మెదక్ జిల్లాలో దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ శిశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు కలెక్టర్ ప్రజా పాలన – ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లో "*దత్తత సహాయక కేంద్రం*" ను ప్రారంభించిన : *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నందు ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో దత్తత సహాయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ , మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజు, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కన్న పిల్లలను పెంచి పోషించలేని వారు, వద్దనుకునే వారు చెత్త కుప్పల్లో, చెట్ల పొదల్లో వేయకూడదని ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా చట్టబద్ధంగా దత్తత ఇస్తామని , దత్తతపై అవగాహన కల్పించేందుకు గాను ఐడిఓసి కలెక్టరేట్ నందు *దత్తత సహాయ కేంద్రాన్ని* ప్రారంభించడం జరిగింది.ప్రతి సోమవారం జరిగే ప్రజా వాణి రోజున కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం అవసరమైన పత్రాలను ప్రభుత్వ మార్గదర్శకాలు వంటి అంశాల సమాచారం కోసం ప్రజలకు ఉపయోగపడేలా దత్తత సహాయక కేంద్రం ఉపయోగపడుతుందని తెలియజేశారు .: జిల్లాలో మొత్తం నాలుగు అడాప్షన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు., అందులో తమిళనాడు ప్రొఫెసర్ ,కరీంనగర్ నగర్ నుండి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయిస్, మరొకరు హైదరాబాద్ కు చెందినవారు. ఉన్నారని తెలిపారు.ఈ సంవత్సరంలో మొత్తం 11 అక్రమ దత్తత ఆపడం జరిగిందని 5 ఎఫైర్ ఫైల్ చేయడం జరిగిందని తెలిపారు.అలాగే అంతర్జాతీయ దత్తత, విదేశీ దత్తత, బంధువుల నుంచి తీసుకున్నటువంటి దత్తత గురించి, పిల్లలను దత్తత తీసుకోవాలనే దంపతులకు సరైన విధానం నియమాలను నమోదు ప్రక్రియ గురించి వాత్సల్య పోర్టలల్ డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ వాత్సల్య . డబ్ల్యు డబ్ల్యు. జిఓవి డాట్ ఇన్ ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని. అక్రమ దత్తతను తీసుకున్నపై కఠినమైన చర్యలుతీసుకోబడతాయని,తెలియజేశారు. పిహెచ్సి లో బాల్ భరోసా స్కీం ద్వారా 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎవరైతే డెవలప్మెంటల్ డిలే ,స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ఉన్నారో వారికి హెల్త్ చెకప్ చేయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ చిన్నపిల్లలను దత్తత తీసుకునేవారు చట్టంలో ఉన్న నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. దత్తత సహాయ కేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తదనంతరం దత్తత పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిఓ యాదయ్య సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
మెదక్ జిల్లాలో దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ శిశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు కలెక్టర్ ప్రజా పాలన – ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లో "*దత్తత సహాయక కేంద్రం*" ను ప్రారంభించిన : *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నందు ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో దత్తత సహాయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ , మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజు, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కన్న పిల్లలను పెంచి పోషించలేని వారు, వద్దనుకునే వారు చెత్త కుప్పల్లో, చెట్ల పొదల్లో వేయకూడదని ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా చట్టబద్ధంగా దత్తత ఇస్తామని , దత్తతపై అవగాహన కల్పించేందుకు గాను ఐడిఓసి కలెక్టరేట్ నందు *దత్తత సహాయ కేంద్రాన్ని* ప్రారంభించడం జరిగింది.ప్రతి సోమవారం జరిగే ప్రజా వాణి రోజున కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం అవసరమైన పత్రాలను ప్రభుత్వ మార్గదర్శకాలు వంటి అంశాల సమాచారం కోసం ప్రజలకు ఉపయోగపడేలా దత్తత సహాయక కేంద్రం ఉపయోగపడుతుందని తెలియజేశారు .: జిల్లాలో మొత్తం నాలుగు అడాప్షన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు., అందులో తమిళనాడు ప్రొఫెసర్ ,కరీంనగర్ నగర్ నుండి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయిస్, మరొకరు హైదరాబాద్ కు చెందినవారు. ఉన్నారని తెలిపారు.ఈ సంవత్సరంలో మొత్తం 11 అక్రమ దత్తత ఆపడం జరిగిందని 5 ఎఫైర్ ఫైల్ చేయడం జరిగిందని తెలిపారు.అలాగే అంతర్జాతీయ దత్తత, విదేశీ దత్తత, బంధువుల నుంచి తీసుకున్నటువంటి దత్తత గురించి, పిల్లలను దత్తత తీసుకోవాలనే దంపతులకు సరైన విధానం నియమాలను నమోదు ప్రక్రియ గురించి వాత్సల్య పోర్టలల్ డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ వాత్సల్య . డబ్ల్యు డబ్ల్యు. జిఓవి డాట్ ఇన్ ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని. అక్రమ దత్తతను తీసుకున్నపై కఠినమైన చర్యలుతీసుకోబడతాయని,తెలియజేశారు. పిహెచ్సి లో బాల్ భరోసా స్కీం ద్వారా 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎవరైతే డెవలప్మెంటల్ డిలే ,స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ఉన్నారో వారికి హెల్త్ చెకప్ చేయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ చిన్నపిల్లలను దత్తత తీసుకునేవారు చట్టంలో ఉన్న నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. దత్తత సహాయ కేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తదనంతరం దత్తత పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిఓ యాదయ్య సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
- ప్రెస్ నోట్: 1/5/2026 * *అమరవీరుల త్యాగ స్పూర్తితో - 8 గంటల పని దినాన్ని కాపాడుకుందాం* - * *కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం* * *కామ్రేడ్ చంద్రశేఖర్ సిఐటియు జిల్లా అధ్యక్షులు* * *మే డే సందర్బంగా సీఐటీయు జెండా ఆవిష్కరణ* సీఐటీయు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఐటీయు *మేడే* సందర్భంగా జరిగిన జెండావిష్కరణ సందర్బంగా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ...1886 లో చికాగో నగరంలోని హె మార్కెట్ వద్ద కార్మికులు 8 గంటల పని దినం కోసం ప్రదర్శన చేస్తుంటే పోలీసులు చేసిన కాల్పుల్లో 7గురు కార్మికులు అమరులైన త్యాగ ఫలితంగా మే డే వచ్చింది. కానీ నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను 29 చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలముగా వారికీ లాభాలు కోసం 4 లేబర్ కోడ్స్ తెచ్చింది.ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు సంఘాటితంగా పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు , బెరసరలు చేసే హక్కు, కార్మికుల తొలగింపులు, ఉద్యోగం భద్రత ఇంకా అనేక కార్మికులు సౌకర్యాలు కోల్పోవడం జరుగుతుంది. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేయాలిసిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు సెక్రెటరీ ముధం అరుణ్ జిల్లా నాయకులు రాజనర్సు, మంద శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేణుక, సత్యం మున్సిపల్ నాయకులు మహబూబ్ సంతోష్ దీవెన వాటర్ వర్క్స్ నాయకులు ఆయాజ్ ప్రభాకర్ నర్సింగరావు గంగాధర్ ఖలీల్ శ్రీధర్ అమాలి సంఘం నాయకులు రమేష్ నర్సింలు స్వామి లింగం రాజేష్ గంగారాం బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జగదీశ్వర్ సాయిబాబా ఈశ్వర్ ఎల్ఐసి నాయకులు నర్సింగరావు నర్సింలు నయీమ్ మెడికల్ రిప్రజెంటిటీ నాయకులు రవీంద్ర చారి మహేందర్ రెడ్డి సంతోష్ మరియు ఇతర నాయకులు కార్మికులు పాల్గొనడం జరిగింది.1
- కార్మికులు తమకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మే డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 1886 పోరాట స్ఫూర్తితోనే ఏటా మే 1న ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.1
- Post by Vishwamber Rao1
- ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగదన ముగింపు పలికేల చర్యలు చేపట్టి, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు తెలిపినా చలించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలను తీర్చడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బానయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.2
- గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ తీగుల్ గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మికులతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి మాజీ సభ్యులు బట్టు దయానంద రెడ్డి పాల్గొని కార్మికుల హక్కుల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల శ్రమే పునాది అని, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఉపాధి హామీ కార్మికులతో కలిసి మే డే వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తీగుల్ గ్రామ మాజీ సర్పంచ్ బెల్దే బిక్షపతి, ఐకెపి బాధ్యులు కే. రమేష్, కే. రేణుక, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సఫాయి కార్మికులు చంద్రయ్య, మధు, లక్ష్మి తో పాటు భవన నిర్మాణ కార్మికులు రవి, ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.4
- బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం సుమారు 5:10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పలు మంది రైతులకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. చెల్కల కొండల్ రెడ్డి (2 ఎకరాలు), చెల్కల ప్రతాప్ రెడ్డి (2 ఎకరాలు), కేశవ రెడ్డి (3 ఎకరాలు), కౌలు రైతు సుదగోని రాజయ్య (1 ఎకరం)లకు చెందిన మొత్తం సుమారు 8 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో రైతులు, స్థానికులు కలిసి అగ్ని నియంత్రణకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లెదుటే పంట పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని బెజ్జంకి తహసిల్దార్ కళ్యాణం శ్రీకాంత్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులకు తగిన పరిహారం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.1
- *140వ మేడే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై* *సమాన పనికి సమాన* *వేతనంకై ఉద్యమీద్దాం* *మేడే వారోత్సవాలు జయప్రదం చేయండి* ఈరోజు మెదక్ పట్టణ కేంద్రంలో మేడే సందర్భంగా 140వ మేడే సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. CITU కార్యలయం కేవల్ కిషన్ భవన్ దగ్గర, మున్సిపల్ కార్యాలయం, MCH హస్సిటల్ , రైల్వే స్టేషన్, భవన నిర్మాణ కార్మికుల అడ్డ, PACS గోదాం వద్ద సిఐటియు జండాలు ఆవిష్కరణ జరిగాయి. అనంతరం *పోస్టపీసు దగ్గర మేడే సభ నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం* ప్రసంగిస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చిన గత 13 సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నది. బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 100 సంవత్సరాల క్రితం నుండి బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను కలిపి వేసి 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చింది. ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి తెస్తూ కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితమై హక్కు కనీస వేతనం అడిగే హక్కు పిఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ సౌకర్యాలకు నోచుకోకుండా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక కార్మిక వర్గం ఐక్యతగా పోరాడాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని దేశంలో సంఘటిత అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు లేక ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు. అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని దినానికై ఉవ్వెత్తున కార్మిక వర్గం పోరాటం చేసి రక్త తర్పణంలో రక్తంలో తడిసిన గుడ్డని ఎర్రజండగా మేడే జెండా ఎగరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సరళీకరణ నూతన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి జే.సంతోష్, వికలాంగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గ నాయకులు షౌకత్ మున్సిపల్ యూనియన్ కార్మికులు రాజా శేఖర్ ఏసు మల్లేశం శోభ ఎల్లవ్వ ఉషవ్వ పోచమ్మ శేఖర్ అంజి హమాలీ కార్మికులు బాల్ నర్సు మల్లేశం గట్టయ్య బాలు ఆంజనేయులు హనుమంత్ తదితరులు పాల్గొన్నారుజే సంతోష్. మెదక్ జిల్లా సహాయ కార్యదర్శి1
- పత్రిక prakat తేది: 01.05.2026 కామారెడ్డి జిల్లా శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమం నిర్వహణ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ–పోషణ అభియాన్, ఆరోగ్య శాఖ–RBSK సంయుక్తంగా ప్రజాపాలన–ప్రగతి నివేదిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, 0-5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో పెరుగుదల లోపాలు, అంగవైకల్యాలు, మానసిక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు, రిఫరల్, సూచనలు అందించడం ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావచ్చని తెలిపారు. జిల్లాలోని 13 RBSK బృందాలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, అంగన్వాడీ టీచర్లు 42 ప్రశ్నల ఆధారంగా గుర్తించిన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించాయి. అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడడం జరుగుతున్నడని కార్యక్రమం మొదటి రోజున జిల్లా ఆసుపత్రిలో 31 మంది రిఫర్ అయిన చిన్నారులకు అవసరమైన చికిత్స, మందులు అందజేశారు. చిన్నారుల పెరుగుదల లోపాలకు గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవీందర్,ఆర్డీవో NV గిరి, RBSK వైద్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రావ్, rbsk రోహిత్, CDPOలు, సూపర్వైజర్లు, DCPO, పోషణ అభియాన్ కోఆర్డినేటర్, అంగన్వాడీ టీచర్లు, ఆసుపత్రి సిబ్బంది,చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.1
- కార్మికుల హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సదాశివపేటలో నిర్వహించిన మే డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. చికాగో నగర కార్మికుల వీరోచిత పోరాట ఫలితమే నేటి మే డే అని గుర్తుచేశారు. కార్మికులకు కచ్చితంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రమజీవుల సంక్షేమానికి అందరూ అండగా ఉండాలని కోరారు.1