Shuru
Apke Nagar Ki App…
"Gift maker" Gifts & photo Frames... current office Government School opposite Yellandu.. 8121681686 shining glitter lamination photo frame acrylic photo frames LED photo frames Digital Art photo frames mug print, pillow print, tshirts print, Readymade gifts, LED lighting boards, Steel letters birthday gifts, marriage gifts, Anniversary gifts...
Gift maker
"Gift maker" Gifts & photo Frames... current office Government School opposite Yellandu.. 8121681686 shining glitter lamination photo frame acrylic photo frames LED photo frames Digital Art photo frames mug print, pillow print, tshirts print, Readymade gifts, LED lighting boards, Steel letters birthday gifts, marriage gifts, Anniversary gifts...
More news from తెలంగాణ and nearby areas
- ఆయనో జిల్లా అధికారి... నిత్యం వత్తిడితౌ ఉండే ఉద్యోగ ధర్మం... అయినా అవకాశం దొరికినప్పుడు... ఆటవిడుపుగా తనలో ఉన్న కళకు... లయబద్ధంగా అడుగులు వేస్తూ...తన తోటి వారి మనస్సు దోచేస్తాడు... ఆయనే డ్యాన్స్ వీరుడు రోహిత్ రాజ్... సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు,...... హొలీ సందర్భంగా కొత్తగూడెం లోని హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హొలీ సంబరాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీసులతో కలిసి స్టెప్పులేశాడు. "బాయిలోనే బల్లి పలికే" అనే ఈ మధ్య యూట్యూబ్ లో ఫెమస్ అయిన పాటకు మాస్ స్టెప్పులేసి అదరగొడుతూ జిల్లా పోలీసులలో ఉత్సాహాన్ని నింపాడు. డ్యూటీ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండే ఎస్పీ రోహిత్ రాజ్ హొలీ సందర్భంగా చాలా ఉత్సాహంగా గడిపారు. తన కింద పనిచేసే పోలీసులు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహ పరిచారు. తరుచూ అనేక కేసుల్లో జిల్లా ప్రజల్లో హీరోగా నిలిచే ఎస్పీ తాజాగా పోలీసులతో కలిసి స్టెప్పులేసి వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాడు.4
- వరంగల్ గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో రాజకీయ ప్రభలతో పాటు రికార్డింగ్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన డాన్స్ గ్రూపులు జాతర ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేసి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్య జరిగిన ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువతుల రికార్డింగ్ డాన్సులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- హైదరాబాదు నుండి కలకత్తా కు వెళ్లవలసిన ట్రైన్ లో పింకీ సహా అనే మహిళకి తీవ్ర కడుపునొప్పి తో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంవల్ల 108 కాల్ చేయగానే తక్షణమే బయలుదేరి బాధితురాలని ఆంబులెన్స్ లోకి తీసుకొని ఫ్రీ హాస్పిటల్ కేర్ లో భాగంగా హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ ఆర్ సి పి డాక్టర్ మౌనిక మేడం సూచనల మేరకు MGM హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది టిఎంటి చైతన్య పైలట్ కుమారస్వామి కాజీపేట అంబులెన్స్8
- అధికార దుర్వినియోగనికి పాల్పడుతూ అధికార బలంతో, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచి ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడారు1
- *నల్లగొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.1
- జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం… డోలోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మపుష్కరినిలోకి తీసుకొని వెళ్లి హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి ఐదు ప్రదక్షిణలు అనంతరం డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో డోలోత్సవ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మ పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.1
- జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ప్రత్యేక అధికారులు సంబంధిత సిబ్బంది ముందుకు సాగాలని, పిల్లలకు అందించే సౌకర్యాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని *కలెక్టర్ స్నేహ శబరిష్* అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని (కేజీబీవీ) కస్తూరిబా గాంధీ విద్యాలయంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయంలోని స్టోర్ గది, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలు, డైట్ మెనూ, తరగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న పరీక్షల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఏలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వారికి అర్థమయ్యే విధంగా నూతన డిజిటల్ తరగతులు ప్రాక్టికల్స్ ద్వారా విద్యను అందించాలని, పక్కాగా డైట్ మెనూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం స్నాక్స్ అందించాలని, తద్వారా పిల్లలు మంచి వాతావరణంలో విద్యను కొనసాగించి ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఉపయోగపడతాయన్నారు. ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించి సిలబస్ పూర్తి చేయాలన్నారు. ప్రతి విద్యార్థిని, గమనిస్తూ ఉండాలని, విద్యలో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు. ప్రత్యేక అధికారులు ఇప్పటికే వారికి కేటాయించిన విద్యా సంస్థలలో తనిఖీలు నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వసతిగృహాలు, విద్యా సంస్థల నివేదికలు సమర్పించాలని సూచించారు. కేజీబీవీ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్, స్పెషల్ అధికారినీ సోమలక్ష్మిని పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వారికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని, లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.1
- పవిత్ర రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ముస్లింలు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ప్రజల మధ్య ఐక్యతా భావం, ఆత్మీయతను పెంపొందిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ పట్టణంలోని జామా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. ఉపవాస దీక్ష విరమించిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతసామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. దేశంలో ముస్లింలు పేదరికాన్ని అనుభవిస్తున్నారని, ప్రభుత్వాలు స్పందించి వారికి విద్య, వైద్య సదుపాయాలు కల్పించి, పేదరిక నిర్మూలన చర్యలు చేపట్టాలన్నారు. ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, ఇరాన్ దేశాధ్యక్షుడు ఖమైనీని చంపేయడం జరిగిందని, ప్రపంచంలో ఒక దేశం పై మరో దేశాలు దాడులు చేసుకుంటా పోతే ప్రపంచ యుద్ధం గా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని,జరిగిన నష్టాన్ని ఎక్కువగా జరగకుండా చూడాలని, పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడులు జరగటం చాలా దురదృష్టకమన్నారు. ప్రపంచమంతా శాంతి వైపు ఉండాలని, అల్లా ఆ శాంతిని ప్రసాదించాలని కోరుతున్నట్లు తెలిపారు..4
- వరంగల్ గీసుకొండ మండలంలోని కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి జాతర సందర్భంగా బీఆర్ఎస్ ప్రభ బండి కి అకస్మాత్తుగా నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో జాతర ప్రాంగణంలో కలకలం రేగింది. స్థానికుల సమాచారం ప్రకారం బాంబు పేల్చడంతోనే మంటలు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అగ్నిప్రమాదంతో ప్రభ బండి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.1