Shuru
Apke Nagar Ki App…
*విశాఖపట్నం రుషికొండ దరి బీచ్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు దగ్ధం* రుషికొండ సమీపంలోని బీచ్ రోడ్డులో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. ఆస్తి నష్టం ఎంత? బస్సులో ఎంతమంది ఉన్నారు? షార్ట్ సర్క్యూట్నే అసలు కారణమా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ....
Ramesh Solanki
*విశాఖపట్నం రుషికొండ దరి బీచ్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు దగ్ధం* రుషికొండ సమీపంలోని బీచ్ రోడ్డులో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. ఆస్తి నష్టం ఎంత? బస్సులో ఎంతమంది ఉన్నారు? షార్ట్ సర్క్యూట్నే అసలు కారణమా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ....
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- *మరో బస్సు ప్రమాదం.....ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి గాయాలు!* తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న నిడదవోలు ఆర్టీసీ బస్సు రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.1
- Post by Gajapally Narsaiah1
- శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నెహ్రు నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి విశిష్ట అతిధులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు దూడం రజిని శ్రీనివాస్, ఎర్ర వెంకటరాజం, మెరుగు మంజుల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూరం శంకర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం వారు నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా మమ్మల్ని మరియు కౌన్సిలర్లను, పద్మశాలి సంఘం అధ్యక్షులు వారిని దేవస్థానం ఆధ్వర్యంలో సన్మానిస్తున్నందుకు ముందుగా వారందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.ఆపద మొక్కులవాడిగా ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా కొలువబడుతున్న ఈ సీతారామాంజనేయుల సాక్షిగా మమ్మల్ని సన్మానించడం తో మా పై మరింత బాధ్యత పెరిగింది అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో బిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి పార్టీలకతీతంగా ఆ సీతారామ భక్తాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో సిరిసిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకు వెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అంతే కాకుండా గత మూడు సంవత్సరాల క్రితం అప్పటి మంత్రివర్యులు కేటీఆర్ సహకారంతో ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించడం జరిగింది.కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి పురపాలక సంఘం నుండి ఇంక కూడ సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం అధ్యక్ష పాలకవర్గ సభ్యులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.1
- Post by వేణు విలేకరి1
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో పెంచికల్పేట్, చింతలమానెపల్లి, బెజ్జూర్, కౌటాల మండలాల్లో కాముడు హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. హోలీకి ఒక రోజు ముందే కోలాటాలు, నృత్యాలతో సంబరాలు జరిపి, సాయంత్రం చేనులో సంప్రదాయంగా కాముడు దహనం చేశారు. మరుసటి రోజు బూడిదను ఇంటి ముందు చల్లడం ఆనవాయితీ. సహజ రంగులతో రెండు రోజుల పాటు పండుగను ఆనందంగా జరుపుకున్నారు1
- *విశాఖపట్నం రుషికొండ దరి బీచ్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు దగ్ధం* రుషికొండ సమీపంలోని బీచ్ రోడ్డులో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. ఆస్తి నష్టం ఎంత? బస్సులో ఎంతమంది ఉన్నారు? షార్ట్ సర్క్యూట్నే అసలు కారణమా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ....1
- సిరిసిల్ల పట్టణంలో స్థానిక 26వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగ రావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి , మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.1