logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సింహ వాహనోత్సవం పై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే రెండవ రోజు శనివారం స్వామివారి సింహ వాహనోత్సవం పై కొలువు తీరి భక్తులకు అభయం ఇచ్చాడు. అడుగడుగునా భక్తులు స్వామి వారికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.

14 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

సింహ వాహనోత్సవం పై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే రెండవ రోజు శనివారం స్వామివారి సింహ వాహనోత్సవం పై కొలువు తీరి భక్తులకు అభయం ఇచ్చాడు. అడుగడుగునా భక్తులు స్వామి వారికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే రెండవ రోజు శనివారం స్వామివారి సింహ వాహనోత్సవం పై కొలువు తీరి భక్తులకు అభయం ఇచ్చాడు. అడుగడుగునా భక్తులు స్వామి వారికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.
    1
    రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే రెండవ రోజు శనివారం స్వామివారి సింహ వాహనోత్సవం పై కొలువు తీరి భక్తులకు అభయం ఇచ్చాడు. అడుగడుగునా భక్తులు స్వామి వారికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో వెలసిన యోగవేమన ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంకాలం కుంభము పోయుట శక్తి పూజ నిర్వహించబడును. ఆలయ ఆవరణంలో పలు రకాల నూతన అంగులతో అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణములో అతిపెద్ద వాయిద్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ నంద వేమారెడ్డి చేయించారు.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో వెలసిన యోగవేమన ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంకాలం కుంభము పోయుట శక్తి పూజ నిర్వహించబడును. ఆలయ ఆవరణంలో పలు రకాల నూతన అంగులతో అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణములో అతిపెద్ద వాయిద్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ నంద వేమారెడ్డి  చేయించారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    2 hrs ago
  • “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా అంబులెన్స్ వాహనాన్ని (సంచార వాహనం) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభించారు. ఆర్ఇసి లిమిటెడ్ సిఎస్ఆర్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ప్రారంభమైంది. రూ. 1.20 కోట్ల వ్యయంతో 3 సంవత్సరాల పాటు అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్లు గ్రామాలకే వెళ్లి ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అంటువ్యాధులతో బాధపడుతున్నవారు ప్రధాన లబ్ధిదారులు. ప్రతి రోజు సుమారు 100 మందికి, నెలకు వేలాది మందికి వైద్య సేవలు అందించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం కావడంతో పాటు మొత్తం 3 సంవత్సరాల్లో సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ దస్తగిరి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, మూర్తితో పాటు సభ్యులు వసుంధర, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా అంబులెన్స్ వాహనాన్ని (సంచార వాహనం) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభించారు. ఆర్ఇసి లిమిటెడ్ సిఎస్ఆర్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ప్రారంభమైంది. రూ. 1.20 కోట్ల వ్యయంతో 3 సంవత్సరాల పాటు అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్లు గ్రామాలకే వెళ్లి ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అంటువ్యాధులతో బాధపడుతున్నవారు ప్రధాన లబ్ధిదారులు. ప్రతి రోజు సుమారు 100 మందికి, నెలకు వేలాది మందికి వైద్య సేవలు అందించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం కావడంతో పాటు మొత్తం 3 సంవత్సరాల్లో సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ దస్తగిరి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, మూర్తితో పాటు సభ్యులు వసుంధర, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Mallikarjuna Akula
    Mallikarjuna Akula
    Organic farm కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి అన్నారు. ____¥¥¥¥¥_____¥¥¥¥¥____ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం గద్వాల కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ఈ ఏడాదికి సంబంధించిన మొదటి జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సామ్ కోషి, జస్టిస్ శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ సామ్ కోషి మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్ ద్వారా జోగులాంబ గద్వాల జిల్లాలో 5345 కేసులు పరిష్కరించడం గర్వకారణమన్నారు. చిన్న చిన్న తగాదాలతో కోర్టుల వరకు వచ్చిన కక్షిదారులు తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ గొప్ప వేదికగా పేర్కొన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సావధానంగా పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు ముందుకు వస్తే కోర్టుల్లో కేసులు వేయాల్సిన అవసరం రాదన్నారు. ఒకసారి కోర్టులో కేసు వేశారంటే పరిష్కారం కావడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు అవుతుందని, లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం రాజమార్గం అని పేర్కొన్నారు. న్యాయవాదులు తమ కక్షిదారుల కేసులను త్వరగా పరిష్కరిస్తేనే ఎక్కువమంది ఆ లాయర్ల దగ్గరకు వస్తారని, ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం కాకుంటే ప్రయోజనం లేదన్నారు. మనం ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నామని, ఏ కక్షిదారుడు కూడా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలని కోరుకునే పరిస్థితి ప్రస్తుతం ఉండకూడదన్నారు. కక్షిదారులు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే తమ కేసుల పరిష్కారానికి సంబంధిత న్యాయవాదులు సరైన దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా పెద్ద ఎత్తున కేసులను పరిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కక్షిదారులు చిన్న చిన్న తగాదాలతో కోర్టుల వరకు రావడంతో ఆయా న్యాయస్థానాల్లో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్లో ఉంటున్నాయని, ఇరుపక్షాలు రాజీమార్గంలో తమ కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో తమ తమ ప్రాంతాల్లోని పెద్దమనుషుల సమక్షంలోనే చిన్న చిన్న తగాదాలను పరిష్కరించుకునేవారని, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కానీ సమస్యలను కోర్టులో వేయడం జరిగేదన్నారు. ప్రస్తుతం చాలా మంది చిన్నపాటి తగాదాలతోనే న్యాయస్థానాలను ఆశ్రయించడం వలన ఆయా కేసులను పరిష్కరించుకునేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందన్నారు. న్యాయవాదులు, లా విద్యార్థులు కూడా లీగల్ హెయిర్ సెంటర్స్, లోక్ అదాలత్ ల ద్వారా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకునేందుకు సహకరించాలన్నారు. ఒకసారి ఇరుపక్షాలు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తే తిరిగి అప్పీల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల కక్షిదారులకు రాజీమార్గంలో సత్వరమే న్యాయం జరుగుతున్నందున న్యాయవాదులు పెద్ద ఎత్తున లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పంచాక్షరి మాట్లాడుతూ తెలిసో తెలియకో ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తుంటారని, ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి చిన్న పాటి తగాదాలకే ప్రజలు కోర్టుల దాకా రావలసిన అవసరం లేదన్నారు. కేసులు వేయడం వలన ఒక కోర్టులో తమకు న్యాయం జరగలేదనీ ఒక కక్షిదారుడు పై కోర్టుల దాకా వెళ్తుండడంతో సమయం, డబ్బులు వృధా అవుతాయన్నారు. ఇరుపక్షాలు రాజీమార్గంలో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ లు విజయవంతం కావడానికి అడ్వకేట్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు శాఖ వారి సహకారం కీలకమైనదిగా ఆయన పేర్కొన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి రవికుమార్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టుల పరిధిలో మొత్తం 7846 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా పెద్ద ఎత్తున కేసులను రాజీమార్గంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం పలు కేసులకు సంబంధించి రాజీ అయిన పలువురు కక్షిదారులకు హైకోర్టు న్యాయమూర్తులు అవార్డు కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు యంత్రాంగం, బార్ అసోసియేషన్, పలువురు న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తులను, ఇతర అతిథులను శాలువా, పుష్ప గుచ్చాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులను ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ పోలీస్ బెటాలియన్ వద్ద ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, బెటాలియన్ కమాండెంట్ జయరాజు, పలువురు జిల్లా న్యాయమూర్తులు, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లక్ష్మి, పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పూజిత, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ కుమార్, గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహులు, వివిధ జిల్లా న్యాయస్థానాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వినోదాచారి, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, భవాని, రేచల్, ఇతర న్యాయవాదులు, పోలీస్ శాఖ అధికారులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.
    4
    కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి అన్నారు.
____¥¥¥¥¥_____¥¥¥¥¥____
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం గద్వాల కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ఈ ఏడాదికి సంబంధించిన మొదటి జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సామ్ కోషి, జస్టిస్ శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ సామ్ కోషి మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్ ద్వారా జోగులాంబ గద్వాల జిల్లాలో 5345 కేసులు పరిష్కరించడం గర్వకారణమన్నారు. చిన్న చిన్న తగాదాలతో కోర్టుల వరకు వచ్చిన కక్షిదారులు తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ గొప్ప వేదికగా పేర్కొన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సావధానంగా పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు ముందుకు వస్తే కోర్టుల్లో కేసులు వేయాల్సిన అవసరం రాదన్నారు. ఒకసారి కోర్టులో కేసు వేశారంటే పరిష్కారం కావడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు అవుతుందని, లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం రాజమార్గం అని పేర్కొన్నారు. న్యాయవాదులు తమ కక్షిదారుల కేసులను త్వరగా పరిష్కరిస్తేనే ఎక్కువమంది ఆ లాయర్ల దగ్గరకు వస్తారని, ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం కాకుంటే ప్రయోజనం లేదన్నారు. మనం ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నామని, ఏ కక్షిదారుడు కూడా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలని కోరుకునే పరిస్థితి ప్రస్తుతం ఉండకూడదన్నారు. కక్షిదారులు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే తమ కేసుల పరిష్కారానికి సంబంధిత న్యాయవాదులు సరైన దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా పెద్ద ఎత్తున కేసులను పరిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
జస్టిస్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కక్షిదారులు చిన్న చిన్న తగాదాలతో కోర్టుల వరకు రావడంతో ఆయా న్యాయస్థానాల్లో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్లో ఉంటున్నాయని, ఇరుపక్షాలు రాజీమార్గంలో తమ కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో తమ తమ ప్రాంతాల్లోని పెద్దమనుషుల సమక్షంలోనే చిన్న చిన్న తగాదాలను పరిష్కరించుకునేవారని, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కానీ సమస్యలను కోర్టులో వేయడం జరిగేదన్నారు. ప్రస్తుతం చాలా మంది చిన్నపాటి తగాదాలతోనే న్యాయస్థానాలను ఆశ్రయించడం వలన ఆయా కేసులను పరిష్కరించుకునేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందన్నారు. న్యాయవాదులు, లా విద్యార్థులు కూడా లీగల్ హెయిర్ సెంటర్స్, లోక్ అదాలత్ ల ద్వారా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకునేందుకు సహకరించాలన్నారు. ఒకసారి ఇరుపక్షాలు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తే తిరిగి అప్పీల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల కక్షిదారులకు రాజీమార్గంలో సత్వరమే న్యాయం జరుగుతున్నందున న్యాయవాదులు పెద్ద ఎత్తున లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పంచాక్షరి మాట్లాడుతూ తెలిసో తెలియకో ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తుంటారని, ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి చిన్న పాటి తగాదాలకే ప్రజలు కోర్టుల దాకా రావలసిన అవసరం లేదన్నారు. కేసులు వేయడం వలన ఒక కోర్టులో తమకు న్యాయం జరగలేదనీ ఒక కక్షిదారుడు పై కోర్టుల దాకా వెళ్తుండడంతో సమయం, డబ్బులు వృధా అవుతాయన్నారు. ఇరుపక్షాలు రాజీమార్గంలో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ లు విజయవంతం కావడానికి అడ్వకేట్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు శాఖ వారి సహకారం కీలకమైనదిగా ఆయన పేర్కొన్నారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి రవికుమార్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టుల పరిధిలో మొత్తం 7846 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా పెద్ద ఎత్తున కేసులను రాజీమార్గంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం పలు కేసులకు సంబంధించి రాజీ అయిన పలువురు కక్షిదారులకు హైకోర్టు న్యాయమూర్తులు అవార్డు కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు యంత్రాంగం, బార్ అసోసియేషన్, పలువురు న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తులను, ఇతర అతిథులను శాలువా, పుష్ప గుచ్చాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులను ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ పోలీస్ బెటాలియన్ వద్ద ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, బెటాలియన్ కమాండెంట్ జయరాజు, పలువురు జిల్లా న్యాయమూర్తులు, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లక్ష్మి, పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పూజిత, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ కుమార్, గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహులు, వివిధ జిల్లా న్యాయస్థానాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వినోదాచారి, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, భవాని, రేచల్, ఇతర న్యాయవాదులు, పోలీస్ శాఖ అధికారులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    12 hrs ago
  • కడప వైయస్సార్ కడప జిల్లా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు... ఈరోజు వైయస్సార్ కడప జిల్లా, కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొనడం జరిగింది. కారుణ్య నియామకాల గురించి మరియు రహదారుల సమీక్ష లో భాగంగా... రాజకీయ కారణాల వలన కమలాపురం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణంలో అధికారుల వివక్ష పై కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్ళిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు..
    1
    కడప
వైయస్సార్ కడప జిల్లా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు...
ఈరోజు వైయస్సార్ కడప జిల్లా, కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొనడం జరిగింది.
కారుణ్య నియామకాల గురించి మరియు రహదారుల సమీక్ష లో భాగంగా... రాజకీయ కారణాల వలన కమలాపురం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణంలో అధికారుల వివక్ష పై కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్ళిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు..
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • పుంగునూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం ఫలితాల కోసం ఉత్కంఠ అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరు కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న న్యాయవాదులు
    2
    పుంగునూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం 
ఫలితాల కోసం ఉత్కంఠ 
అన్నమయ్య జిల్లా
పుంగనూరు
పుంగనూరు కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న న్యాయవాదులు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    17 hrs ago
  • ఆత్మకూరు మార్చి 28,నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్షిపాల్ కౌన్సిల్ సమావేశం కమిషనర్ ఓబులేష్ ఆధ్వర్యములో వేలం పాట చేపల, సంత మార్కెట్, గేటు వసూల్,చికెన్ చిన్న కామేలా, పెద్ద కామేలా ల నుండి గతం కంటే అదనంగా పది హేను లక్షలు రూపాయలు ఆదాయం వచ్చింది అని మున్సిపల్ కమిషనర్ ఓబులేశు తెలియజేశారు, ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతు బకాయి పన్నుల వడ్డీ లో 50 శాతం మినహాయింపును, గృహోప యాజమానూలు సద్వినియోగం మర్చి 31వరకే వర్తిస్తుంది అని తెలియజేసినారు,మున్షిపాలిటీ కి వచ్చిన ఆదాయమును మున్షిపాలిటీ అభివృద్ధి కి ఉపయోగిస్తాం అని తెలియజేసినారు.
    1
    ఆత్మకూరు మార్చి 28,నంద్యాల జిల్లా                     ఆత్మకూరు మున్షిపాల్ కౌన్సిల్ సమావేశం కమిషనర్ ఓబులేష్ ఆధ్వర్యములో వేలం పాట చేపల, సంత మార్కెట్, గేటు వసూల్,చికెన్  చిన్న కామేలా, పెద్ద కామేలా ల నుండి గతం కంటే అదనంగా పది హేను లక్షలు రూపాయలు ఆదాయం వచ్చింది అని మున్సిపల్ కమిషనర్ ఓబులేశు తెలియజేశారు, ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతు బకాయి పన్నుల వడ్డీ లో   50 శాతం మినహాయింపును, గృహోప యాజమానూలు సద్వినియోగం మర్చి 31వరకే వర్తిస్తుంది అని తెలియజేసినారు,మున్షిపాలిటీ కి వచ్చిన ఆదాయమును మున్షిపాలిటీ అభివృద్ధి కి ఉపయోగిస్తాం అని తెలియజేసినారు.
    user_Sreenivasulu KM
    Sreenivasulu KM
    Local News Reporter Atmakur, Nandyal•
    14 hrs ago
  • ఏపీ పునర్విభజన చట్టం సవరణలపై జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యాన్ని ఆయన వివరించారు.విభజన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. అమరావతి అత్యంత పవిత్రమైన నేల అని ఆయన కొనియాడారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.
    1
    ఏపీ పునర్విభజన చట్టం సవరణలపై జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యాన్ని ఆయన వివరించారు.విభజన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. అమరావతి అత్యంత పవిత్రమైన నేల అని ఆయన కొనియాడారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.