Shuru
Apke Nagar Ki App…
నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిషేధిత ఆస్తుల POB/ 22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగా ఎలాంటి భూములను తమ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగిస్తామన్నారు.
ARUNKUMAR
నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిషేధిత ఆస్తుల POB/ 22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగా ఎలాంటి భూములను తమ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగిస్తామన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- *ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్ క్రేట్* తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.1
- సత్తుపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ దివాకర్ టీఎస్ విస్తృత పర్యటన సత్తుపల్లి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంగారం గ్రామంలో పంట పొలాల్లో గట్ల వెంట నడుచుకుంటూ వెళ్లిన కలెక్టర్.. రైతుల సమక్షంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బేతుపల్లి, నారాయణపురం గ్రామాల్లో కొనసాగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ దివాకర్ టీఎస్.. భూ రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల సందేహాలను అడిగి తెలుసుకుని, వాటిని నివృత్తి చేశారు. భూ రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు1
- కమలాపూర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రత్యేక శిబిరం హనుమకొండ జిల్లా కమలాపూర్: గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం 2026–27లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కమలాపూర్లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, పంట వేసిన నాటి నుంచి దిగుబడి వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థి ఓంకార్ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై రైతులతో కలిసి తెలుసుకుంటామని తెలిపారు. పంట వేసినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు అవసరమైన మెళకువలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం నాలుగు నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.1
- NSPT: పాకాల సమీపంలో అరుదైన విషపూరిత పాము కలకలం.............. వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఆగస్టు 12: జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము స్థానికుల కంటపడింది. పామును గుర్తించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాకాల అటవీ శాఖ సిబ్బంది ఎఫ్ఎస్ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి, అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం లేకుండా వదిలిపెట్టారు.2
- నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐* *ఎర్ర సత్యం అన్న పేదోళ్ల కంచంలో బువ్వ..!* ఆకలి లేని సమాజం కోసం, శ్రమజీవుల ఆత్మగౌరవం కోసం.. ప్రతి పేదవాడి కంచంలో మెతుకై నిలిచిన ప్రజా నాయకుడు.! పేదవాడి కడుపు నిండినప్పుడే అసలైన రాజ్యం వస్తుందని నమ్మి.. కూడు,గూడు,భూమి కోసం రణభేరి మోగించిన సాహస వీరుడు మన ఎర్ర సత్యం అన్నా.... *నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*1
- బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.1
- జాబ్ మేళా’హాజరు కండి: మౌలానా ముస్తాక్ అహ్మద్ Shot News:(గుంటూరు):నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ (BHF), షార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న (గురువారం) పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు.1
- అణచబడ్డ మన జాతులు మర్లబడాలే,తిరగబడాలే అవసరమైతే కత్తులు చేతబట్టాలే ఈ దేశం మనది,ఈ భూమి మనది... అణచబడ్డ మన జాతులు మర్లబడాలే,తిరగబడాలే అవసరమైతే కత్తులు చేతబట్టాలే1