Shuru
Apke Nagar Ki App…
అనంతగిరి మండలం భీమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల నిల్వలు, హాజరు పట్టికను పరిశీలించిన ఆయన.. వైద్యులు సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలందించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రోగులను పరామర్శించి ఆసుపత్రి సేవలపై ఆరా తీశారు. పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
Shyam
అనంతగిరి మండలం భీమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల నిల్వలు, హాజరు పట్టికను పరిశీలించిన ఆయన.. వైద్యులు సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలందించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రోగులను పరామర్శించి ఆసుపత్రి సేవలపై ఆరా తీశారు. పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Shyam1
- ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి పరిసరాల్లో తురాయి వృక్షాలు ఎర్రటి పూలతో కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, నీలాకాశం కింద కొమ్మ, కొమ్మనా విరబూసిన ఈ ఎర్రటి పూల సోయగం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఈ అందమైన పూల చెట్ల వద్ద ఆగి ఛాయాచిత్రాలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.1
- Post by Maheshwaro2
- పోలవరం జిల్లా గుర్తేడు మండలం పాతకోట గ్రామంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్డు పై చెట్లు పడడంతో గోకవరం నుండి పాతకోట వచ్చే బస్సు కూడ వెనక్కి తిరిగి వెళ్ళింది.వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో వేరుశనగ రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.అలాగే పాతకోట గ్రామంలో గొర్లే దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో భారీ వృక్షం పడడం వలన రేకులు ధ్వంసం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.1
- Choose comfort that flies above the rest — MGM Vests. #MGMVests #Cheepurupalli #PremiumVest #CottonComfort #EverydayComfort #MensInnerwear #AndhraBusiness #LocalStyle #ComfortFirst #QualityWear1
- విశాఖ గాజువాక వికాస్ నగర్ లో కుప్పకూలిన భవనం జాక్స్ సహాయంతో ఇంటిని పైకి లేపే సమయంలో ఘటన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి మరో ఏడుగురికి గాయాలు సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పీఎస్ పోలీసులుభవనం శిధిలాల కింద మరో ముగ్గురు చిక్కుకు పోయినట్లు సమాచారం సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్స్1
- రఘురామకృష్ణ జోక్యంపై ఆగ్రహం – మాల, మాదిగల గౌరవానికి భంగం కలిగిస్తే వదిలిపెట్టం: మంద కృష్ణ మాదిగ ఆకివీడు/భీమవరం: ఆకివీడు వ్యవహారంలో రఘురామకృష్ణ జోక్యం చేసుకుంటే ఊరుకోమని, మాల, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యలనైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. దళితుల గౌరవం, హక్కుల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన, మాల, మాదిగలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజంలో దళితుల గౌరవాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. దళిత సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.1
- నిజం రాశాడు అని జర్నలిస్ట్ కుటుంబం పై దాడి చేశారు! గీతం జూనియర్ కాలేజీ సంస్థ వివాదం వైరల్!అనంతపురంలో గీతం జూనియర్ కాలేజీకి సంబంధించిన అక్రమాలపై కథనాలు రాసిన పాత్రికేయుడు లక్ష్మీనారాయణపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నిజం బయటపెట్టాడనే కారణంతోనే అతన్ని టార్గెట్ చేసి, ఇంటికెళ్లి కుటుంబాన్ని బెదిరించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.తప్పు ఉందని భావిస్తే చట్టపరంగా పోరాడాల్సింది పోయి, దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక జర్నలిస్టుపై దాడి అంటే… నిజం మీద దాడి చేసినట్టే.ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.1