Shuru
Apke Nagar Ki App…
దంచి కొడుతున్న మండుటెండలు, మళ్లీ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మళ్లీ 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మండలంలో రెండు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అదే సమయంలో వేడి గాలులు సైతం వీయడంతో ఉక్క పోత వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధాన రోడ్డుతో పాటు చాలా గ్రామాలకు వెళ్లే రోడ్లు జన సంచారం లేక బోసిపోతున్నాయి.
Gourinatha p.g
దంచి కొడుతున్న మండుటెండలు, మళ్లీ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మళ్లీ 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మండలంలో రెండు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అదే సమయంలో వేడి గాలులు సైతం వీయడంతో ఉక్క పోత వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధాన రోడ్డుతో పాటు చాలా గ్రామాలకు వెళ్లే రోడ్లు జన సంచారం లేక బోసిపోతున్నాయి.
More news from Adilabad and nearby areas
- ఇచ్చొడ మండలంలోని ఆడిగామ (బి) గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో శబరిమాత ఆలయం వద్ద నూతనంగా బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సౌకర్యార్తమే గ్రామంలో చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బిజేపి నేత బండి సంజయ్ అంజన్న ఆశీర్వాదయాత్ర చేపట్టారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు సాగే పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు పార్లమెంటు నియోజకవర్గంలోని బిజెపికి చెందిన ప్రజాప్రతినిధులు 612 మంది సర్పంచ్ లు వార్డు సభ్యులు కౌన్సిలర్స్ కార్పోరేటర్ లు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన బండి సంజయ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల వైఖరి పై మండిపడ్డారు. అంజన్న ఆశీర్వాద యాత్రను విమర్శించే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. మూర్ఖులు కొందరు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా హిందు సమాజాన్ని అగౌరవపర్చేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ రాక్షసానందం పొందుతుందని విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు నైతికత ఉంటే, నిజమైన హిందువులు అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే పై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రజలకు కేవలం బిజేపి పై మాత్రమే నమ్మకం ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, రామరాజ్యం, మోడీ సర్కార్ ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హిందూసమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఏ కార్యక్రమం తీసుకున్న సక్సెస్ చేసేందుకు ముందుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.2
- Post by Solanke Ravi4
- కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.1
- ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.1
- ఆత్మవిశ్వాసంతో టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. టెన్త్ పరీక్షల నేపథ్యంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదో తరగతి పరీక్షలు మైలురాయి వంటివి అన్నారు. భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా వెళ్లేందుకు టెన్త్ పరీక్షలు నిచ్చెనగా ఉపయోగపడతాయన్నారు. పిల్లల భవిష్యత్తును బాగుండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంటుందన్నారు. పరీక్షలను కష్టంగా కాకుండా ఇష్టపడి బాగా రాస్తే మంచి ర్యాంకు సాధించడం ఖాయమన్నారు. శనివారం నుండి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.1
- నేరడిగొండ మండలం వడ్డుర్ గ్రామంలో మైనారిటీ సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వీరితో పాటు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు మైనారిటీ సోదరులు తదితరులు ఉన్నారు..4
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట,డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.1