భారత జనగణన 2027 స్వీయ గణనపై అవగాహన కార్యక్రమం భారత జనగణన 2027 స్వీయ గణన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో స్వీయ గణన (Self Enumeration) కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ టీపీటీ (TPT) ద్వారా స్వీయ గణన విధానంపై వివరంగా తెలియజేశారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే విధానం సులభతరం చేయబడిందని, దీనివల్ల ఖచ్చితమైన సమాచారం సేకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారత జనగణన 2027 స్వీయ గణనపై అవగాహన కార్యక్రమం భారత జనగణన 2027 స్వీయ గణన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో స్వీయ గణన (Self Enumeration) కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ టీపీటీ (TPT) ద్వారా స్వీయ గణన విధానంపై వివరంగా తెలియజేశారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే విధానం సులభతరం చేయబడిందని, దీనివల్ల ఖచ్చితమైన సమాచారం సేకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
భారత జనగణన 2027 స్వీయ గణనపై అవగాహన కార్యక్రమం భారత జనగణన 2027 స్వీయ గణన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో స్వీయ గణన (Self Enumeration) కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ
టీపీటీ (TPT) ద్వారా స్వీయ గణన విధానంపై వివరంగా తెలియజేశారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే విధానం సులభతరం చేయబడిందని, దీనివల్ల ఖచ్చితమైన సమాచారం సేకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారత జనగణన 2027 స్వీయ గణనపై అవగాహన కార్యక్రమం భారత జనగణన 2027 స్వీయ గణన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులు, ప్రింట్
మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో స్వీయ గణన (Self Enumeration) కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ టీపీటీ (TPT) ద్వారా స్వీయ గణన విధానంపై వివరంగా తెలియజేశారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే విధానం సులభతరం చేయబడిందని, దీనివల్ల ఖచ్చితమైన సమాచారం సేకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
- హన్మకొండ జిల్లా: కమలాపూర్ మండల కేంద్రాలో తీగల బావి హనుమాన్ మాలాధారులు ఆదివారం ఉదయం నగర సంకీర్తన ర్యాలీ నిర్వహించారు. పనగట్ల నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు సుమారు 50 ద్విచక్ర వాహనాలపై సుమారు వంద మంది భక్తులు “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో ర్యాలీగా సాగారు. హిందూ, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మాలాధారులు తెలిపారు.1
- మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రజిత దంపతుల ఏకైక కుమారుడు హరిహరన్ సాయి వివాహం దీక్ష తో కన్నుల పండువలా జరిగింది. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఎమ్మెల్యేను అభినందించారు. హైదరాబాదులో జరిగిన వివాహానికి ప్రముఖులు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.4
- గన్నేరువరం మండలం మైలారం–కాసింపేట చౌరస్తా వద్ద ఆదివారం బైక్పై గొర్రెను తరలిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం ఖాసింపేట గ్రామానికి చెందిన సందవేని నాగరాజు గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వెనకాల ఉన్న ఒక గొర్రెను గన్నేరువరం మండలానికి ఒక ఫంక్షన్కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. వీరు బెజ్జంకి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారు TS26D9283 నంబర్ గల రెడ్ కలర్ గ్లామర్ బైక్పై గొర్రెను తీసుకెళ్తుండగా, గన్నేరువరం వద్ద గొర్ల కాపర్లు వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒకరు పరారీలోకి వెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.1
- హైదరాబాద్లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆటో మీటర్పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్లోకి పర్మిషన్ ఇవ్వొద్దంటూ నిరసన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు1
- కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు రామకృష్ణాపూర్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం పై బాల్క సుమన్ స్పందించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ని విమర్శించడంలో అర్తం లేదని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీర్ ను మా రమనిషి అని వ్యాఖ్యానించడం అర్థం లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని స్పష్టం చేశారు1
- పాము కాటుకు మూడేళ్ల బాలుడు మృతి ఎల్కతుర్తి మండలంలోని దామర గ్రామానికి చెందిన వంగ మనవిత్ యాదవ్ (3) అనే బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. వెంటనే బాలుడు తల్లికి చెప్పడంతో హుటాహుటిన భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నాటు వైద్యం చేయించగా, అనంతరం 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. స్పందించిన 108 సిబ్బంది బాలుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో నాటు వైద్యం చేయించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.2
- జనగామ జిల్లాలో ప్రజా పాలన-ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా “హ్యాపీ సండే” నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యోగాసనాలు, నవ్వుల కార్యక్రమం నిర్వహించారు. తడి-పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ ప్రజలు పాల్గొన్నారు.1
- నేటి నుంచి మే 10 వరకు జన గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించామని స్వీయ గణన దేశంలోనే తొలిసారి అమలు చేయడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్ డి ఓ మహేశ్వర్ తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను స్లైడ్స్ ద్వారా వివరించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తొలిసారి స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారని, ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్ లైన్ ప్రక్రియ నేటి నుంచి మే 10 వరకు కొనసాగుతుందన్నారు. 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాల డాటాను అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచబడుతుందని చెప్పారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారికి హెచ్ తో ప్రారంభమయ్యే పదకొండు అంకెల ఐడి వస్తుందని, ఐడిని భద్రపరచుకొని ఇండ్ల గణన సమయంలో వచ్చే ఎన్యూమరేటర్ కు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన గణనలలో పాల్గొని అధికారులకు సహకరించాలి కలెక్టర్ చిత్రామిశ్రా కోరారు.1