అక్రమ మద్యం వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వెంకటరామిరెడ్డి . మాట్లాడుతూ కూటమి నేతల అక్రమ మైనింగ్పై మండిపడ్డారు. వెంకుపాలెం గ్రామం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకుని అధికారులకు అప్పగించినప్పటికీ, ఆ లారీలు మాయం కావడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు గారు తన సొంత భూమిలో మట్టి తవ్వినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన జీవీ ఆంజనేయులు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్పై మౌనం వహించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శిస్తూ, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి గారు* మాట్లాడుతూ అక్రమ మైనింగ్పై “కఠిన చర్యలు తీసుకుంటాం” అనే ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయాలు చీఫ్ విప్కు తెలియనట్లు నటించడం ఆశ్చర్యకరమన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వంటి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాయకుల పాఠాలను పట్టించుకోకపోవడం పాలనలో వైఫల్యానికి సంకేతమని విమర్శించారు. ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి M.N ప్రసాద్ గారు* మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ స్థాయిలో అక్రమ మైనింగ్పై మీడియా స్పందన అభినందనీయం అన్నారు. గతంలో బ్రహ్మానాయుడు గారు తన సొంత స్థలంలో మట్టి తవ్వితే దానిని అక్రమంగా ప్రచారం చేసిన వారు, ఇప్పుడు భారీగా జరుగుతున్న అక్రమాలపై స్పందించకపోవడం ప్రశ్నార్థకమన్నారు. వెంకుపాలెం, దాసరిపల్లి, దొండపాడు గ్రామాల్లో పెద్ద ఎత్తున మట్టి అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మైనింగ్ మరియు రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పట్టుబడ్డ లారీలు తిరిగి అదే కార్యకలాపాల్లో పాల్గొనడం అధికారుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. అక్రమ మద్యం వ్యవహారంపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మద్యం సరఫరా చేస్తూ, ప్రభుత్వ ధరకు కాకుండా ఎంపిక చేసిన బాటిళ్లపై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యం కొనుగోలు చేయకపోతే సంబంధిత వ్యక్తులను పోలీసులకు అప్పగించేలా బెదిరింపులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి నీచమైన రాజకీయాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గం మొత్తం మాఫియా వలలో చిక్కుకుపోయిందని, ఈ పరిస్థితికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణం కన్వీనర్ కొత్తమసు శివ గారు, వినుకొండ రూరల్ మండల కన్వీనర్ దండు చెన్నయ్య మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.4
- Post by Syambabu6
- హన్మకొండ జిల్లా: శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా కమలాపూర్ మండల కేంద్రంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుని కుటుంబాలను చల్లగా చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు రాంబాబుగౌడ్, డైరెక్టర్లు, సర్పంచ్ సతీశ్, కులస్థులు పాల్గొన్నారు.1
- అమరావతి: ఆయిల్ కోసం వాహనదారులు రాత్రి వేళల్లో బంకుల దగ్గర బారులు తీరారు. సత్తనపల్లి రోడ్ లోని ఓ బంకు వద్ద వాహనాలు, రద్దీ ఏర్పడింది. ఒక్క వాహనానికి 10 లీటర్ల వరకే ఆయిలు అందిస్తున్నారని వాహనదారులు తెలిపారు. కొంతమంది అవసరత కోసం క్యాన్లు తీసుకొని మరి ఆయిల్ కోసం పడి కాపులు కాశారు. ఆయిల్ ట్యాంకర్లు రావలసిన సమయానికి రాకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఏర్పడిందని బంకుదారులు తెలిపారు.1
- ఆకట్టుకున్న చిన్న పిల్లల పెయింటింగ్ గుంటూరులో వెల్లటూరి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ గుంటూరులోని జెకేసి కాలేజీ రోడ్డులో గల ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వేసిన పెయింటింగ్స్ చూపరులను లను కట్టిపడేసాయి. చిన్న పిల్లలలోని అద్భుత కళా నైపుణ్యం చూసి అతిధులు ఆశ్చర్య చకితులు అయ్యారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు.1
- హన్మకొండ జిల్లా: కమలాపూర్ మండల కేంద్రాలో తీగల బావి హనుమాన్ మాలాధారులు ఆదివారం ఉదయం నగర సంకీర్తన ర్యాలీ నిర్వహించారు. పనగట్ల నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు సుమారు 50 ద్విచక్ర వాహనాలపై సుమారు వంద మంది భక్తులు “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో ర్యాలీగా సాగారు. హిందూ, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మాలాధారులు తెలిపారు.1