Shuru
Apke Nagar Ki App…
_*నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు పొంగులేటి శ్రీనన్న.. జీవితాంతం రుణపడి ఉంటాం*_ -ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ లో ముస్లిం మైనారిటీ మహిళ భావోద్వేగం
Ramprasad islavath
_*నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు పొంగులేటి శ్రీనన్న.. జీవితాంతం రుణపడి ఉంటాం*_ -ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ లో ముస్లిం మైనారిటీ మహిళ భావోద్వేగం
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- Post by Gurrala vigeswara ramarao5
- రాయిగూడెంలో జరిగిన ప్రజా దర్బార్ లో ఓ ముస్లిం మహిళ భావోద్వేగానికి లోనైంది. “నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం" అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీనిచ్చారు.1
- అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు. అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు. ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు. చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.1
- కాకి చొక్కా ఒంటిపై ఉందన్నా అహంకారంతో ఒక సామాన్య సెలూన్ కార్మికుడి పై ప్రతాపం చూపించాడు ఓ పోలీస్ అధికారి, కరీంనగర్ నగరంలోని ఖాన్ పురా, ఏరియాలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది, కరీంనగర్ జిల్లాలో పోలీస్ అధికారి చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఖాన్ పురా ఏరియాలో ఉన్న సెలూన్కు కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై షేవింగ్ చేయించు కోవడానికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాము అనే వర్కర్, ఎస్సైని ఉద్దేశించి గౌరవంగా కూర్చో అన్నా అని పలికారు. అయితే, ఆ పిలుపు విని సదరు అధికారి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నన్నే అన్నా అంటావా?” అంటూ మండిపడ్డ ఎస్సై, తన హోదాను అడ్డం పెట్టుకుని రాముపై బూతులు తిడుతూ.. విచక్షణార హితంగా దాడి చేశారు. ఒక సామాన్యుడు తనను ‘అన్నా’ అని సంబోధించ డం ఆ అధికారి అహం కారాన్ని దెబ్బతీసినట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. సెలూన్లో అందరూ చూ స్తుండగానే బాధితుడిపై చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ సెలూన్ లోని సిసిటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎస్సై వర్కర్ను కొట్టడం, దురుసుగా ప్రవర్తించడం వంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీ సింగ్?” అంటూ పోలీస్ శాఖపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులపై ఇలాంటి దాడులు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యు డైన త్రీటౌన్ ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు,స్థానికులు కోరుతున్నారు.1
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్దిరాల మండలం చిన్ననెమిల వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పింది.వేగంగా వెళ్లి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మృతుల్లో చిన్ననెమిలకు చెందిన రాధ, జలాలపురానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు.పండగ కోసం హైదరాబాద్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది.ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.1
- Post by Ramprasad islavath1