Shuru
Apke Nagar Ki App…
పోలీసులకు తెలంగాణ కొత్త డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు.. ఇవాళ ఉదయం అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు డ్యూటీలో ఉండాలి.. ఇవాళ నేను ఛార్జ్ తీసుకుంటానని ఎవరూ హైదరాబాద్లో ఉండొద్దు.. ఎవరి జిల్లాల్లో వారు రిపోర్ట్ చేయాలి.. టైం వస్తే నేను కలుస్తా-డీజీపీ సీవీ ఆనంద్.
Ramprasad islavath
పోలీసులకు తెలంగాణ కొత్త డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు.. ఇవాళ ఉదయం అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు డ్యూటీలో ఉండాలి.. ఇవాళ నేను ఛార్జ్ తీసుకుంటానని ఎవరూ హైదరాబాద్లో ఉండొద్దు.. ఎవరి జిల్లాల్లో వారు రిపోర్ట్ చేయాలి.. టైం వస్తే నేను కలుస్తా-డీజీపీ సీవీ ఆనంద్.
More news from తెలంగాణ and nearby areas
- Post by V Ramarao3
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి నర్సంపేటకు వెళ్లే మార్గంలోని గువ్వలపాడు వద్ద తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బార్ధన్ (లోడ్) తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత వాహనం మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనలో ఎవరైనా గాయపడినారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…1
- ములుగు జిల్లా మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి జాతరను ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం విజయవంతంగా పూర్తి కావడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. భద్రాచలం–ఏటూరునాగారం రహదారి అభివృద్ధితో పాటు మంగపేట, వాజేడు, ఏటూరునాగారం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.1
- హైదరాబాద్, బషీర్బాగ్: ఈరోజు బషీర్బాగ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ దళ కమాండర్ పటేల్ వనజ మాట్లాడుతూ బీసీ వర్గాల రాజకీయ సాధికారత కోసం మల్లన్న నాయకత్వంలో కొత్త దిశలో పోరాటం ప్రారంభమైందని తెలిపారు. ఏండ్ల తరబడి పీడిత వర్గాల కోసం అడవుల్లో పోరాటం చేశామని, ఇప్పుడు అదే పోరాటాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని తీసుకురావడం మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సాధారణ రాజకీయ చేరిక కాదని, వ్యవస్థ మార్పు కోసం ప్రారంభమైన కొత్త ఉద్యమమని స్పష్టం చేశారు. వ్యాపార రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ప్రజల రాజ్య స్థాపనకై అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.1
- Post by Meenakshi1
- _వెలిమినేడు నోచ్ ల్యాబ్స్లో రియాక్టర్ పేలుడు కలకలం.!_ మూడో నెంబర్ రియాక్టర్ ఒక్కసారిగా పేలి కార్మికుడికి తీవ్ర గాయాలు... గాయపడిన కార్మికుడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు... నెల రోజుల వ్యవధిలోనే ఇదే పరిశ్రమలో రెండో ప్రమాదం.. వరుస ఘటనలతో కార్మికుల్లో భయం, ఆందోళన పెరుగుదల “పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో భయం” – కార్మికుల ఆవేదన... భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం నిర్లక్ష్యం ఆరోపణలు.. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, ఆగ్రహావేశాలు పెద్ద ప్రమాదానికి ముందు హెచ్చరికగా మారుతున్న ఘటనలు... వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..1
- Post by Ramprasad islavath1
- తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్1
- మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.1