Shuru
Apke Nagar Ki App…
తలుపుల మండలపరిధిలో టిడిపి గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు తలుపుల టిడిపి మండల కన్వీనర్ మేడ శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు పెద్దన్నవారిపల్లి, ఉడుములకుర్తి పంచాయతీలలో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కందికుంట సహకారంతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. రామస్థాయి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Srivartha news
తలుపుల మండలపరిధిలో టిడిపి గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు తలుపుల టిడిపి మండల కన్వీనర్ మేడ శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు పెద్దన్నవారిపల్లి, ఉడుములకుర్తి పంచాయతీలలో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కందికుంట సహకారంతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. రామస్థాయి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from Annamayya and nearby areas
- శాస్త్రోక్తంగా విజయ వినాయక స్వామి నవగ్రహ దేవతల ప్రాణ ప్రతిష్ట విజయ వినాయక స్వామి నవగ్రహ దేవతలు నాగదేవతలు విమాన గోపుర కలశ ప్రతిష్ట కుంబాభిషేక మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు విజయవాణి విద్యాసంస్థల ఆధ్వర్యంలో విజయ వాణి నగర్ నందు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది మూడు రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు తొలి రోజున గోపూజ ఆలయ ప్రవేశము గణపతి పూజ తో ప్రారంభమై రెండవ రోజున కలశాచ్చన అంగహోమము జలాధివాసము వంటి కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు మూడవ రోజున ప్రాణ ప్రతిష్ట ప్రధాన హోమాలు నాడీ సంధానము కలామ్యాప హోమము అష్టపల్లి ప్రధాన పూర్ణాహుతి కుంబాభిషేకము పంచామృతాభిషేకము రుద్రాభిషేకము విశేష అలంకరణ మహా మంగళహారతి అష్టావధాన సేవ తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు హోమాది కార్యక్రమాలలో విజయవాణి విద్యాసంస్థల అధినేతలు నాయుని చంద్రకళ నాయుని చంద్రశేఖర్ మూర్తి నాయని విజయనిర్మల నాయుని సుధాకరమూర్తి నాయుని జయమ్మ నాయుని పద్మ కుమారి నాయుని మహేష్ బాబు నాయుని కరుణ నాయన వారి కుటుంబ సభ్యులు పాల్గొనగా విజయవాణి సంస్థల సిబ్బంది చౌడేపల్లి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు విశేష పూజలు ముక్కులు చెల్లించుకున్నారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే హరికథ కచేరి వంటి కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు భక్తిశ్రద్ధలతో విజయ వినాయక స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు4
- *మొదలైన పిడుగురాళ్ల పట్టణ స్వయంభూ శ్రీ గంగమ్మ తల్లి జాతర....వందల సంఖ్య లో పాల్గొన్న మహిళలు...పంచామృతఅభిషేక బిందెలు తో తిరుణాల్ల వైభవం* ప్రతి నోటి వెబంటి...భక్తి పారవశ్యం తో... జై గంగమ్మ తల్లి అనే నినాదం తో కిక్కిరిసిన మెయిన్ రోడ్డు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆదివారం శ్రీ గంగమ్మ తల్లి తిరుణాల అట్టహాసంగా జరిగింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి వెయ్యి మందికి పైగా మహిళా భక్తులు కలశ బిందెలతో ఊరేగింపుగా గంగమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు. హరతులు, మంగళ వాద్యాల నడుమ భక్తి నినాదాలతో సాగిన ఈ ఊరేగింపులో.., భక్తులు గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.1
- నంద్యాల జిల్లా నంద్యాల -గిద్దలూరు రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డులో మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి. మలుపుల వద్ద అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారని ప్రయాణికులు, ప్రజలు వాపోతున్నారు. సూచిక బోర్డులు లేకపోవడంతో, ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.6
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారు సూర్యప్రభ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు. ఆలయ ఈవో నరసింహారెడ్డి, పురోహితులు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయం నుండి వినాయక కూడలి మీదుగా లక్ష్మీ బజార్ వరకు ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు.1
- మహానంది క్షేత్రంలో దర్శనానికి వెళ్లాలన్న బయటకు రావాలన్నా పద్మవ్యూహం లాగా ఎన్నో అడ్డంకులను తొలగించుకొని రావలసిన దుస్థితి ఏర్పడిందని విశ్వహిందూ పరిషత్ కిషోర్ పేర్కొన్నారు. ఆదాయం కోసమే తప్ప భక్తుల వసతుల కోసం ఆలోచన చేయని దేవాదాయ శాఖ అని ఆరోపించారు. ఇలాంటి దుస్థితి భక్తులకు రాకూడదు అంటే దేవాలయాలు ప్రభుత్వం చరనుంచి తక్షణమే విడుదల కావాలి... అందుకోసం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న దేవాలయాల స్వయంప్రతిపతి ఉద్యమంలో అందరం పాల్గొందాం... మన దేవాలయాలని మనమే నిర్వహించుకుందాం...1
- Post by Bondhu Suresh1
- సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ లో ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- పొట్టి శ్రీరాములు జిల్లా రూరల్ ప్రాంతం అయినటువంటి కాకుపల్లి నందు నేటి ఉదయం అంగరంగ వైభవంగా ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆటోమొబైల్ రంగంలోనూ కన్స్ట్రక్షన్స్ రంగంలోనూ ఎంతో అనుభవం కలిగి నేడు కాకుపల్లి నందు ఎంజీబీ ఇన్ఫినిటీ అల్ట్రా లక్సరీ విల్లాస్ నందు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన క్వాలిటీతో విల్లాసను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ ఓనర్స్ వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు నాయకులు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. కావున నెల్లూరు ప్రజలు విలాస్ కొనాల్సిన వారు తమ ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ని ఒకసారి సందర్శించవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా తెలియజేశారు1
- బిజినెపల్లి: అల్లిపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. రైతు డొక్కా శ్రీనివాసులు రెండెకరాల 10 గుంటల పొలంలో వేసిన మక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి పడిన నిప్పురవ్వల వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి పంటంతా కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కళ్లెదుటే కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.1